logo

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

ఇంటి నుంచి అదృశ్యమైన బాలిక(17) గడ్డి మందుతాగి ఆస్పత్రిలో చేరిన ఘటన బోధన్‌ మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్తే.. మండలానికి చెందిన బాలిక.. ఆరు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది.

Published : 13 Aug 2022 06:24 IST

బోధన్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ఇంటి నుంచి అదృశ్యమైన బాలిక(17) గడ్డి మందుతాగి ఆస్పత్రిలో చేరిన ఘటన బోధన్‌ మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్తే.. మండలానికి చెందిన బాలిక.. ఆరు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. ఆమె కుటుంబీకులు బోధన్‌ గ్రామీణ ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనూహ్యంగా గురువారం సాయంత్రం మోస్రా మండలం గోవూరుకు చెందిన యువకుడు రాజుతో కలిసి శివారు ప్రాంతంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన ఇరు కుటుంబాల సభ్యులు అక్కడకు వెళ్లగా నోట్లోంచి నురగలు వస్తుండగటాన్ని గమనించి వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. ఈ మేరకు వారి నుంచి వివరాలు తెలుసుకునేందుకు సీఐ శ్రీనివాసరాజు, ఏఎస్‌ఐ రవీందర్‌ శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి మాట్లేందుకు ప్రయత్నించినా సరైన సమాధానం రాబట్టలేకపోయారు. అయితే ఇది వరకే రాజుకు వివాహమై భార్య ఉంది. బాలిక ఇటీవల ఇంటర్‌లో చేరినట్లు సమాచారం. చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని