పిడుగుపాటుకు బాలుడి మృతి
ఉరుములు, మెరుపులతో అకాల వర్షానికి పిడుగు పడి ఆవుల నాని(10) అనే బాలుడు మృత్యువాత పడిన సంఘటన బ్రాహ్మణక్రాక వద్ద కాకమ్మ చెరువు సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది.
జలదంకి, న్యూస్టుడే: ఉరుములు, మెరుపులతో అకాల వర్షానికి పిడుగు పడి ఆవుల నాని(10) అనే బాలుడు మృత్యువాత పడిన సంఘటన బ్రాహ్మణక్రాక వద్ద కాకమ్మ చెరువు సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. వీఆర్వో బాలకోటయ్య తెలిపిన వివరాల మేరకు... మనుబోలు మండలంలోని మడమనూరుకు చెందిన ఆవుల శ్రీనివాసులు, అల్లూరమ్మ దంపతుల కుమారుడు నాని మండలంలోని బ్రాహ్మణక్రాక గిరిజన కాలనీలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికొచ్చాడు. గురువారం ఉదయం తాత దేవరకొండ మాలకొండయ్యతో కలసి బాతులను మేపేందుకు సమీపంలోని కాకమ్మ చెరువు వద్దకెళ్లాడు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పెద్ద శబ్దంతో చెరువు సమీపంలో పిడుగు పడటంతో ఒక్కసారిగా ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. కొంత సమయానికి తాత కోలుకోగా.. మనుమడు ఆవుల నాని సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!