ప్రసవానికొస్తే కోతే!
కాన్పుల్లో కోతలు ఆగడం లేదు. ప్రభుత్వం సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ జిల్లాలో మాత్రం మార్పు కనిపించడం లేదు.
లక్ష్యానికి దూరంగా ప్రభుత్వ ఆసుపత్రులు
ప్రైవేటులో 80 శాతం శస్త్రచికిత్సలే
కాన్పుల్లో కోతలు ఆగడం లేదు. ప్రభుత్వం సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ జిల్లాలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఏటేటా ఆ సంఖ్య పెరుగుతుండగా- శస్త్రచికిత్సల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు విఫలమవుతున్నాయి. సాధారణ ప్రసవాలు పెంచడానికి నిర్వహిస్తున్న సదస్సులు, అవగాహన తరగతులు, సమీక్షలు నామమాత్రంగా మిగులుతున్నాయి. ఫలితంగా జిల్లాలో ఏడాదికి సగటున 75 కాన్పులు జరుగుతుంటే... అందులో 50కిపైగా శస్త్రచికిత్సలే కావడం గమనార్హం. జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో సైతం సహజం కంటే ఆపరేషన్లు అధికంగా ఉండటం కలవరపెడుతోంది.
ఈనాడు డిజిటల్, నెల్లూరు: దుత్తలూరు, వెంకటాచలం, న్యూస్టుడే:
జిల్లాలో వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ) పరిధిలో 13 ఆసుపత్రులు ఉండగా- వీటిలో 10 సామాజిక(సీహెచ్సీ), 2 ప్రాంతీయ, 1 జిల్లా ఆసుపత్రి ఉన్నాయి. నాడు-నేడు పథకంలో 30 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాలను 50 నుంచి 100కు ఉన్నతీకరించారు. పెంచిన పడకలకు అనుగుణంగా ప్రసూతీ(గైనకాలజీ), మత్తు (ఎనస్తీషియా), చిన్నపిల్లల(పీడియాట్రిక్) వైద్య నిపుణులను నియమించినా.. ప్రసూతీ సేవల విషయంలో సర్కారు ఆసుపత్రులు సంతృప్తి కలిగించలేకపోతున్నాయి. ప్రసవాల కోసం గర్భిణులు ఇంకా ప్రైవేటు ఆసుపత్రుల వైపే చూస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు నెలకు 30 నుంచి 350 ప్రసవాలు నిర్దేశించినా.. అందులో సగమైనా చేరుకోవడం లేదు. రూ.కోట్లతో వైద్యశాలలను అభివృద్ధి చేసినా.. వైద్య నిపుణులందరినీ నియమించినా.. నిర్దేశించిన సేవలందించడంలో వెనుకడుగే కనిపిస్తోంది. కొన్నిచోట్ల పరీక్షించి.. ఏదో ఒకసాకు చెప్పి ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులకు పంపిస్తుండటంతో సర్కారు లక్ష్యం నీరుగారుతోంది.
ఇదీ సేవల తీరు
* కావలి ప్రాంతీయ ఆసుపత్రిలో 100 పడకలు ఉండగా- నెలకు 200 వరకు ప్రసవాలు జరగాలని లక్ష్యంగా పెట్టారు. ఏ నెలా ఇక్కడ వంద కూడా దాటలేదు. గత జనవరిలో 68, ఫిబ్రవరిలో 57 జరిగాయి. ఇక్కడ పనిచేస్తున్న కొందరు డాక్టర్లు ప్రైవేటులో పని చేస్తుండటంతో.. ఇక్కడకు వచ్చే వారిని అక్కడికి పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఓ గర్భిణిని ఐవీఆర్ఎస్ ద్వారా సంప్రదించారు. ప్రైవేటులో చేరడానికి కారణం ఏమిటని అడగ్గా.. ఆశా కార్యకర్త తీసుకువచ్చారని చెప్పడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఆ విషయాన్ని సర్దుబాటు చేశారు.
* వెంకటాచలం సామాజిక ఆసుపత్రికి 9 నెలల కిందట సీహెచ్సీగా, మూడు నెలల క్రితం 24 గంటల ఆసుపత్రిగా మార్చారు. ఎనిమిది మంది వైద్యులు, అయిదుగురు నర్సులు, ఇతర సిబ్బందిని నియమించినా.. ఒక్కరూ కనిపించరు. ఇక్కడ నెలకు 30 ప్రసవాలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా- గత ఏడాది కాలంలో కేవలం 34 చేశారు. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ‘ఈనాడు’ పరిశీలించగా- ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు. వైద్యులు అందుబాటులో లేరు. ఈ పరిస్థితుల వల్లనే చుట్టుపక్కల ప్రజలు నెల్లూరు వస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
* వింజమూరు సీహెచ్సీలో 50 పడకలు ఉండగా- ఇక్కడ నెలకు 30 కాన్పులు చేయాల్సి ఉన్నా.. గత ఏడాదిలో 41 మాత్రమే చేశారు. ఇందులో 36 సాధారణం, 5 శస్త్రచికిత్సలు. అన్ని వసతులు కల్పించినా.. వైద్యులు అవగాహన కల్పించకపోవడంతో పాటు ప్రైవేటుకు సూచిస్తున్నారని.. డబ్బు చెల్లించే స్థోమత లేదని చెప్పిన వారిని ఆత్మకూరు ఆసుపత్రికి పంపిస్తున్నట్లు తెలిసింది. ః ఇందుకూరుపేట, అల్లూరుల్లోనూ ఇదే పరిస్థితి. రాపూరు, కోవూరు, ఉదయగిరి, పొదలకూరు ప్రాంతాల్లో కాన్పులు లక్ష్యం చేరుకోలేదు. సగటున 15 నుంచి మాత్రమే చేయగలుగుతున్నారు. తగినంత మంది వైద్యనిపుణులన్నా పెంచలేకపోతున్నారు.
