logo

హత్య కేసులో నిందితుల అరెస్టు

జండాదిబ్బలో మంగళవారం రాత్రి హత్యకు గురైన సుబ్బమ్మ కేసులో ఇద్దరు నిందితులను గురువారం సంగం సి.ఐ.రవినాయక్‌, ఎస్సై కె.నాగార్జునరెడ్డి బుచ్చిరెడ్డిపాళెం బస్టాండులో అరెస్టు చేశారు.

Published : 10 May 2024 04:20 IST

జండాదిబ్బ (సంగం), న్యూస్‌టుడే: జండాదిబ్బలో మంగళవారం రాత్రి హత్యకు గురైన సుబ్బమ్మ కేసులో ఇద్దరు నిందితులను గురువారం సంగం సి.ఐ.రవినాయక్‌, ఎస్సై కె.నాగార్జునరెడ్డి బుచ్చిరెడ్డిపాళెం బస్టాండులో అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా...ఈ కేసులో నిందితులు జండాదిబ్బ గ్రామానికి చెందిన వారే. ప్రధాన నిందితుడు అనిల్‌ హతురాలికి బాగా తెలిసిన వాడు అవడం విశేషం. సుబ్బమ్మ వద్ద బాగా ధనం ఉంటుందని అనిల్‌, తన స్నేహితుడు ఆరిఫ్‌తో కలసి చంపేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఆరిఫ్‌తో కలసి మద్యం తాగి మంగళవారం రాత్రి సుబ్బమ్మ ఇంటివద్దకు వెళ్లారు. ఆమెను మాటల్లో పెట్టిన అనిల్‌ ఒక్కసారిగా ఆమె గొంతునులిమి హత్య చేశారు. అప్పటికీ ఆగక ఆమె చీరతోనే మరోసారి ఆమె గొంతుచుట్టూ బిగించి గట్టిగా లాగారు. దీంతోపాటు కాళ్లను తాడుతో కట్టేశారు. గతంలో అనిల్‌ ఆమె పై దాడికి పాల్పడి ఉండటంతో పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకుని విచారణ చేయగా వారు నేరం అంగీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు