logo

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే మానసిన ప్రశాంతత లభిస్తుందని కామారెడ్డి జిల్లా జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.

Updated : 08 Dec 2022 15:12 IST

మద్నూర్‌ : ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే మానసిన ప్రశాంతత లభిస్తుందని కామారెడ్డి జిల్లా జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మేనూర్‌ గ్రామంలో నూతనంగా నిర్మించిన వాల్మీకి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులందరూ కలిసి సమష్టిగా ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస మండల అధ్యక్షుడు సంగమేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని