ఓటుకు సెలవివ్వొద్దు..!
లోక్సభ ఎన్నికల హడావుడి ముమ్మరమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం వాడీవేడిగా జరుగుతోంది. ఓటుహక్కుపై అధికార యంత్రాంగం విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది.
ఈనాడు డిజిటల్, సూర్యాపేట: లోక్సభ ఎన్నికల హడావుడి ముమ్మరమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం వాడీవేడిగా జరుగుతోంది. ఓటుహక్కుపై అధికార యంత్రాంగం విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. సుపరిపాలన అందించే నిస్వార్థ నాయకుణ్ని ఎన్నుకోవడంలో ఓటర్లంతా భాగస్వాములు కావాలని ఓటర్లలో చైతన్యం తీసుకొస్తోంది.
ఓటు వేసేందుకే..
ప్రతి ఓటరు తమ హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల రోజు ఈసీ సెలవు ప్రకటించింది. అందుకే లోక్సభ ఎన్నికలు జరిగే ఈనెల 13 సెలవు. అంతకు ముందు ఆదివారం సహా రెండో శనివారం. ఇలా వరసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. ఇప్పటికే వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. దీంతో ఇంటిల్లిపాది ఎక్కడికైనా వెళ్దామని భావించే అవకాశముంది. అయితే పోలింగ్ రోజును సెలవు దినంగా భావిస్తే సమున్నత లక్ష్యానికి విఘాతం కలుగుతుందన్న విషయం మరచిపోకూడదు.
పోలింగ్ సమయం పొడిగింపు
ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లడానికి ప్రజలు భయప£డుతున్నారు. పోలింగ్ రోజూ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 46 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6గంటల వరకు పొడిగించింది. ఇది వృద్ధులు, మహిళలకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా ఉదయం 7 గంటల నుంచి 11 గంటలలోపు లేదా సాయంత్రం 4గంటల నుంచి 6గంటల వరకు ఓటేసే అవకాశం ఉంది.
యువతే కీలకం
ఓటుహక్కు వినియోగించడంలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం చాలామంది స్వస్థలాలకు దూరంగా, పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈసారి పోలింగ్కు ముందు రోజు కూడా సెలవు ఉన్నందున ఎక్కడ ఉన్నా సొంత ప్రాంతాలకు చేరుకునేందుకు అవకాశం ఉంది. యువ ఓటర్లు తప్పనిసరిగా ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి ఊపిరులూదిన వారవుతారు. వారు ఓటుహక్కు వినియోగించుకోవడంతో పాటు దివ్యాంగులు, వృద్ధులకు చేయూతనందించే ప్రయత్నం చేయాలి.
2019 ఓటింగ్ శాతాన్ని దాటేలా..
ఉమ్మడి నల్గొండలోని భువనగిరి, నల్గొండ లోక్సభ నియోజకవర్గ స్థానాల్లో 2019 లోక్సభ ఎన్నికల్లో 78.60 శాతం పోలింగ్ నమోదైంది. అంతకు మించి పోలింగ్ శాతం పెంచాలని అధికారులు కృషి చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగాలంటే ఓటుహక్కు ఉన్న వారంతా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
నాడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు