పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది.
ఫోన్ ట్యాపింగ్ బృందం నేతృత్వంలో 2 వాట్సప్ గ్రూప్లు
కామారెడ్డిలో కేసీఆర్ ప్రత్యర్థులు, అనుచరులపై ప్రత్యేక దృష్టి
గత అసెంబ్లీ ఎన్నికల వేళ నిరంతర నిఘా
ఈనాడు, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గం కార్యకలాపాలపై ట్యాపింగ్ ముఠా ప్రత్యేక నిఘా ఉంచింది. కేసీఆర్పై పోటీ చేసిన అభ్యర్థులపై.. ముఖ్యంగా రేవంత్రెడ్డి, వెంకటరమణారెడ్డి కదలికలపై నిరంతరం కన్నేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘కేఎంఆర్ (కామారెడ్డి)’ పేరిట వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) అప్పటి డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావు దాన్ని ఏర్పాటు చేయగా.. ఎస్ఐబీ అప్పటి అదనపు ఎస్పీ తిరుపతన్నతోపాటు క్షేత్రస్థాయిలో అతడి పర్యవేక్షణలో పనిచేసే పోలీసులు సభ్యులుగా ఉన్నారు.
రేవంత్రెడ్డికి, వెంకటరమణారెడ్డికి ఆర్థిక వనరులు అందకుండా చేసే ఉద్దేశంతో ప్రణాళికలు రచించారు. వారి ప్రధాన అనుచరుల కదలికలను కూడా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు గ్రూపులో చర్చించుకునేవారు. కేసీఆర్ ప్రత్యర్థులను కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ గ్రూపులో చర్చలు నడిచాయి. మరోవైపు తిరుపతన్న ‘పోల్-2023’ పేరిట ఇంకో వాట్సప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. తన బృందంలోని పోలీసులను అందులో సభ్యులుగా చేర్చారు. అక్రమ సొమ్ము జప్తు అయిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందులో షేర్ చేసుకునేవారు. ఎవరిపై నిఘా ఉంచాలనే సమాచారాన్ని తిరుపతన్న.. ప్రణీత్రావుకు చేరవేసేవారు. వారి ప్రొఫైళ్లను తయారుచేసి ఫోన్లను మానిటరింగ్ చేయడం ప్రణీత్రావు పని. అలా రాష్ట్రవ్యాప్తంగా భారాస ప్రత్యర్థుల కదలికలపై తిరుపతన్న బృందం పర్యవేక్షణ ఉండేది. వారు సొమ్ము తరలిస్తున్నట్లు సమాచారం వస్తే టాస్క్ఫోర్స్, ఇతర పోలీస్ బృందాలకు సమాచారం అందించేది. అలా కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించిన సొమ్మును జప్తు చేయించగలిగారు.
పరారీలో ప్రభాకర్రావు..!
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. తాజాగా మరో ఇద్దరిని నిందితుల జాబితాలో చేర్చారు. ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును ప్రధాన నిందితుడిగా(ఏ-1) చేర్చారు. ఇప్పటిదాకా ఆ స్థానంలో ప్రణీత్రావు ఉన్నారు. దర్యాప్తు క్రమంలో లభించిన సమాచారం ఆధారంగా ప్రభాకర్రావును మొదటి, ప్రణీత్రావును రెండో నిందితులుగా చేర్చారు. ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్రావును ఏ-6గా చేర్చారు. ప్రభాకర్రావు, శ్రవణ్రావులపై నాంపల్లి న్యాయస్థానంలో రెండు రోజుల క్రితం మెమో దాఖలు చేశారు. ఈ కేసులో వీరిద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు న్యాయస్థానానికి వెల్లడించారు. ఇప్పటివరకు నిందితుల వాంగ్మూలాల్లో వారిద్దరి ప్రస్తావన వచ్చినా సాంకేతిక కారణాలతో నిందితుల జాబితాలో వారి పేర్లను చేర్చలేదు. తాజాగా వారిని పరారీలో ఉన్న నిందితులుగా చూపడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వారు విదేశాల్లో ఉండటంతో అరెస్ట్కు అనుమతిస్తూ వారంట్ జారీ చేయాల్సిందిగా 73 సీఆర్పీసీ సెక్షన్ కింద న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. సోమవారం నిర్ణయం వెలువడనుంది. వారంట్కు అనుమతి లభిస్తే అప్పుడు వారిద్దరిపై రెడ్కార్నర్ నోటీస్ జారీ చేయించే అవకాశముంది. నేరానికి పాల్పడి పోలీస్ విచారణను తప్పించుకునేందుకు దేశం దాటిపోయిన నిందితులపై దాన్ని జారీ చేస్తారు. ఇందుకోసం సీఐడీ ద్వారా సీబీఐకి సమాచారమిచ్చి.. అక్కడి నుంచి ఇంటర్పోల్కు లేఖ రాయించాల్సి ఉంటుంది. అప్పుడు ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీస్ జారీ చేసే అవకాశముంది. నిందితుడు ఇంటర్పోల్ సభ్య దేశంలో ఉండి ఉంటే అక్కడి పోలీసుల ద్వారా పట్టుకొని తీసుకొచ్చే వీలుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
ఇంటి దీపం కావాలి.. మా కలలకు రూపం ఇవ్వాలి!
‘అమ్మా..!’ అనే పిలుపు కోసం ఆరాటపడే స్త్రీమూర్తులు ఎందరో.. సంతానం కలగక ఆందోళన చెందుతున్న దంపతులూ వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారంతా తమ ఇంటి దీపం వెలిగించే ఆడపిల్లలే కావాలంటున్నారు. -
నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉద్యోగుల పనిదినాలు 5 రోజులకు తగ్గించాలి
సచివాలయ ఉద్యోగుల పనిదినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. -
మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలన
రాష్ట్రంలో మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలించేలా కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
ప్రజల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం
దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దృష్టి సారించిందని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పని చేయడమే తమ లక్ష్యమని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ అరుణ్కుమార్ మిశ్రా స్పష్టంచేశారు. -
అధిక ధరకు...బియ్యం టెండర్లు!
సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్ల అంశం కీలకదశలో ఉంది. 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (ఫైన్ వెరైటీ) కొనేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. తాజాగా బిడ్లను తెరిచారు. -
జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ
రాష్ట్రంలో తొమ్మిది జిల్లా జడ్జి(ఎంట్రీలెవల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. -
మధుమేహ చిన్నారుల మానసికోల్లాసానికి..
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పదుల సంఖ్యలో టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం..ఈవో ఉత్తర్వులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు శుక్రవారం దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ తీగల వంతెన
ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. -
సంక్షిప్త వార్తలు (9)
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో!
సుమాంజలిది ఆదిలాబాద్ జిల్లా. ఆమె టెట్ పేపర్-1, 2లకు దరఖాస్తు చేశారు. పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాద్, రెండోది హైదరాబాద్ ఇచ్చారు. -
తడిసిన ధాన్యం... తడి కళ్లతో రైతన్న దైన్యం
అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. -
కుంగిన బ్లాక్లో ఒక గేటును పైకెత్తిన ఇంజినీర్లు
ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్లో ఒక గేటును శుక్రవారం పైకెత్తారు. బ్యారేజీలో మొత్తం 85 రేడియల్ గేట్లున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!