సంబల్పూర్ నుంచి నాగేంద్ర... కటక్కు సురేష్
సంబల్పూర్ మాజీ ఎంపీ నాగేంద్ర ప్రధాన్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. కటక్ నుంచి సురేష్ మహాపాత్ర్ బరిలో దిగారు.
2 లోక్సభ, 8 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు
భువనేశ్వర్, న్యూస్టుడే: సంబల్పూర్ మాజీ ఎంపీ నాగేంద్ర ప్రధాన్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. కటక్ నుంచి సురేష్ మహాపాత్ర్ బరిలో దిగారు. ఆదివారం రాత్రి ఏఐసీసీ అధిష్ఠానం రెండు లోక్సభ, 8 అసెంబ్లీ స్థానాల జాబితా ప్రకటించింది.
నాగేంద్ర చేరికతో...: గతంలో సంబల్పూర్ లోక్సభకు దులాల్ చంద్ర ప్రధాన్ను హస్తం పార్టీ అభ్యర్థిగా చేశారు. ఇంతలో బిజద అగ్రనేత, మాజీ ఎంపీ నాగేంద్ర పార్టీలో చేరడంతో దులాల్ చంద్రను పోటీ నుంచి తప్పించి నాగేంద్రకు అవకాశమిచ్చారు. కటక్కు చెందిన పార్టీ అగ్రనేత సురేష్ను లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు.
సోఫియాకు అవకాశం..: బారాబటి కటక్ సిటింగ్ ఎమ్మెల్యే మహమ్మద్ ముఖిం కుమార్తె సోఫియా ఫిర్దోస్ తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. ఆమెను కాంగ్రెస్ నాయకత్వం అసెంబ్లీ అభ్యర్థిగా నిలిపింది. 8 మంది జాబితాలో ప్రమోద్కుమార్ హేంబ్రం (బరిపద), దేవీ ప్రసన్న చాంద్ (బాలేశ్వర్), మోనాలిసా లెంక (బాలేశ్వర్), అజయ్ సామల్ (బొడొచొణా), ఫకీర్ సామల్ (పలలహడ), ప్రతిమా మల్లిక్ (జగత్సింగ్పూర్) ఉన్నారు. ఖండపడ స్థానానికి ఇదివరకు ప్రకటించిన మనోజ్కుమార్ ప్రధాన్ బదులుగా వైజయంతిమాల మహంతి బరిలో ఉన్నారు.
మయూరభంజ్ జేఎంఎంకు..: ఇంతవరకు కాంగ్రెస్ 20 లోక్సభ, 144 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మయూర్భంజ్ లోక్సభ సీటు జేఎంఎంకు కేటాయించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఛత్రపురం, కాకట్పూర్, నీలగిరి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్కూటీని ఢీకొన్న లారీ.. ఇద్దరు దుర్మరణం
[ 21-05-2024]
కటక్ సదర్ ఠాణా పరిధిలోని 16వ నెంబరు రహదారి బలికూడ జంక్షన్ వద్ద 10.30 గంటలకు స్కూటీలో వస్తున్న ఇద్దరు యువకుల్ని అతి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. -
స్వల్ప ఘటనలు మినహా.. రెండో విడత ప్రశాంతం
[ 21-05-2024]
రాష్ట్రంలో సోమవారం రెండోవిడత పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగినట్లు ప్రధాన ఎన్నికల అధికారి నికుంజ బిహారీ ధొళొ భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
మందకొడిగా ప్రారంభం... తర్వాత ఉత్సాహం
[ 21-05-2024]
గంజాం జిల్లాలో రెండోవిడత సోమవారం అస్కా లోక్సభ, ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగు ప్రశాంతంగా జరిగింది. -
నవీన్ పాలన రాష్ట్రానికి శాపం
[ 21-05-2024]
నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల పాలన రాష్ట్రానికి తీరని శాపమని, ఖనిజ సంపదలున్నా పేదరికానికి చిరునామా అయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. -
కొరాపుట్లో భారీ వర్షం: ఇళ్లు ధ్వంసం
[ 21-05-2024]
కొరాపుట్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్థమైంది. -
ఉత్కళీయులు ఆశీర్వదిస్తున్నారు: మోదీ
[ 21-05-2024]
ఉత్కళీయులు ఈసారి భాజపాను ఆశీర్వదిస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం మనకు కలగనుందని, జగన్నాథుని కటాక్షం పార్టీపై ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. -
మహానదితో కేంద్ర నేతల రాజకీయాలు: పాండ్యన్
[ 21-05-2024]
ఉత్తర కోస్తా, పశ్చిమ ఒడిశాలోని 15 జిల్లాలకు ‘జీవధార’గా నిలుస్తున్న మహానదితో కేంద్ర మంత్రులు దిగజారుడు రాజకీయాలు చేశారని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ ఆరోపించారు. -
ఎన్నికల బహిష్కరణ
[ 21-05-2024]
గంజాం జిల్లా సన్నొఖెముండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుడియాపటనా గ్రామస్థులు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండు చేస్తూ సోమవారం ఎన్నికల్ని బహిష్కరించారు. -
జగన్నాథుని సన్నిధిలో మోదీ విశ్వశాంతి పూజలు
[ 21-05-2024]
ఒడిశాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం 7.30 గంటలకు పూరీ చేరుకున్నారు. -
నోట్ల కట్టలతో బ్యాగు కలకలం..
[ 21-05-2024]
లక్షలాది రూపాయల నోట్ల కట్టలతో ఒక బ్యాగ్ లభించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసుల వివరాలు ప్రకారం.. ఖరగ్పూర్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ గదిలో రూ.500 నోట్ల కట్టలతో రూ.లక్షల నగదు ఆదివారం లభిచిందిత.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
-
వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేకుండా.. ఐపీఎల్ టాప్-2 జట్లా?
-
ఆ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్
-
నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు: స్వాతి మాలీవాల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM