ఎన్నికా.. ఏకగ్రీవమా!
స్టోన్హౌస్పేట, న్యూస్టుడే: దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నెల్లూరు రెడ్క్రాస్ పాలకవర్గం ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
నేడు రెడ్క్రాస్ సర్వసభ్య సమావేశం
ఈనాడు డిజిటల్, నెల్లూరు: స్టోన్హౌస్పేట, న్యూస్టుడే: దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నెల్లూరు రెడ్క్రాస్ పాలకవర్గం ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు జరుగుతాయా? ఏకగ్రీవంగా ఛైర్మన్ను ఎన్నుకుంటారా? అన్న దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఆదివారం నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో కలెక్టర్ చక్రధర్బాబు అధ్యక్షతన జరిగే సర్వసభ్య సమావేశంలో ఈ విషయం ప్రధానంగా చర్చకు రానుందని సమాచారం. ఎన్నికలు లేకుండా పాలకవర్గాన్ని ఎన్నుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆ మేరకు శాశ్వత సభ్యులతో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు ఛైర్మన్గా వ్యవహరించిన పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ క్రమంలో ఛైర్మన్ రేసులో ఎవరున్నారు? అనే విషయం పరిశీలిస్తున్నారు. ఏకగ్రీవమైతే చంద్రశేఖర్రెడ్డినే మరోసారి ఎన్నుకునేందుకు అవకాశం ఉందని కొందరు సభ్యులు చెబుతున్నారు. దీనిపై ఆదివారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది జరిగితే.. అదే రోజు కొత్త ప్యానల్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
గతంలో హోరాహోరీ.. 2020లో రెడ్క్రాస్ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. అప్పుడు సుమారు 4,871 మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. ఛైర్మన్తో పాటు.. 15 మంది సభ్యులకు జరిగే ఎన్నికలకు 46 మంది పోటీ చేశారు. వారిలో 16 మంది స్వతంత్ర అభ్యర్థులు కాగా.. మిగిలిన 30 మంది రెండు ప్యానెళ్లుగా ఏర్పడ్డారు. రెడ్క్రాస్ సేవా ప్యానల్ విజయం సాధించడంతో చంద్రశేఖర్రెడ్డి ఛైర్మన్గా ఎన్నికయ్యారు. 15 మంది సభ్యుల్లో ఇద్దరు మరణించగా.. ఒకరి గుర్తింపు రద్దయింది. ఈ మూడేళ్లలో శాశ్వత సభ్యులను విపరీతంగా చేర్చారు. ప్రస్తుతం ఏడువేల మందికిపైగా ఉన్నారు. దీంతో ఎన్నికలు జరిగినా.. రెడ్క్రాస్ సేవా ప్యానల్ విజయం సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో పోటీ చేసిన సభ్యుల్లో చాలా మంది ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు.
ఎన్నికలైతే...ఏకగ్రీవం కాకుండా ఎన్నికలు జరిగితే.. ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 1గంట వరకు కస్తూర్బా కళాక్షేత్రంలో నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 2 తర్వాత పరిశీలన, తుది జాబితా ప్రకటిస్తారు. సాయంత్రం 5 నుంచి ఉపహరించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 8 నుంచి 2 గంటల వరకు నెల్లూరు నగరంతో పాటు.. జిల్లాలోని అన్ని బ్రాంచ్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. 3వ తేదీ నెల్లూరులోని రెడ్క్రాస్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు లెక్కింపు అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు. గెలుపొందిన వారిలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్, ట్రెజరర్ పదవుల కోసం పోటీ ఉంటే.. 4వ తేదీ ఎన్నిక నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
[ 27-04-2024]
వైద్యసేవలు ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. హెల్త్ క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వైద్యసేవలను అందించేందుకు ఎంఎల్హెచ్పీలు సిబ్బందిని నియమించారు. -
ఉన్నత విద్య.. జగన్ మిథ్య
[ 27-04-2024]
విశ్వవిద్యాలయాలు ప్రగతిపథంలో నడవాలన్నా.. విద్యార్థులు చేరేందుకు పోటీపడాలన్నా.. పేరున్న విదేశీ విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలన్నా.. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
నేడు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.25కు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
ఓటుతో.. వైకాపాను తరిమికొడదాం
[ 27-04-2024]
‘ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలి. ప్రజల సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా కాదు.. -
అధికారమే అండ.. ఆక్రమణలే అజెండా!
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక సాగునీటి వనరులకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీగా కనిపిస్తే చాలు.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సాగునీటి కాలువలనే ఆలోచన లేకుండా కబ్జా చేస్తున్నారు. -
నిమ్మధరలు ఆశాజనకం
[ 27-04-2024]
పొదలకూరు నిమ్మ మార్కెట్లో శుక్రవారం 80 కిలోల నిమ్మకాయల బస్తా రూ.9500 పలికింది. రెండు రోజుల నుంచి నిమ్మ ధరల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. -
ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించండి
[ 27-04-2024]
ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే పోలీసు అధికారులకు సూచించారు. -
జగనన్నా.. గొంతెండుతోందయ్యా!
[ 27-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. నీటి వనరులు వట్టిపోతున్నాయి. దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు దొరకడం లేదు. గొంతులు తడారిపోతున్నాయి. -
పట్టణాభివృద్ధిలో వైశ్యుల పాత్ర కీలకం: తెదేపా
[ 27-04-2024]
పట్టణ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమైందని తెదేపా అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో తెదేపా ఎన్నికల కార్యాలయాన్ని ఆర్యవైశ్య నాయకులు గాదంశెట్టి వేణుగోపాల్ నేతృత్వంలో ప్రారంభించారు. -
బాలయ్యా.. మా గుండెల్లో నీవేనయ్యా!
[ 27-04-2024]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కావలి, గుడ్లూరులో పర్యటించారు. -
జగన్ సర్కార్ ఉత్తుత్తి సాయం
[ 27-04-2024]
మహిళలను ఆర్థికంగా లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం రుణాలు అందజేస్తామనీ, వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపడతామనే ఆశయం గాడి తప్పింది. -
వైకాపా పాలనలో కూలేందుకు సిద్ధం
[ 27-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు... పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి...