వలేటివారిపాలెం బాధలు వర్ణనాతీతం
మండలంలో సమస్యలు తిష్ఠ వేశాయి. తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, దెబ్బతిన్న రహదారులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వలేటివారిపాలెం: మండలంలో సమస్యలు తిష్ఠ వేశాయి. తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, దెబ్బతిన్న రహదారులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేకునాంపురంలో ఆర్వోప్లాంటుకు విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో అధికారులు సరఫరా నిలిపేశారు. సుమారు 8 నెలలుగా మూతపడటంతో స్థానికులు 20లీటర్లను రూ.10లకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు ఎడమ కాలువ పొడిగింపు పనులు 2012 నుంచి ముందుకు సాగకపోవడంతో శాఖవరం, నలదలపూరు, కళవళ్ల సాగునీటి చెరువులకు నీటి సరఫరా కలగానే మిగిలింది. పోకూరులో రెండో పీహెచ్సీ భవనానికి రూ.2.40కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అతీగతి లేదు. ప్రభుత్వం వైద్యుల నియామకం చేపట్టినా వైద్యులు మండల కేంద్రానికే పరిమితమయ్యారు.
- వలేటివారిపాలెం, అంకభూపాలపురం రోడ్డుకు రూ.20లక్షలు మంజూరయినా నేటికీ పనులు ప్రారంభించలేదు.
- కాకుపాలెం నుంచి పోకూరుకు వయా శింగమనేనిపల్లె మీదుగా గ్రావెల్ రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో కాకుపాలెం, కొండారెడ్డిపాలెం, నలదలపూరు, కలవళ్ల ప్రజలు కందుకూరు మీదుగా మండల కేంద్రానికి వెళ్తున్నారు
- వాటర్షెడ్డు పథకం కింద చుండి, అమ్మపాలెం, పోలినేనిపాలెంలో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాలకు మరమ్మతలు చేయలేదు.
- సంపద సృష్టి కేంద్రాలను వినియోగంలోకి తీసుకురాలేదు.
లింగసముద్రంలో రోడ్లపై మురుగునీరు
లింగసముద్రం : లింగసముద్రంలో పలు సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. మురుగుకాలువలు, చెత్తకేంద్రం లేక అవస్థలు పడుతున్నారు.
శ్మశానవాటిక లేక.. ఎవరైనా చనిపోతే చెరువుకట్టపై ఖననం చేస్తున్నారు.
- డంపింగ్యార్డు గ్రామానికి దూరంగా నిర్మించడం వల్ల చెత్తను గ్రామ సమీపంలో వేస్తున్నారు. దీంతో ఇక్కడ పందుల సంచారం అధికంగా ఉంది. అంటువ్యాధులు ప్రబలుతున్నాయి.
- మురుగునీటి సరిగా కాలువలు లేవు. దీంతో ఇళ్లలోని మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు రహదారుల వెంట నడిచే వీల్లేదు.
- విద్యుత్తు సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడి వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
- ట్యాంక్ను 15 రోజులకు శుభ్రం చేయాల్సి ఉంది. కానీ, నెలల తరబడి పట్టించుకోకపోవడంతో తాగునీరు కలుషితమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కృష్ణారెడ్డే కావలికి కాబోయే ఎమ్మెల్యే: మాలేపాటి
[ 19-05-2024]
కావలి నియోజకవర్గ కేంద్రంలో కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి సన్మానం కార్యక్రమం నిర్వహించారు. -
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేత
[ 19-05-2024]
పట్టణంలోని రవి నర్సింగ్ హోంలో అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. -
జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్
[ 19-05-2024]
నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఠాణాల పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
[ 19-05-2024]
వెంకటాచలం మండలం కంటేపల్లికి చెందిన అద్దూరు కామాక్షికి ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేసింది. -
రోడ్లు అధ్వానం.. పట్టించుకోని ప్రభుత్వం
[ 19-05-2024]
కందుకూరు నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. -
బోర్లు.. బాగు చేస్తే దాహం తీరు
[ 19-05-2024]
ఎండలు ముదిరాయి. రక్షిత పథకాలు పనిచేయడం లేదు. తాగునీటికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఈసమయంలో ఉపయోగపడే చేతి పంపులు అలంకారప్రాయంగా మారాయి -
అతి తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు
[ 19-05-2024]
తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ రాజశేఖర్ పేర్కొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. రాత్రులు దొంగతనం
[ 19-05-2024]
రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం
[ 19-05-2024]
జాతీయ రహదారిపై వెళుతూ ఆగిన లారీని కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన నార్తురాజుపాళెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. -
హతవిధీ..పట్టించుకునేవారేరీ!
[ 19-05-2024]
నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షహీద్ దర్గా పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. -
22న జిల్లాకు గవర్నర్ రాక
[ 19-05-2024]
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22వ తేదీ నెల్లూరుకు రానున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
మెట్ట రైలుపై చిన్న చూపు
[ 19-05-2024]
మెట్ట ప్రాంత వాసుల దశాబ్దాల కల.. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో.. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి -
స్ట్రాంగ్ రూమ్కు పోస్టల్ బ్యాలెట్లు
[ 19-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టులో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములో ఉంచి సీల్ వేశారు. -
నేటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
బ్రహ్మోత్సవాలకు పెంచలకోన క్షేత్రం ముస్తాబైంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 25వ తేదీ వరకు జరగనుండగా- ఆదివారం స్వామి అత్తారిల్లుగా చెప్పుకొనే గోనుపల్లి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను పెంచలకోన క్షేత్రానికి చేర్చనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం