రక్తం కొరత
ఎండలు మండిపోతున్నాయి. కళాశాలలకు సెలవులు. వేసవి తాపానికి దాతలు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.
రెడ్క్రాస్, జీజీహెచ్లో నిండుకున్న నిల్వలు
దాతలు స్పందించాలి
న్యూస్టుడే, నిజామాబాద్ వైద్యవిభాగం
ఎండలు మండిపోతున్నాయి. కళాశాలలకు సెలవులు. వేసవి తాపానికి దాతలు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొసాగుతుండటంతో కనీసం కార్యకర్తలతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేందుకు నాయకులు తీరికలేకుండా ఉన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రమాదాలు, ప్రసవాలు పెరగడం, థలసీమియా రోగులకు రక్తం ఎక్కిస్తుండటంతో నిల్వలు నిండుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రెడ్క్రాస్, జీజీహెచ్ సిబ్బంది ఉన్నారు.
నిత్యం 25 నుంచి 30 యూనిట్లు
నిజామాబాద్ రెడ్క్రాస్ రక్తనిధికి నిత్యం 25 నుంచి 30 యూనిట్ల రక్తం అవసరం. ప్రమాదాలు, ప్రసవాలు, కాలిన గాయాలైనవారు, థలసీమియా రోగులు ఎక్కువగా వినియోగిస్తారు. రెడ్క్రాస్లో గత రెండు నెలల నుంచి కేవలం 30 నుంచి 40 యూనిట్లే రక్తం నిల్వలున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్నవారు తిరిగి ఇవ్వడం లేదు. ఇటీవల అతికష్టం మీద ఒక శిబిరం నిర్వహించి చేసి 60 యూనిట్లు సేకరించారు. ఇది కేవలం రెండు మూడు రోజులకే సరిపోతుంది.
థలసీమియా రోగులకు ఉచితం
రెడ్క్రాస్ సంస్థ థలసీమియా రోగుల కోసం రక్తమార్పిడి చేసేందుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసింది. మంగళ, శుక్రవారాల్లో 40 యూనిట్లు ఉచితంగా ఎక్కిస్తున్నారు. దీన్ని 2023 డిసెంబరులో ప్రారంభించారు. ఇప్పటి వరకు 826 యూనిట్లు థలసీమియా రోగులకు అందించారు. ఆరోగ్యశ్రీ లేకపోవడంతో రక్తం ఎక్కించడానికే ఇప్పటి వరకు సుమారు రూ. 13 లక్షలు ఖర్చు చేశారు.
నిత్యం 100 నుంచి 150 మంది
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోజురోజుకు ప్రసవాలు పెరుగుతున్నాయి. ఇన్ పేషెంట్లు నిత్యం 100 నుంచి 150 మంది చేరుతున్నారు. వీరిలో ప్రమాద బాధితులు, బాలింతలే ఎక్కువ. ఈ రెండు కేసులకు రక్తం అవసరం ఉంటుంది. జీజీహెచ్లో ప్రస్తుతం 120 యూనిట్లు అందుబాటులో ఉంది. నిత్యం 15 నుంచి 20 యూనిట్లు రోగులకు ఎక్కిస్తారు. ఇక్కడ రోగుల కుటుంబ సభ్యులు ఒక్కరు రక్తం ఇస్తే గాని యూనిట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరూ ఇవ్వకుంటే బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా దాతలు, అవగాహన ఉన్నవారు స్పందించి వేసవిలో రక్త దానం చేసేందుకు ముందుకు రావాలని వైద్యులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త
[ 20-05-2024]
ముద్దులొలికే పాపే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు..కొడుకున్నా.. కూతురిపైనే మక్కువ ఎక్కువ..చిట్టితల్లికి చిన్న గాయమైనా తట్టుకోలేని హృదయాలు వారివి. అప్పటి వరకు సరదాగా గడిపిన చిన్నారిని మృత్యువు మింగేసింది. -
సజ్జ రైతు సంబరం
[ 20-05-2024]
ఎర్రజొన్నల మాదిరిగానే ఒప్పందంపై సేద్యం చేస్తున్న సజ్జ పంట ఈసారి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడి రావడం, ధర అమాంతం రూ.2 వేలు పెరగడంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.వేయి కోట్ల కొనుగోళ్లు
[ 20-05-2024]
దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సుమారు రూ. వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. -
‘గెలుపు మనదే’
[ 20-05-2024]
జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు మనదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. సదాశివనగర్ మండల కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన పోలింగ్ సరళి, గ్రామాల వారీగా కాంగ్రెస్కు పడిన ఓట్ల వివరాలపై ఆరా తీశారు. -
టీఎస్ కాస్తా టీజీగా..
[ 20-05-2024]
తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది. -
పర్యాటకంగా మారిస్తే.. ప్రయోజనాలెన్నో!
[ 20-05-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని స్వయంగా వెలసిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి గుర్తింపు లభించడం లేదు. చెరువు గట్టున పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఇది. -
ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు వేళాయె
[ 20-05-2024]
తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారిలో అత్యధికులు ఇంటర్మీడియెట్ వైపు దృష్టి సారిస్తారు. అలాంటి వారికి ఆదర్శ జూనియర్ కళాశాలలు వరమనే చెప్పాలి. -
చూసి కొనాలి.. రసీదు పొందాలి
[ 20-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పల్లె పోరుకు సన్నాహాలు
[ 20-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తేదీతో ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?