logo

తొలి ఓటు అనుభూతి పొందండి

కొత్తగా ఓటు కార్డు పొందుతున్న యువ ఓటర్లు అందరూ మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేసి తొలి ఓటు అనుభూతి పొందాలని జిల్లా పాలనాధికారి మనోజ్‌ సత్యవాన్‌ మహాజన్‌ అన్నారు.

Published : 01 May 2024 03:00 IST

ప్రచార పత్రాన్ని చూపుతున్న మనోజ్‌, నిహార్‌ తదితరులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: కొత్తగా ఓటు కార్డు పొందుతున్న యువ ఓటర్లు అందరూ మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేసి తొలి ఓటు అనుభూతి పొందాలని జిల్లా పాలనాధికారి మనోజ్‌ సత్యవాన్‌ మహాజన్‌ అన్నారు. జిల్లా పరిషత్‌ కాన్ఫరెన్స్‌ హాలులో మంగళవారం నిర్వహించిన తొలి ఓటరు గుర్తింపు కార్డుల మంజూరు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో 18 ఏళ్లు పూర్తి చేసుకొన్న 20091 మంది కొత్త ఓటర్లకు ఓటు కార్డులు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించి ప్రచార పత్రాలను ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీడీఈవో నిహార్‌ రంజన్‌ కొహర్‌, సబ్‌ కలెక్టర్‌ కల్యాణి సంఘమిత్ర దేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని