ఆర్ఐ రోడ్డుకు జగన్ పోటు
తీరంలో నాలుగు మండలాల ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది.
2 లక్షల మందికి నరకం
నాటి పనులను నిలిపేసిన ప్రభుత్వం
ఇస్కపల్లి రోడ్డు దుస్థితి
తీరంలో నాలుగు మండలాల ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. గత తెదేపా ప్రభుత్వంలో మంజూరైన పని కావడంతో గుత్తేదారుకు బిల్లులు నిలిపేసింది. అడుగడుగునా గోతులు పడినా అయిదేళ్లుగా చారెడు మట్టి పోయలేదు. దీంతో ప్రమాదకరంగా మారిన మార్గంలో రెండు లక్షల మందికిపైగా ప్రజలు అగచాట్లు పడుతున్నారు. ఇదీ రాజుపాలెం- ఇస్కపల్లి(ఆర్.ఐ) రోడ్డు పరిస్థితి.
న్యూస్టుడే, అల్లూరు
జిల్లా కేంద్రమైన నెల్లూరు నుంచి రాజుపాలెం మీదుగా ఇస్కపల్లి వెళ్లేందుకు ఆంగ్లేయుల కాలంలో రహదారి నిర్మించారు. దీనిమీదుగా బోగోలు, అల్లూరు, విడవలూరు, కొడవలూరు మండలాల వారు రాకపోకలు సాగిస్తుంటారు. నాటి అవసరాల మేరకు సింగిల్ లైనుగా వేశారు. తీరంలో మత్స్య, ఉప్పు పరిశ్రమలు వృద్ధి చెందాయి. ఆయా సంస్థల వాహనాలతో పాటు బస్సులు, వ్యక్తిగత వాహనాల రద్దీ భారీగా పెరగడంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈనేపథ్యంలో రెండు వరుసలుగా మార్చేందుకు గత తెదేపా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిధులు మంజూరయ్యాయి. ఈపనులు ప్రారంభించే లోపు ఎన్నికలు జరగడంతో వైకాపా అధికారంలోకి వచ్చింది. నిధులు ఉన్నా పనులు చేయించడంలో నిర్లక్ష్యం వహించారు. ఎట్టకేలకు రెండేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. కానీ చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు పనులు ఆపేశారు. అయిదేళ్లుగా మరమ్మతులు లేకపోవడంతో రహదారి ఛిద్రమైంది.
కేంద్ర స్థాయి నాయకులున్నా..
రోడ్డు గుంతలుగా మారటంతో ప్రయాణం కష్టంగా మారింది. ఈ ప్రాంత వాసులైన మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎంపీలు ఆదాల ప్రభాకరరెడ్డి, బీద మస్తాన్రావు ఉన్నా ఈరహదారి బాగుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు.
అదనంగా ఇంధనం ఖర్చవుతోంది
శ్రీనివాసులు, అల్లూరుపేట
అల్లూరు నుంచి నెల్లూరుకు పోవాలంటే అదనంగా ఇంధనం అవుతోంది. కారుకు రెండు లీటర్లు అదనంగా పోయాల్సి వస్తోంది. ఇందుకు రూ.200లకు పైగా ఖర్చవుతోంది. అయిదేళ్లుగా అవస్థలు పడుతున్నాను.
ఆటో విక్రయించా: జిలానీ, అల్లూరు
ఆటో నడిపి జీవనం సాగించేవాడిని. రోడ్డు కారణంగా తరచూ మరమ్మతులకు ఖర్చు చేయాల్సి వస్తుంది. నా ఆదాయం అంతా దీటికే సరిపోతోంది. కుటుంబ పోషణ భారమైంది. దీంతో ఆటో విక్రయించి కూలి పనులకు పోతున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో చేరిన పలువురు వైకాపా నేతలు
[ 02-05-2024]
దగదర్తి మండలం కౌరుగుంట పంచాయతీ సున్నపుబట్టీ గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన పలువురు వైకాపా నాయకులు మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. -
తెదేపా ప్రభంజనం ఖాయం
[ 02-05-2024]
‘నెల్లూరు జిల్లాలో తెదేపా ప్రభంజనం ఖాయం. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డితో పాటు.. నెల్లూరు నగర, గ్రామీణ ఎమ్మెల్యేలుగా నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలను గెలిపించండి. -
జగనన్న ఇళ్లు.. అక్రమాల వాకిళ్లు!
[ 02-05-2024]
ఒక్క అవకాశమివ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తాం.. అని ఎన్నికల ముందు హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. -
బ్యాంకు ఖాతాలకు జమకాని నగదు
[ 02-05-2024]
పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం పండుటాకులతో రాజకీయ ఆట ఆడుకుంటూ వృద్ధులు, దివ్యాంగులను అష్టకష్టాలు పెడుతోంది. -
రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్
[ 02-05-2024]
సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ను కేంద్ర ఎన్నికల పరిశీలకులు నితిన్ సింగ్ బదారియా పర్యవేక్షణలో కలెక్టర్ ఎం.హరినారాయణన్ నిర్వహించారు. -
ఇవేనా ఊళ్లు.. లబ్ధిదారులకు కన్నీళ్లు
[ 02-05-2024]
నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని వైకాపా గత ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసింది. -
వారాంతపు సెలవులకు జగన్ టోపి
[ 02-05-2024]
శాంతి భద్రతలు బాగుండాలన్నా.. వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలన్నా.. సమాజం సుఖసంతోషాలతో ఉండాలన్నా పోలీసులతోనే సాధ్యం. -
అధికార పార్టీ.. ప్రలోభాల ఎర!
[ 02-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల తేదీ దగ్గరపడేకొద్దీ అధికార పార్టీ.. ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేసింది. ఎలాగైనా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలనే లక్ష్యంతో అడ్డదారులు తొక్కేందుకు సిద్ధమవుతోంది. -
తాగునీటికి కటకట
[ 02-05-2024]
సిద్ధార్థనగర్ ఆనుకుని పట్టణం నుంచి మురుగు ప్రవహిస్తోంది. అక్కడి బోరు నీరు రంగు మారి వినియోగానికి పనికి రావటంలేదు. -
స్వచ్ఛత మాయం.. రోగాలు ఖాయం
[ 02-05-2024]
ఇంటింటికీ చెత్త సేకరిస్తాం.. పట్టణాన్ని చెత్త రహితంగా చేస్తాం.. ఇదీ పురపాలకు నినాదం.. కానీ ఆచరణలో పాటించడం లేదు.వీధుల్లో చెత్త శుభ్రం చేయడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మేం 60 రన్స్ వెనుకబడ్డాం: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు