logo

తెదేపాలో చేరిన పలువురు వైకాపా నేతలు

దగదర్తి మండలం కౌరుగుంట పంచాయతీ సున్నపుబట్టీ గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన పలువురు వైకాపా నాయకులు మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు.

Published : 02 May 2024 10:17 IST

కావలి: దగదర్తి మండలం కౌరుగుంట పంచాయతీ సున్నపుబట్టీ గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన పలువురు వైకాపా నాయకులు మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. గ్రామానికి చెందిన 7వ  వార్డు మెంబర్ ఆడిపూడి సుబ్బమ్మ,  ఆమె భర్త శ్రీనివాసులు మరో 30 మందితో కలిసి తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా  రవీంద్రనాయుడు మాట్లాడుతూ తెదేపాలో  చేరిన కుటుంబాలకు ఏ అవసరమున్నా తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు.  తదుపరి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెదేపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు