logo

కాంగ్రెస్‌ పేద ప్రజలకు అండగా నిలుస్తోంది

కాంగ్రెస్‌  పేద ప్రజలకు అండగా నిలుస్తోందని ఆ పార్టీ  మండలాధ్యక్షుడు లక్ష్మా గౌడ్ అన్నారు.

Published : 09 May 2024 10:57 IST

రామారెడ్డి: కాంగ్రెస్‌  పేద ప్రజలకు అండగా నిలుస్తోందని ఆ పార్టీ  మండలాధ్యక్షుడు లక్ష్మా గౌడ్ అన్నారు. గురువారం ఈసన్నపల్లిలో ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలుచేస్తుందన్నారు. హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయన వెంట  గిద్ద ఎంపీటీసీ సభ్యుడు ప్రవీణ్ గౌడ్, ఈసన్నపల్లి గ్రామ అధ్యక్షుడు లింగం, సీనియర్ నాయకులు లింబాద్రి, గంగాధర్, కిషన్ గౌడ్, తూర్పు రాజు, ఇర్ఫాన్, గోపి తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని