logo

‘వైకాపాకు బుద్ధి చెబుతాం’

గిరిజన జాతిని చిన్నచూపు చూస్తున్న వైకాపా నాయకులకు బుద్ధి చెపుతామని వెన్నెలకంటి రాఘవయ్య మెమోరియల్‌ గిరిజన సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పి. శ్రీనివాసులు పేర్కొన్నారు.

Published : 08 May 2024 06:27 IST

ఆత్మకూరు, న్యూస్‌టుడే: గిరిజన జాతిని చిన్నచూపు చూస్తున్న వైకాపా నాయకులకు బుద్ధి చెపుతామని వెన్నెలకంటి రాఘవయ్య మెమోరియల్‌ గిరిజన సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పి. శ్రీనివాసులు పేర్కొన్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆత్మకూరు ఛైర్‌పర్సన్‌ను దూషించినా పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయలేదన్నారు. సోమవారం కమ్యూనిటీ హాలులో గిరిజనులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మకు సంఘీభావం తెలిపారు. మాజీ ఎంపీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. అప్పారావుపాళెంలో గిరిజన సర్పంచి కుమారిపై కూడా వైకాపా నాయకులు వేధింపులకు పాల్పడ్డారన్నారు. కొంతమంది తమను చిన్నచూపు చూస్తున్నారని ఛైర్‌పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మ విచారం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు