మూతపడిన నోడల్ స్టోరు
మండల నోడల్ స్టోరు. ఈ పేరు వింటే గుడ్లూరు మండలంలోని దుకాణదారులకు ప్రాణం లేచి వస్తుంది. పట్టణాల నుంచి సరకులు తెచ్చుకుని దుకాణాల్లో విక్రయిస్తే మిగిలేది కొంతమాత్రమే.
మహిళలకు ఇబ్బందులు
కందుకూరు,(గుడ్లూరు), న్యూస్టుడే
మూతబడిన దుకాణం
మండల నోడల్ స్టోరు. ఈ పేరు వింటే గుడ్లూరు మండలంలోని దుకాణదారులకు ప్రాణం లేచి వస్తుంది. పట్టణాల నుంచి సరకులు తెచ్చుకుని దుకాణాల్లో విక్రయిస్తే మిగిలేది కొంతమాత్రమే. అవే వస్తువులను ఆర్ఆర్సీలో కొనుగోలు చేసి చిల్లర దుకాణాల ద్వారా విక్రయిస్తే లాభాలు అధికంగా ఉండేవి. ఇదంతా ఒకప్పటి సంగతి. ప్రస్తుతం రూరల్ రిటైల్ చైన్ (ఆర్ఆర్సీ) నెలరోజులుగా తెరుచుకోవటంలేదు. దీంతో మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
* ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అప్పటి తెదేపా ప్రభుత్వం పదకొండు మండల కేంద్రాల్లో రూరల్ రిటైల్చైన్ కింద నోడల్ స్టోర్సును 2014లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ దుకాణాన్ని నిర్వహింస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సంఘాల్లోని మహిళలు గ్రామాల్లో కిరాణ దుకాణాలు ఏర్పాటు చేసుకుంటే వారికి హోల్సేల్ ధరలకే దీని నుంచి సరకులు ఇచ్చేవారు. మహిళలు ఆర్థికంగా లాభపడాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు.
* మండల కేంద్రం గుడ్లూరులో సుమారు రూ.15 లక్షల మూల ధనంతో దుకాణం ఏర్పాటైంది. అమ్మకాలు, నిర్వహణలో తెదేపా ప్రభుత్వం ఉన్న అయిదు సంవత్సరాలపాటు రాష్ట్రంలో ఈ దుకాణం ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి మండలంలోని గ్రామాల్లో 90 మంది మహిళా సభ్యులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలకు సరకులు సరఫరా అవుతుండేవి. సంవత్సరానికి సుమారు రూ.కోటి వరకు లావాదేవీలు నిర్వహించే వారు.
* 2019 నుంచి ఈ దుకాణం అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. గతంలో మహిళా సంఘాల సభ్యులు దుకాణం నిర్వహించే వారు. ప్రభుత్వం మారిన తరువాత పాత వారిని తొలగించి వెలుగు సీసీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు పూర్తి స్థాయిలో నిర్వహణపై శ్రద్ధ పెట్టకపోవడంతో అమ్మకాలు క్రమంగా తగ్గాయి. దీనికి తోడు ప్రధానవీధిలో పెద్ద దుకాణం నుంచి బ్యాంకు సమీపంలోని చిన్న గృహంలోకి మార్చడంతో వస్తువుల సంఖ్య తగ్గింది. అమ్మకాలు సరిగా లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంతో రాష్ట్రంలో పేరు తెచ్చుకున్న దుకాణం నేడు మూతబడి ఉంది. ఫలితంగా ప్రభుత్వ ఉద్దేశం పక్కదారిపట్టింది. మహిళా సంఘాలకు దుకాణ నిర్వహణ బాధ్యతలను అప్పగించి పూర్వవైభవాన్ని తీసుకు రావాలని పలువురు మహిళా సంఘ సభ్యులు కోరుతున్నారు.
అనారోగ్యంతో తెరవలేదు
- అశోక్ , ఏపీఎం, గుడ్లూరు
గత మూడు సంవత్సరాలుగా వెలుగు సీసీ ద్వారా అమ్మకాలు చేస్తున్నాం. పాత భవనం అసౌకర్యంగా ఉండటంతో బ్యాంకు సమీపంలోని గృహానికి మార్చాం. నిర్వహణ చూస్తున్న సీసీ అనారోగ్యంతో ఉండటంతో దుకాణం తెరవలేకపోయారు. పరిశీలించి మళ్లీ దుకాణాన్ని తెరిచి ఎప్పటిలా లావాదేవీలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం
[ 27-04-2024]
దగదర్తిలోని పెద్దపుత్తేడు గ్రామం అరుంధతి వాడలో మండల తెదేపా నాయకుడు మాలేపాటి రవీంద్ర నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
[ 27-04-2024]
వైద్యసేవలు ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. హెల్త్ క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వైద్యసేవలను అందించేందుకు ఎంఎల్హెచ్పీలు సిబ్బందిని నియమించారు. -
ఉన్నత విద్య.. జగన్ మిథ్య
[ 27-04-2024]
విశ్వవిద్యాలయాలు ప్రగతిపథంలో నడవాలన్నా.. విద్యార్థులు చేరేందుకు పోటీపడాలన్నా.. పేరున్న విదేశీ విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలన్నా.. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
నేడు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.25కు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
ఓటుతో.. వైకాపాను తరిమికొడదాం
[ 27-04-2024]
‘ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలి. ప్రజల సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా కాదు.. -
అధికారమే అండ.. ఆక్రమణలే అజెండా!
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక సాగునీటి వనరులకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీగా కనిపిస్తే చాలు.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సాగునీటి కాలువలనే ఆలోచన లేకుండా కబ్జా చేస్తున్నారు. -
నిమ్మధరలు ఆశాజనకం
[ 27-04-2024]
పొదలకూరు నిమ్మ మార్కెట్లో శుక్రవారం 80 కిలోల నిమ్మకాయల బస్తా రూ.9500 పలికింది. రెండు రోజుల నుంచి నిమ్మ ధరల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. -
ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించండి
[ 27-04-2024]
ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే పోలీసు అధికారులకు సూచించారు. -
జగనన్నా.. గొంతెండుతోందయ్యా!
[ 27-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. నీటి వనరులు వట్టిపోతున్నాయి. దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు దొరకడం లేదు. గొంతులు తడారిపోతున్నాయి. -
పట్టణాభివృద్ధిలో వైశ్యుల పాత్ర కీలకం: తెదేపా
[ 27-04-2024]
పట్టణ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమైందని తెదేపా అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో తెదేపా ఎన్నికల కార్యాలయాన్ని ఆర్యవైశ్య నాయకులు గాదంశెట్టి వేణుగోపాల్ నేతృత్వంలో ప్రారంభించారు. -
బాలయ్యా.. మా గుండెల్లో నీవేనయ్యా!
[ 27-04-2024]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కావలి, గుడ్లూరులో పర్యటించారు. -
జగన్ సర్కార్ ఉత్తుత్తి సాయం
[ 27-04-2024]
మహిళలను ఆర్థికంగా లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం రుణాలు అందజేస్తామనీ, వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపడతామనే ఆశయం గాడి తప్పింది. -
వైకాపా పాలనలో కూలేందుకు సిద్ధం
[ 27-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు... పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి...