Puri Temple: రత్న భాండాగారం... చర్చనీయాంశం
పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. విపక్ష నేతలు, మేధావులు, సేవాయత్లు, పూరీ రాజు దివ్యసింగ్దేవ్ ఈ భాండాగారం తెరిచి మరమ్మతులు చేయాలని, అందులోని స్వామి ఆభరణాలను సంరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
భువనేశ్వర్ అర్బన్, న్యూస్టుడే: పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. విపక్ష నేతలు, మేధావులు, సేవాయత్లు, పూరీ రాజు దివ్యసింగ్దేవ్ ఈ భాండాగారం తెరిచి మరమ్మతులు చేయాలని, అందులోని స్వామి ఆభరణాలను సంరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించడం లేదు. పాలకులు ఈ విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు అన్న విమర్శలు ముమ్మరమయ్యాయి. దీనిపై భాజపా నేతలు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అందరూ ఓపిక పట్టాలి
భాండాగారం తాళం చెవి ఉందా పోయిందా అనే విషయం నాకు తెలియదు. దీనిపై హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది. కేసు విచారణ పూర్తయ్యాక న్యాయస్థానం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. అప్పటి వరకు అందరూ ఓపిక పట్టాలి. ప్రభుత్వం పురాతన ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ముమ్మర చర్యలు తీసుకుంటోంది. పూరీ జగన్నాథ ఆలయం చుట్టూ పరిక్రమణ మార్గం పనులు ముగించేందుకు దృష్టి సారిస్తోంది. రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
జగన్నాథ్ సరక, న్యాయశాఖ మంత్రి
కమిటీ ఏర్పాటు చేయాలి
రత్న భాండాగారం తెరిచి మరమ్మతులు చేయించాలని పూరీ గజపతి దివ్యసింగ్దేవ్, ఆలయ ప్రధాన సేవాయత్లు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి భాండాగారం తెరిచి ఆభరణాలు లెక్కించాలి.
సమీర్ మహంతి, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?
ఇటీవల భాండాగారం తాళం చెవి పోయిందని ప్రభుత్వం ప్రచారం చేసి భాండాగారం తెరవకుండా దాటవేసింది. ప్రభుత్వం ఎందుకు తెరిచేందుకు భయపడుతోంది. దీనివల్ల ప్రజల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
నర్సింగ్ మిశ్రా, కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిజదపై అసంతృప్తి భాజపాకు కలిసొచ్చేనా?
[ 17-05-2024]
ప్రతిష్ఠాత్మక కొంధమాల్ లోక్సభ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఈసారి కమలదళం సర్వశక్తులు ఒడ్డుతోంది. బిజద దూకుడుకు కళ్లెం వేయాలన్న ధ్యేయంతో భాజపా అగ్రనేతలంతా ప్రచారం చేశారు. కోల్పోయిన ప్రతిష్ఠ నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఉద్యమిస్తోంది. -
ప్రచారాల హోరు
[ 17-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార హోరు మొదలుకానుంది. ఈ నెల 25వ తేదీన మిడ్నాపూర్, ఘటాల్, ఝార్గ్రామ్ లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీల అగ్రనేతలు అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. -
కళ్లికోట చెలరేగిన రాజకీయ హింస
[ 17-05-2024]
గంజాం జిల్లా కళ్లికోట అసెంబ్లీ నియోకవర్గంలో ఎన్నికలకు ముందు రాజకీయ హింస చెలరేగింది. భాజపా-బిజద మద్దతుదారుల మధ్య జరిగిన మారణాయుధాల దాడి నేపథ్యంలో భాజపా కార్యకర్త మృతితో గురువారం రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
నవీన్కు ప్రజలు సెలవిస్తున్నారు: జె.పి.నడ్డా
[ 17-05-2024]
నిస్సహాయ స్థితిలో ఉన్న నవీన్కు రాష్ట్ర ప్రజలు సెలవిస్తున్నారని, ఈసారి రాష్ట్రానికి చెందిన భాజపా నేత సీఎం అవుతారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా చెప్పారు. -
సీఎం ఇలాకాలో అభివృద్ధి ఏదీ..?
[ 17-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 24 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లా హింజిలి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. -
ఈసారి ‘స్టార్’లు రాణిస్తారా?
[ 17-05-2024]
వెండితెరపై రాణించిన తారలెంతోమంది రాజకీయాల్లో ప్రవేశించి క్రియాశీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలోనూ సినీ పరిశ్రమ (ఓలీవుడ్) నుంచి వచ్చినవారు రాణిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లోనూ కొందరు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. -
ఓటు వినియోగంలో అతివల ముందంజ
[ 17-05-2024]
రాష్ట్రంలో తొలిదశలో మే 13న జరిగిన ఎన్నికల్లో రాయగడ జిల్లా నుంచి మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ పురుషుల కంటే అతివలే ఎక్కువగా ఓటు వేయడం గమనార్హం. -
తాగునీటికి కటకట
[ 17-05-2024]
ఈ ఏడాది వర్షాలు లేక గజపతి జిల్లాలో గుక్కెడు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని రాయగడ సమితి నారాయణపురం గ్రామస్థులు ముఖ్య రహదారిపై అడ్డంగా కర్రలు -
గుమ్మలో కాంగ్రెస్ జెండా ఎగిరేనా?
[ 17-05-2024]
గజపతి జిల్లా బ్రహ్మపుర లోక్సభ పరిధిలోని పర్లాఖెముండి అసెంబ్లీ నియోజకవర్గం గెలుపుపై ఇక్కడి ముఖ్య పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