వెంకటాచలం పీహెచ్సీలో అందుబాటులో ఉన్న సామగ్రి
నమ్మకం కల్పించకనే..!
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య నిపుణులు 24 గంటలూ అందుబాటులో ఉంటారనే నమ్మకం కలిగించలేకపోతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తూ.. ప్రైవేటు క్లినిక్లలో సేవలకే కొందరు పరిమితం కావడంతో ప్రసూతీ సేవలు దారి తప్పుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల సర్కారు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స చేయించుకోవడానికి సొమ్ములు చెల్లించాల్సిన పరిస్థితి ఉండగా- ఆ డబ్బులేవో ప్రైవేటులో ఇచ్చుకుంటే.. మెరుగైన వైద్యం అందుతుందని వెళ్లిపోతున్న వారూ ఉన్నారు. సర్కారు ఆసుపత్రుల్లో కాన్పు అయితే.. కొన్నిచోట్ల ఆరోగ్యశ్రీలో నమోదు చేయడం లేదు. ఫలితంగా ఆసరా సాయం అందడం లేదు. అదే ప్రైవేటులో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగానే శస్త్రచికిత్సలు చేస్తున్నారు. దీంతో చాలా మంది అటువైపు వెళ్లిపోతున్నారు. ఈ కారణాలతోనే ప్రభుత్వ వైద్యశాలలు ప్రసన లక్ష్యానికి దూరంగా ఉండిపోతున్నాయి.
లక్ష్యాలు చేరుకుంటాం
పెంచలయ్య, డీఎంహెచ్వో
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్దేశించిన మేరకు ప్రసవాలు జరిగేలా చూస్తాం. తరచూ నిర్వహించే సమీక్షల్లో వైద్యులకు సూచిస్తున్నాం. ఇటీవల కాలంలో అన్నిచోట్ల పూర్తిస్థాయిలో నిపుణులను నియమించారు. కాన్పుల సంఖ్య పెంచడానికి అవకాశం ఉంది. సాధారణ ప్రసవాలు చేయాలని అవగాహన కల్పిస్తున్నాం. అవసరం లేకున్నా శస్త్రచికత్సలు చేసినట్లు తెలిస్తే తగు చర్యలు తీసుకుంటాం.
ఇదీ పరిస్థితి
మొత్తం కాన్పులు 27,237
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,672
ప్రైవేటులో 18,565
సిజేరియన్లు 80 శాతం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
[ 27-04-2024]
వైద్యసేవలు ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. హెల్త్ క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వైద్యసేవలను అందించేందుకు ఎంఎల్హెచ్పీలు సిబ్బందిని నియమించారు. -
ఉన్నత విద్య.. జగన్ మిథ్య
[ 27-04-2024]
విశ్వవిద్యాలయాలు ప్రగతిపథంలో నడవాలన్నా.. విద్యార్థులు చేరేందుకు పోటీపడాలన్నా.. పేరున్న విదేశీ విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలన్నా.. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
నేడు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.25కు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
ఓటుతో.. వైకాపాను తరిమికొడదాం
[ 27-04-2024]
‘ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలి. ప్రజల సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా కాదు.. -
అధికారమే అండ.. ఆక్రమణలే అజెండా!
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక సాగునీటి వనరులకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీగా కనిపిస్తే చాలు.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సాగునీటి కాలువలనే ఆలోచన లేకుండా కబ్జా చేస్తున్నారు. -
నిమ్మధరలు ఆశాజనకం
[ 27-04-2024]
పొదలకూరు నిమ్మ మార్కెట్లో శుక్రవారం 80 కిలోల నిమ్మకాయల బస్తా రూ.9500 పలికింది. రెండు రోజుల నుంచి నిమ్మ ధరల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. -
ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించండి
[ 27-04-2024]
ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే పోలీసు అధికారులకు సూచించారు. -
జగనన్నా.. గొంతెండుతోందయ్యా!
[ 27-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. నీటి వనరులు వట్టిపోతున్నాయి. దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు దొరకడం లేదు. గొంతులు తడారిపోతున్నాయి. -
పట్టణాభివృద్ధిలో వైశ్యుల పాత్ర కీలకం: తెదేపా
[ 27-04-2024]
పట్టణ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమైందని తెదేపా అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో తెదేపా ఎన్నికల కార్యాలయాన్ని ఆర్యవైశ్య నాయకులు గాదంశెట్టి వేణుగోపాల్ నేతృత్వంలో ప్రారంభించారు. -
బాలయ్యా.. మా గుండెల్లో నీవేనయ్యా!
[ 27-04-2024]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కావలి, గుడ్లూరులో పర్యటించారు. -
జగన్ సర్కార్ ఉత్తుత్తి సాయం
[ 27-04-2024]
మహిళలను ఆర్థికంగా లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం రుణాలు అందజేస్తామనీ, వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపడతామనే ఆశయం గాడి తప్పింది. -
వైకాపా పాలనలో కూలేందుకు సిద్ధం
[ 27-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు... పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి...
తాజా వార్తలు (Latest News)
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం