logo

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్మరణం

 మండలంలోని నరసాపురం-కావలి మధ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొండాపురం పోలీసు స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీహరి(53) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కావలిలో నివసిస్తున్న శ్రీహరి శనివారం ఉదయం విధుల్లో పాల్గొ

Published : 22 May 2022 03:32 IST

 

గుడ్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని నరసాపురం-కావలి మధ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొండాపురం పోలీసు స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీహరి(53) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కావలిలో నివసిస్తున్న శ్రీహరి శనివారం ఉదయం విధుల్లో పాల్గొనేందుకు దశరథరామిరెడ్డితో కలిసి ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. నరసాపురం సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న బొలెరో వాహనం వేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు కిందపడ్డారు. వెనుక కూర్చున్న శ్రీహరికి తీవ్రగాయాలవడంతో 108 వాహనంలో కావలి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.. దశరథరామిరెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గుడ్లూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని