కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్.
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. ఒక దశలో టీ20 జట్టు పగ్గాలు కూడా అందుకున్నాడు. అలాంటి ఆటగాడు ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. ముంబయి కెప్టెన్సీ తెచ్చిన వ్యతిరేకత అతడి ఆటను దెబ్బతీస్తోంది. మరి కొన్ని రోజుల్లో టీ20 ప్రపంచకప్లోనూ ఆ ప్రభావం కొనసాగితే టీమ్ఇండియాకు నష్టమే!
ఈనాడు క్రీడావిభాగం
ఈ ఐపీఎల్లో ప్లేఆఫ్స్ రేసు నుంచి మొదటగా నిష్క్రమించిన జట్టు ముంబయి ఇండియన్సే. కొన్నేళ్ల నుంచి ముంబయి ప్రదర్శన ఏమంత గొప్పగా లేని మాట వాస్తవం. కానీ ఈసారి ఆ జట్టు వైఫల్యం మీద జరుగుతున్నంత చర్చ మునుపెన్నడూ జరగలేదు. అందుక్కారణం.. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్య కెప్టెన్ అయ్యాక అతడితో పాటు జట్టు తడబడుతున్న తీరే! రోహిత్ను తప్పించి హార్దిక్ను కెప్టెన్ను చేయడం పట్ల అభిమానుల్లో ముంబయి పట్ల తీవ్ర వ్యతిరేకత పెంచడమే కాదు.. జట్టు తత్వాన్ని కూడా దెబ్బ తీసిందన్నది స్పష్టం. ఒకప్పుడు సమష్టితత్వానికి మారు పేరుగా ఉన్న ముంబయి.. ఈసారి కలిసికట్టుగా ఆడలేకపోయింది. ఓవైపు అభిమానుల నుంచి ఊహించని వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలో తెలియక, ఇంకోవైపు జట్టును సమష్టిగా నడిపించలేక హార్దిక్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న విషయం మైదానంలో అతణ్ని చూసిన వాళ్లందరికీ స్పష్టంగా తెలిసిపోయింది. ఈ ప్రభావం అతడి వ్యక్తిగత ప్రదర్శన మీదా తీవ్ర ప్రభావమే చూపింది. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ను కెప్టెన్గా గొప్పగా నడిపించడమే కాక.. ఆటగాడిగానూ సత్తా చాటాడు హార్దిక్. కానీ ముంబయి తరఫున ఆ ప్రదర్శన ప్రతిఫలించలేదు. 11 మ్యాచ్ల్లో 19.8 సగటుతో 198 పరుగులే చేసిన హార్దిక్.. 8 వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ 11 కావడం గమనార్హం. కొన్ని మ్యాచ్ల్లో వికెట్లయితే పడ్డాయి కానీ.. ధారాళంగా పరుగులు ఇచ్చేశాడు. హార్దిక్ సారథి కావడం జట్టులోనూ చాలామందికి ఇష్టం లేదన్నది అంతర్గత సమాచారం. దీంతో తన పట్ల అభిమానుల్లో, జట్టులో అంతర్గతంగా నెలకొన్న వ్యతిరేకత హార్దిక్ను కుదురుగా ఉండనివ్వలేదు! ఈ ఒత్తిడిలో కెప్టెన్గానే కాక ఆటగాడిగానూ అతను విఫలమయ్యాడు. ఒకప్పుడు స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించిన అతను.. చాలా మ్యాచ్ల్లో షాట్లు ఆడలేక అవస్థలు పడ్డాడు. బౌలర్గా రాణించకపోతే ప్రపంచకప్ జట్టులో చోటుండదన్న ఉద్దేశంతో తన అవసరం లేకపోయినా పలు మ్యాచ్ల్లో బౌలింగ్ చేశాడు కానీ.. ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయితే ప్రస్తుత ఫామ్ కంటే గత ప్రదర్శనలను, మిడిలార్డర్లో హార్దిక్ లాంటి అనుభవజ్ఞుడి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని అతడికి సెలక్టర్లు అవకాశం కల్పించారు. ఐపీఎల్లో సూపర్ ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్కు ప్రపంచకప్లో అవకాశం దక్కలేదు. ఫినిషర్గా బాగా ఉపయోగపడతాడని అంచనాలున్న రింకు సింగ్కు కూడా సెలక్టర్లు మొండిచేయి చూపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాటర్గా హార్దిక్ కంటే రాహుల్ లేదా రింకునే మెరుగనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ తన ఎంపిక తప్పు కాదని తన ప్రదర్శనతో చాటిచెప్పాల్సిన స్థితిలో ఉన్నాడు. ఇది అతడి మీద ఒత్తిడిని మరింత పెంచేదే. ముంబయి కెప్టెన్గా తప్పక రాణించాల్సిన స్థితిలో ఒత్తిడికి చిత్తయ్యాడు. ఇప్పుడు ప్రపంచకప్లో మాత్రం అతను ఒత్తిడి తట్టుకుని ఏమేర రాణిస్తాడన్నది ప్రశ్నార్థకం. హార్దిక్ వీలైనంత త్వరగా ఐపీఎల్ తాలూకు ప్రతికూల ప్రభావం నుంచి బయటపడాలి. పొట్టి కప్పు మొదలయ్యేలోపు అతను మానసికంగా, శారీరకంగా దృఢంగా మారడం జట్టుకు ఎంతో అవసరం. ప్రపంచకప్ను తాజాగా ఆరంభిస్తే మునుపటి హార్దిక్ను చూడడానికి అవకాశముంటుంది. లేదంటే ప్రపంచకప్లో భారత్ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడడం ఖాయం.
‘‘హార్దిక్ పూర్తిగా నీరసించిపోయినట్లు కనిపిస్తున్నాడు. అతను తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. తనను చూస్తే బాధేస్తోంది. నేను కూడా ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాను. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేసినా కలిసి రాదు. మన జట్టు సరైన ప్రదర్శన చేయనపుడు చాలా కష్టంగా ఉంటుంది. మనం బాగా ఆడకపోయినా జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుంటే కెప్టెన్గా సంతోషించవచ్చు. కానీ జట్టు బాగా ఆడకపోతే కెప్టెన్గా మొత్తం బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అదే కష్టం’’
ఆరోన్ ఫించ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 214 పరుగులు చేయగా.. ముంబయి 196 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. చివరి మ్యాచ్లో ముంబయిని ఓడించినప్పటికీ లఖ్నవూ ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
లఖ్నవూతో మ్యాచ్ సందర్భంగా ముంబయి స్టార్ రోహిత్ శర్మ చేసిన ఓ విజ్ఞప్తి నెట్టింట వైరల్గా మారిపోయింది. -
పూరన్ దంచెన్
ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్ సీజన్ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. -
వానా వానా వద్దప్పా!
అసలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..! -
సెమీస్లో సాత్విక్ జోడీ
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
అప్పటి నుంచే ఆ ఆలోచన
అఫ్గానిస్థాన్తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం తొలిసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్ సునీల్ ఛెత్రి చెప్పాడు. -
ఆర్జనలో రొనాల్డో నం.1
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. -
మను బాకర్ జోరు
ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్లో భారత అగ్రశ్రేణి షూటర్ మను బాకర్ జోరు కొనసాగుతోంది. -
పర్వీన్పై నిషేధం.. చేజారిన ఒలింపిక్ బెర్తు
బాక్సింగ్లో భారత్ ఓ ఒలింపిక్ బెర్తు కోల్పోయింది. -
నా రికార్డులు ప్రస్తుతానికి భద్రమే
తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. -
ట్రయల్స్ వద్దు.. పారిస్కు పంపండి
సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు. -
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
ఐపీఎల్ 2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!