అధ్వాన దారులు.. పట్టని పాలకులు
తెదేపా హయాంలో మట్టి రోడ్డుగా ఉన్న తొడుగుపల్లెకు 16 ఏళ్ల కిందట తారు రోడ్డు వేశారు. అధ్వానంగా తయారవడంతో అయిదేళ్లుగా మరమ్మతులు చేయాలని పాలకులకు విన్నవించినా పట్టించుకోలేదు.
న్యూస్టుడే, వరికుంటపాడు
తెదేపా హయాంలో మట్టి రోడ్డుగా ఉన్న తొడుగుపల్లెకు 16 ఏళ్ల కిందట తారు రోడ్డు వేశారు. అధ్వానంగా తయారవడంతో అయిదేళ్లుగా మరమ్మతులు చేయాలని పాలకులకు విన్నవించినా పట్టించుకోలేదు. అధ్వానంగా తయారైన రోడ్లపై ప్రయాణాలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, కలిగిరి, కొండాపురం, జలదంకి మండలాల్లోని లింకు రోడ్లు తారు లేచిపోయి గోతులతో దర్శనమిస్తున్నాయి.
- భోగ్యంవారిపల్లె- చాకలికొండ వెళ్లే రోడ్డు కంకర బయటపడి గోతులతో దర్శనమిస్తోంది. కనియంపాడు- చాకలికొండకు వెళ్లే రోడ్డు రామదేవులపాడు, జనార్ధనపురం గ్రామాల మధ్య వాగుపై వంతెన లేకపోవడంతోపాటు కి.మీ మేర మట్టి రోడ్డుపై ప్రయాణాలు సాగించలేక ఇబ్బందులు పడుతున్నారు.
- కాకొల్లువారిపల్లె, హుస్సేన్నగర్, రామాపురం రింగురోడ్డు గత తెదేపా హయాంలో ప్రతిపాదనలు పంపగా తారురోడ్డుగా మంజూరైనా గుత్తేదారు చేసేందుకు ముందుకు రాలేదు.
- దుత్తలూరు మండలంలోని రాచవారిపల్లె- బైరవరం మార్గం 9 కి.మీ. తారు లేచిపోయి కంకర బయటపడింది. నర్రవాడ- కొత్తపేట రోడ్డు పరిస్థితి అలాగే ఉంది.ః వింజమూరు- గుండెమడుగు, వింజమూరు - నేరేడుపల్లి రోడ్లదీ ఇదే దారి.
- సీతారామపురం మండలం రంగనాయుడుపలి- బాలాయపల్లి వెళ్లే రోడ్డు గోతులుగా దర్శనమిస్తోంది.
- ఉదయగిరి- బండగానిపల్లి రోడ్డు అటవీ శాఖ అనుమతులు లేక అసంపూర్తిగా నిలిచిపోయింది. ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు.
- కొండాపురం మండలం కొండాపురం- కావలి ప్రధాన రహదారిలో రేణమాల బస్టాండు కూడలిలో గోతులమయమైంది.
- జలదంకి మండలం సోడవరం- రామవరప్పాడు రహదారి తారు లేచిపోయి అధ్వానంగా ఉంది.
నిత్యం ప్రమాదాలే
- నక్కల నాగార్జున, స్థానికుడు
రోడ్లు అధ్వానంగా ఉండడంతో ద్విచక్రవాహనాలపై ప్రయాణాలు సాగించేవారు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రభుత్వాలు మారుతున్నా గ్రామీణ ప్రాంత రహదారులు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు.
హామీలతోనే సరిపెడుతున్నారు
- ధనేకుల నాగేంద్రబాబు, స్థానికుడు
ఎన్నికల సమయంలో మాత్రమే పాలకులకు మా గ్రామాలు కనిపిస్తాయి. ఆసమయంలో స్థానికులు వారి దృష్టికి తీసుకొస్తే పదవి చేపట్టిన వెంటనే చేస్తామని హామీలు ఇస్తారు. తరువాత పట్టించుకోరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే ప్రజాస్వామ్యం
[ 20-05-2024]
రాష్ట్రంలో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం ఫరిడవిల్లిందని జనరల్ మర్చంట్ వ్యాపారుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు జెట్టి వెంకట శేషారెడ్డి అన్నారు. -
హ్యాపీసేవా సంస్థ ఆధ్వర్యంలో గిరిజనులకు భోజనం ప్యాకెట్ల పంపిణీ
[ 20-05-2024]
కావలి రూరల్ మండలంలోని ఆముదాలదిన్నెలో హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద గిరిజనులకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. -
సోమశిల.. ఈ నిర్లక్ష్యమేల!
[ 20-05-2024]
ఇది ఫ్యూజో మీటరు.. సోమశిల జలాశయం మట్టికట్ట స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ వ్యవస్థ దశాబ్దానికి పైగా పనిచేయడం లేదు. నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో మట్టికట్టపై పర్యవేక్షణ మాటలకే పరిమితమవుతోంది. -
మామిడి.. మిగలని దమ్మిడి
[ 20-05-2024]
మామిడి రైతులను ఏటా ఏదో ఒక సమస్య వేధిస్తోంది. ఈ ఏడాది.. ఇప్పటికి ధరలు పర్వాలేదనుకున్నా.. శీతాకాలంలో గాలి వానలు, మంచు, తామర పురుగు ప్రభావంతో పూత రాలిపోయిన కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి. -
ఎల్హెచ్ఎంఎస్ ఉంటే మీ ఇల్లు భద్రమే
[ 20-05-2024]
రెండు రోజుల క్రితం నెల్లూరు బాలాజీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోతాళం వేసిన ఇంటినే లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగుడు దొంగతనానికి పాల్పడ్డాడు. తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారం దోచుకున్నాడు. -
బోధిస్తూ.. చైతన్యం
[ 20-05-2024]
ఆమె వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు. మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని వ్యాపకంగా చేసుకున్నారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ అని భావించారు. అందరితో మొక్కలు నాటించి పెద్దవయ్యేలా చేస్తున్నారు. -
మృత్యు దారులు
[ 20-05-2024]
కొద్దిరోజుల కిందట కావలి సమీపంలో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సులో అయిదుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. -
ఓటేయకుండా.. ఓడారు!
[ 20-05-2024]
ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అద్వితీయ హక్కు... ఓటు. మనమే నిర్ణేతలమై.. అయిదేళ్లకు ఒకసారి మనల్ని పరిపాలించే వారిని ఎన్నుకునే వజ్రాయుధం ఓటు. అంతటి కీలకమైన ప్రజాస్వామ్య ఆయుధాన్ని కొందరు శ్రద్ధతో వినియోగించుకుంటే.. -
కోనలో బ్రహ్మోత్సవ వైభవం
[ 20-05-2024]
భక్తుల గోవింద నామస్మరణ.. మంగళ వాయిద్యాల నడుమ పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. -
జిల్లా వ్యాప్తంగా పోలీసుల సోదాలు
[ 20-05-2024]
పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత, దొంగతనాల నివారణ, అసాంఘిక శక్తుల ఏరివేతే కార్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశం. -
తప్పిపోయిన చిన్నారిని సంరక్షించిన మెరైన్ పోలీసులు
[ 20-05-2024]
మండల పరిధిలోని మైపాడు బీచ్లో తప్పిబోయిన చిన్నారిని మెరైన్ పోలీసులు వెతికిపట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఆదివారం జరిగింది. -
ఫ్రూట్ కవర్ మామిడి కిలో రూ.100
[ 20-05-2024]
జిల్లాలో ఫ్రూట్ కవర్ మామిడి పండ్లకు డిమాండ్ పలుకుతోంది. ఇవి కిలో రూ.100కు విక్రయిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా