సేవ చేద్దాం.. ఆనందాలు పంచుదాం!
కరోనాకు ముందు రక్తదాన శిబిరం అంటే ‘రెడ్ క్రాస్’ సంస్థ ఆధ్వర్యంలోనే ఏర్పాటయ్యేవి. రక్తదాన శిబిరాల నుంచి వైద్య శిబిరాల వరకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ.. ఎందరో ప్రజల మనసుల్లో నాటుకుపోయిన రెడ్ క్రాస్ సంస్థను విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది.
నేడు ‘ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం’
మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే: కరోనాకు ముందు రక్తదాన శిబిరం అంటే ‘రెడ్ క్రాస్’ సంస్థ ఆధ్వర్యంలోనే ఏర్పాటయ్యేవి. రక్తదాన శిబిరాల నుంచి వైద్య శిబిరాల వరకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ.. ఎందరో ప్రజల మనసుల్లో నాటుకుపోయిన రెడ్ క్రాస్ సంస్థను విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఉమ్మడి జిల్లాలో 60 ఏళ్ల క్రితమే రెడ్ క్రాస్ సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీడ్యూనాంట్ జయంతిని పురస్కరించుకుని ఏటా మే 8న ‘ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.
జనరిక్ మందులు.. రక్త నిల్వ కేంద్రం
ఉమ్మడి జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, మోత్కూరులో సంస్థ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా నల్గొండ జిల్లా కేంద్రంలో జనరిక్ మందుల దుకాణం ఏర్పాటు చేశారు. దీని వల్ల పేదలు తక్కువ ధరకే మందులు కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. దీంతో పాటు రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి నెలా సుమారు 200 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరిస్తూ.. అవసరమైన వారికి సరఫరా చేస్తున్నారు. వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేసి నామమాత్రపు రుసుముకే మృతదేహాలను స్మశానవాటికకు తరలిస్తున్నారు. ఫ్రీజర్ బాక్సును సైతం ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారు. సీపీఆర్ తదితర ప్రాథమిక చికిత్సలపై కళాశాలల్లో ఉచిత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో నేత్రదానాన్ని ప్రోత్సహిస్తూ పలువురి జీవితాల్లో వెలుగులు సైతం నింపుతున్నారు. ప్రతి నెలా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ 60 ఏళ్లు పైబడిన వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. మిర్యాలగూడ రెడ్ క్రాస్ సంస్థ సేవా కార్యక్రమాలకు గాను అనేక అవార్డులు సైతం సొంతం చేసుకుంది.
త్వరలోనే సేవల విస్తరణ..
- గోలి అమరేందర్రెడ్డి, రెడ్క్రాస్ ఛైర్మన్, నల్గొండ
కరోనా నుంచి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు తగ్గిపోయాయి. త్వరలోనే సేవలను విస్తరించేందుకు మండల స్థాయిలో సైతం సంస్థ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం. జిల్లా కలెక్టర్ సారథ్యంలో సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. త్వరలోనే వృద్ధాశ్రమం సైతం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సేవా గుణం కలిగిన వారు ఎవరైనా రూ.1,050 చెల్లించి ఆన్లైన్లో సభ్యులుగా చేరవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
నాడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు