అగ్రిగోల్డ్ భూముల్లోని కలప అక్రమ రవాణా
మండలంలోని రాచవారిపల్లి- తురకపల్లి మార్గంలో సుమారు 200 ఎకరాల్లో అగ్రిగోల్డ్ భూముల్లోని కలపను అక్రమార్కులు తరలిస్తుండగా స్థానికులు గుర్తించారు.
వాహనంతో సహా పరార్
లారీల్లో ఎక్కిస్తున్న జామాయిల్
దుత్తలూరు, న్యూస్టుడే : మండలంలోని రాచవారిపల్లి- తురకపల్లి మార్గంలో సుమారు 200 ఎకరాల్లో అగ్రిగోల్డ్ భూముల్లోని కలపను అక్రమార్కులు తరలిస్తుండగా స్థానికులు గుర్తించారు. సోమవారం భూముల్లోని జామాయిల్ కలపను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్థులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్రమార్కులను నిలదీయడంతోపాటు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమార్కులు లారీతో సహా పరారయ్యారు. కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకులే ఈ అక్రమ రవాణా గత కొన్ని నెలలుగా చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ. 40 లక్షల మేర విలువైన కలప అక్రమ రవాణా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చర్యలు తీసుకోవాలి.. కొండారెడ్డి, స్థానికుడు
కొంత కాలంగా అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటి వరకు సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ప్రతి వారం మూడు నుంచి ఐదు వాహనాల్లో కలప అక్రమంగా తరలివెళుతోంది. ఈ అక్రమ రవాణాతో కొంతమంది స్థానికులు రూ. లక్షలు సంపాదిస్తున్నారు. ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల్లో చాలా కలప అక్రమార్కుల పాలైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ రవాణా చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం
[ 17-05-2024]
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవ కార్యక్రమం కావలి పట్టణంలోని వెంగళరావునగర్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. -
భారీ మెజారిటీతో కావ్య గెలవబోతున్నారు
[ 17-05-2024]
ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి (కావ్య క్రిష్ణారెడ్డి) కావలి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నారని కావలి ఆర్య వైశ్యులు తెలిపారు. -
అధికారులంతా వైకాపాకే కొమ్ముకాశారు: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
[ 17-05-2024]
తాజా ఎన్నికల్లో అధికారులెవరూ తమకు సహకరించలేదని నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. -
ఎడగారు పోయినట్లే!
[ 17-05-2024]
జిల్లాలో ఎడగారుకు సాగునీరు అందుబాటులో లేదు. రెండో పంటకూ దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందని జల వనరులశాఖ అధికారులు చెబుతున్నారు. -
ఫలితాలపై పందేల జోరు!
[ 17-05-2024]
ఓ వైపు ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా జరుగుతుండగా- మరోవైపు ఎన్నికల ఫలితాలపై పందేల హోరు పెరిగింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయి మూడు రోజులు కాలేదు. -
ఆగని దోపిడి
[ 17-05-2024]
సైదాపురం మండలం తలుపూరు, కలిచేడు, ఊటుకూరు, జోగిపల్లి, పెరుమాళ్లపాడు, చాగణం, రాజుపాళెం, తిప్పిరెడ్డిపల్లి, లింగసముద్రం, పాలూరు గ్రామాల్లో పల్స్పర్, క్వార్ట్జ్, మైకా, వర్మిక్యులేట్ తదితర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. -
డెంగీ నిర్మూలన అందరి బాధ్యత
[ 17-05-2024]
డెంగీ నిర్మూలన అందరి బాధ్యత అని డీఎంహెచ్వో డాక్టర్ పెంచలయ్య తెలిపారు. గురువారం జాతీయ డెంగీ డే సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి బీఈడీ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
ఉప్పు రైతుకు నష్టం
[ 17-05-2024]
వ్యాపారుల మాయాజాలంతో ఉప్పు రైతులు కుదేలవుతున్నారు. వారి చర్యల కారణంగా ఎన్నడూ లేని రీతిలో కిలో రూ.1.50కు తగ్గిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. -
ప్రవేశాలకు వేళాయె.. వసతులు కరువాయె!
[ 17-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యల చదువులు చదువుతున్నారు. జిల్లాలో ఏటా వేలాది మంది విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్లో చేరుతుంటారు. -
చైతన్యమూర్తులు.. ప్రాణదాతలు
[ 17-05-2024]
సాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదు.. మంచి మనసు: మదర్థెరెసా ఈ మాటలను పలువురు స్ఫూర్తిగా తీసుకున్నారు. సమాజ సేవకు కదిలారు. -
పరుగుల్లో తేజస్సు
[ 17-05-2024]
ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు హిమతేజ. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. -
స్ట్రాంగ్రూముల వద్ద నిరంతర నిఘా
[ 17-05-2024]
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూముల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
[ 17-05-2024]
బుచ్చి నగర పంచాయతీలోని ముంబై జాతీయ రహదారిపై రాఘవరెడ్డి కాలనీ వద్ద గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగరికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీకి కలిసొచ్చే ‘నంబర్ 18’.. ఆర్సీబీని ప్లేఆఫ్స్కు చేరుస్తుందా?
-
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
-
తెలంగాణలో పీజీఈసెట్ పరీక్ష వాయిదా
-
నవీన్ బాబూ.. రత్నభాండాగారం అసలు తాళం చెవి ఎక్కడ ఉంది?: అమిత్ షా
-
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు