logo

విదేశాల్లో ఓటుహక్కు ఇలా..

ఓటు హక్కు సద్వినియోగంపై ఎన్నికల సంఘం అధికారులు అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తున్నప్పటికీ పోలింగ్‌ శాతం పెంపు పూర్తిస్థాయిలో ఉండటం లేదు.

Updated : 08 May 2024 07:09 IST

రాజపేట, ఆలేరు, న్యూస్‌టుడే: ఓటు హక్కు సద్వినియోగంపై ఎన్నికల సంఘం అధికారులు అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తున్నప్పటికీ పోలింగ్‌ శాతం పెంపు పూర్తిస్థాయిలో ఉండటం లేదు. బాధ్యతగా హక్కును వినియోగిస్తేనే సమస్యల పరిష్కారంపై ప్రజా ప్రతినిధులను నిలదీసే ఆస్కారం ఉంటుంది. ఓటు కలిగి ఉన్న ప్రతిఒక్కరూ తమకు నచ్చిన నాయకులకు ఓటేసి తీరాల్సిందే. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం అధికారులు ఒక గంటపాటు సమయాన్ని పొడిగించిన విషయం తెలిసిందే. దీంతోనైనా పోలింగ్‌ శాతం మరింత పెరుగుతుందని ఆశిద్దాం. అయితే ఓటు హక్కు వినియోగంపై కొన్ని దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా చెల్లించే పన్నుకి జరిగే అభివృద్ధికి ఏ మాత్రం తేడా కనిపించినా అక్కడి దేశాల్లో పౌరులు ఉపేక్షించరు. నాయకులు ఎదురుపడితే నిలదీస్తారు. ఎదురు మాట్లాడితే ‘వి ఆర్‌ ట్యాక్స్‌ పేయర్స్‌’ అంటూ ఉద్యమాలు చేపడతారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఓటేసేందుకు వెనుకాడరు. ఆయా దేశాల్లో ఓటు వేయడాన్ని తప్పనిసరి చేస్తూ చట్టాలు చేయడంతో పోలింగ్‌ శాతం పెరుగుతుంది. ఆ విధానాలు ఇక్కడా అమలైతే అద్భుతమైన మార్పులు సాధ్యమవుతాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే కొన్ని దేశాల్లో ఓటు హక్కు వినియోగించుకోకుంటే జరిమానా విధిస్తారు. ఆ పద్ధతులు ఇక్కడా అమలైతే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

  • గ్రీస్‌ దేశంలో..  ఇక్కడ ఓటు వేయని వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు ఇవ్వరు. బలమైన కారణాలు చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు. ఇతర సౌకర్యాలపైనా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ 94 శాతం ఓటింగ్‌ నమోదవుతుంది.
  • బెల్జియంలో.. ఈ దేశంలో వరుసగా నాలుగు సార్లు ఓటేయకపోతే రూ.4వేలు, రెండో సారికి రూ.10వేలు జరిమానా విధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. దీంతో 96 శాతం ఓటింగ్‌ నమోదవుతుంది.
  • ఆస్ట్రేలియాలో..  జరిమానా విధానం అనుసరిస్తున్నారు. ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో ఇక్కడ 98 శాతం పోలింగ్‌ నమోదవుతుంది.
  • సింగపూర్‌లో..  ఈ దేశంలో ఓటు వేయకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తారు. కారణాలను పూర్తి ఆధారాలతో పెద్దల సంతకంతో అందిస్తేనే ఓటుహక్కును పునరుద్ధరిస్తారు. ఇక్కడ కూడా 92 శాతం పోలింగ్‌ నమోదవుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు