ఉక్కపోత.. రోగులకు వెత
వేసవి తీవ్రరూపం దాల్చింది. 43 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతుతోంది. జిల్లా ఆసుపత్రిలో మధ్యాహ్నం 12 అయిందంటే చాలు తీవ్రమైన ఉక్కపోత రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
క్రామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ప్రసూతి విభాగంలో మహిళలు
కామారెడ్డి వైద్యవిభాగం-న్యూస్టుడే: వేసవి తీవ్రరూపం దాల్చింది. 43 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతుతోంది. జిల్లా ఆసుపత్రిలో మధ్యాహ్నం 12 అయిందంటే చాలు తీవ్రమైన ఉక్కపోత రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రసూతి అయిన మహిళలు, నవజాతశిశువుల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉంది. ఆయా విభాగాల్లో సరిపడా ఏసీలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. బాలింతలు చికిత్సపొందే వార్డులతో పాటు సాధారణ చికిత్స విభాగంలో రోగుల బాధ వర్ణణాతీతం. అధునాతన విభాగాల్లో, కొత్త వార్డుల్లో ఏసీలు ఏర్పాటు జరిగినా పూర్తిస్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదు.
తరచూ దెబ్బతింటూ..
ఆయా విభాగాల్లో ఏసీలు తరచూ పాడవుతున్నాయి. ఎలుకలు ఏసీల్లోకి వెళ్లి తీగలను కొరికేస్తున్నాయి. గతంలో ఎలుకల కారణంగా 12 ఏసీలు పాడయ్యాయి. మరమ్మతుల్లో తీవ్ర జాప్యం కారణంగా చాలా రోజుల వరకు రోగులు ఉక్కపోతతో సతమతమయ్యారు. తాజాగా ఎండ తీవ్రత నేపథ్యంలో చికిత్స పొందే గదుల్లో ఉండటానికి రోగులు అసౌకర్యానికి గురవుతున్నారు.
యంత్రాంగం స్పందిస్తేనే
వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రధాన విభాగాల్లో ఏసీలు ఏ మేరకు అవసరమో ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదించాల్సిన అవసరం ఉంది. మే మొదటి వారంలో 20 ఏసీలు మంజూరైతే ఉక్కపోత బాధ నుంచి ఉపశమనం కానుంది. కాగా రోగుల ఇబ్బందులను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు చెబుతున్నారు. త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యక్తి ఆత్మహత్య
[ 03-06-2024]
నాగిరెడ్డిపేట మండలంలోని ఎర్రకుంట తండాకు చెందిన మలావత్ కేవుల (36) జీవితంపై విరక్తితో మృతి చెందినట్లు భార్య యమునా ఫిర్యాదులో తెలిపారు. -
ఈదురు గాలులకు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
[ 03-06-2024]
మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. -
అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రణాళికలు
[ 03-06-2024]
జిల్లాలో అన్ని సామాజికవర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యమిస్తూ ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని జిల్లా పాలనాధికారి రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. -
పత్రాలు రాసిచ్చి.. తీరా చేతులెత్తేసి..
[ 03-06-2024]
మిల్లులకు ధాన్యం కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయనే అంశం పౌరసరఫరాలశాఖను కుదిపేస్తోంది. ఏడు మిల్లులకు బదిలీ అయినట్లుగా చెబుతున్న 37 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టింది. -
మింగినవి కక్కరేం?
[ 03-06-2024]
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు సామాజిక తనిఖీల్లో బయటపడుతున్నాయి. దుర్వినియోగం చేసిన సొమ్మును కొందరు చెల్లించడం లేదు. మండల స్థాయి అధికారి నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటించే సిబ్బంది వరకు అవినీతిలో భాగస్వాములవుతున్నారు. -
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
[ 03-06-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో మంగళవారం జరగనుంది. లెక్కింపునకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరు గదుల్లో టేబుళ్లు ఏర్పాటు చేశారు. -
రాయితీ జమ కాదేంటి?
[ 03-06-2024]
మహాలక్ష్మి పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.500కే వంట గ్యాస్ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెల్లరేషన్కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రాయితీపై వంట గ్యాస్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంది. -
మూడు రోజులు.. 0.26 టీఎంసీలు
[ 03-06-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లావాసుల వరప్రదాయినిగా పేరొందింది నిజాంసాగర్ జలాశయం. వేసవిలో తాగునీటి అవసరాల నిమిత్తం ఈ నెల 4వ తేదీ సాయంత్రం లేదా 5వ తేదీ ఉదయం ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. -
పరస్పర దాడులు
[ 03-06-2024]
నగరంలో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న ఘటన లాఠీఛార్జికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే జిల్లా కేంద్రం హైమద్పురా కాలనీకి చెందిన సోహెల్పై ఆయన భార్య బంధువులు వ్యక్తిగత కారణాల వల్ల శనివారం అర్ధరాత్రి ఆయుధాలతో దాడికి దిగారు. -
జాడలేని ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
[ 03-06-2024]
‘జిల్లాకేంద్రంలో పాతపట్టణంలోని ధర్మశాల ప్రాంతంలో జ్ఘి3 నిర్మాణం చేపట్టారు. ప్రధాన వాణిజ్య ప్రాంతంలో సెల్లార్ నిర్మాణం చేపట్టకుండానే భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం అందులో ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వహణ కొనసాగుతోంది. -
కొమ్ము కొరత
[ 03-06-2024]
పంట వేయాలనే ఆలోచన వస్తే ఎక్కడి నుంచైనా.. ఎంత ధరైనా వెనకాడకుండా రైతు విత్తనం తెచ్చుకుంటాడు. దేశవ్యాప్తంగా పత్తి విషయంలో ఇదే జరుగుతోంది. కావాల్సిన విత్తనం కోసం వరుసలో నిలబడో, అధికారుల జోక్యంతోనో విత్తు దక్కించుకుంటున్నారు. -
బడి బస్సులు భద్రమేనా?
[ 03-06-2024]
చిన్న పొరపాట్లే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. అందుకే గత అనుభవాల దృష్ట్యా పాఠశాల బస్సుల నిర్వహణ విషయంలో రవాణాశాఖ నిబంధనల అమలుపై దృష్టి సారిస్తోంది. ఏటా బడి బస్సుల సామర్థ్య పరీక్షలు, డ్రైవర్ల లైసెన్సులు, అనుభవాన్ని పరీక్షిస్తున్నారు. -
ఎండతో పాటు ఎగబాకి
[ 03-06-2024]
ఎండల తీవ్రతకు కూరగాయలు మాడిపోతున్నాయి. మార్కెట్లో డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. రోజు రోజుకు ఎగబాకుతున్న ఉష్ణోగ్రతల మాదిరిగానే టమాట ధర కిలో రూ.30కి పైగానే పలుకుతోంది. -
తమ్ముడి వెంటే.. అన్న అనంతలోకాలకు..
[ 03-06-2024]
తమ్ముడి మృతి చెందిన బాధను తట్టుకోలేక అన్న గుండెపోటుతో మృతి చెందిన ఘటన మండలంలోని కృష్ణాజివాడిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
పాక్కు రహస్యాలు చేరవేసిన కేసు.. బ్రహ్మోస్ మాజీ ఇంజినీర్కు జీవిత ఖైదు
-
బౌలర్లు అప్పుడు సత్తా చాటారు.. ఇప్పుడేం చేస్తారో?
-
20 రోజుల్లో ఉద్ధవ్ ఠాక్రే ఎన్డీఏలోకి: ఎమ్మెల్యే రవి రాణా
-
మైదానంలో విషాదం.. సిక్స్ కొట్టి ప్రాణం విడిచి..!
-
మోదీ 3.0 లోడింగ్.. సూచీలు ఫుల్ స్వింగ్..!