logo

‘ఆ రెండు పార్టీలు ఒక్కటే’

కాంగ్రెస్‌, భాజపా ఒక్కటేనని భారాస నిజామాబాద్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. మంగళవారం భారాస జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, మాజీ మంత్రి జి.రాజేశంగౌడ్‌, మాజీ మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ లోక బాపురెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.

Published : 01 May 2024 04:57 IST

జగిత్యాల, రాయికల్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌, భాజపా ఒక్కటేనని భారాస నిజామాబాద్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. మంగళవారం భారాస జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, మాజీ మంత్రి జి.రాజేశంగౌడ్‌, మాజీ మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ లోక బాపురెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. భారాసను గెలిపిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఈప్రాంత సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భాజపా రాష్ట్రానికి చేసిందేమీ లేదని.. ఎంపీగా అర్వింద్‌ను గెలిపిస్తే పసుపుబోర్డు పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. రాయికల్‌ మండలంలోనూ ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి అని ఒక్కసారి కూడా జైతెలంగాణ అనలేదని విమర్శించారు. జీవన్‌రెడ్డికి పదవి ఉన్నా ఎంపీగా పోటీ చేస్తున్నారని ఎమ్మెల్సీగా ఏం చేశారో చెప్పాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని