గోపాల్పూర్లో బిజద బల ప్రదర్శన
గాలివానలో అమ్మోరు జాతరను తలపించిన వి.కార్తికేయ పాండ్యన్ రోడ్షో దీనికి వేదికైంది గోపాల్పూర్ సెల్ఫీ పాయింట్ కూడలిలో సోమవారం రాత్రి బిజద నాయకత్వం బల ప్రదర్శన చేపట్టారు.
శంఖారావం కళాకారుల విన్యాసం
గోపాలపూర్, న్యూస్టుడే: గాలివానలో అమ్మోరు జాతరను తలపించిన వి.కార్తికేయ పాండ్యన్ రోడ్షో దీనికి వేదికైంది గోపాల్పూర్ సెల్ఫీ పాయింట్ కూడలిలో సోమవారం రాత్రి బిజద నాయకత్వం బల ప్రదర్శన చేపట్టారు. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభ విజయవంతం కావడంతో దీటుగా నాయకులు ఇక్కడ జన సమీకరణ చేయించారు. శంఖారావం, వాయిద్యాల హోరు, సాంస్కృతిక ప్రదర్శనలు, యువత నినాదాలతో మెయిన్ రోడ్ పరిసరాలు మార్మోగాయి.
మహిళల నిరీక్షణ
పాండ్యన్ కార్యక్రమానికి బిజద పెద్దలు సమీప గ్రామాల నుంచి వేలాదిమంది మహిళల్ని వాహనాల్లో తీసుకొచ్చారు. సాయంత్రం 6కి రావాల్సిన ఆయన రాత్రి 9 గంటలకు వచ్చారు. ఆగాగి కురుస్తున్న వానలోనే మహిళలు వేచి చూశారు. అందరికీ ముత్యాలమ్మ శక్తిపీఠం ఆవరణలో భోజనాలు ఏర్పాటు చేశారు.
మాది 5-టీ గ్యారంటీ
పాండ్యన్ మాట్లాడుతూ... గంజాం కలెక్టరుగా గతంలో విధులు నిర్వహించిన తనకు ఈ ప్రాంత ప్రజలంతా కుటుంబసభ్యులన్నారు. ఆలస్యంగా వచ్చినందుకు తల్లులు, సోదరినులు క్షమించాలన్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ఈ జిల్లాతో విడదీయలేని బంధం ఉందని, అందరికీ తోడుగా ఉన్నారని, ఉంటారని చెప్పారు. తమది 5-టీ గ్యారంటీ అని, చెప్పింది చేస్తామని, అభివృద్ధే అజెండా అని తెలిపారు.
ముక్కంటి సన్నిధిలో పూజలు
రాత్రి గోపాల్పూర్లోని ఒక అతిథి భవనంలో విడిది చేసిన పాండ్యన్ జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో చర్చించారు. మంగళవారం సుప్రసిద్ధ ధవశేళ్వర క్షేత్రాన్ని సందర్శించి ముక్కంటి సన్నిధిలో పూజలు చేశారు. తర్వాత సీఎం నవీన్ పోటీ చేస్తున్న హింజిలి అసెంబ్లీ పరిధిలోని సేరగడ సమితిలో ఎన్నికల ప్రచారం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతలు సస్పెండ్
[ 19-05-2024]
జయపురంకు చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు సీనియర్ నేతలను పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. జిల్లా కాంగ్రెస్ మంజీ అధ్యక్షుడు దుర్గా శంకర్ సాహు, మాజీ మంత్రి దివంగత రఘునాథ్ పట్నాయక్ కుమారుడు బీరెన్ మోహన్ పట్నాయక్ను పార్టీ సస్పెండ్ చేసింది. -
ట్యాంకర్ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి
[ 19-05-2024]
కరాపుట్ జిల్లా బొరిగుమ్మ ఠాణా పరిధిలో జాతీయ రహదారి 26 పైన జయంతి గిరి శివాలయం వద్ద శనివారం రాత్రి ఆగి ఉన్న ట్యాంకర్ను కారు ఢీ కొట్టింది. -
గ్యారేజ్లో అగ్ని ప్రమాదం.. వాహనాలు దగ్ధం
[ 19-05-2024]
జయకరం పట్టణం సాత్బౌణి ఆలయ సమీపంలో ఉన్న మోహన్ ఖరా గ్యారేజ్లో ఆదివారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం జరిగింది. -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 19-05-2024]
రాయగడ జిల్లా కాసిపూర్ సమితి పరిధిలో విద్యార్థుల మృతి ఘటనలకు సంబంధించి నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. -
పాతకక్షలతో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 19-05-2024]
పాతకక్షల నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
కమలమా.. శంఖమా ?
[ 19-05-2024]
పశ్చిమ ఒడిశాలోని బరగఢ్ లోక్సభ స్థానంలో ఎన్నికల వేడి పెరిగింది. భాజపా, బిజద అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోరు నువ్వా? నేనా? అన్న రీతిలో సాగుతోంది. -
రెండోవిడత ప్రచారానికి తెర
[ 19-05-2024]
అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లో 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం (20న) రెండోవిడత పోలింగ్ జరగనుంది -
చివరి రోజు ముమ్మరంగా ప్రచారం
[ 19-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి శనివారం చివరి రోజు కావడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు -
ఈసారి కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు: సచిన్ పైలెట్
[ 19-05-2024]
ఈసారి దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని ఆ పార్టీ నేత సచిన్ పైలెట్ చెప్పారు. -
ప్రజాహితం కోరే సీఎం అవసరం: భజన్లాల్
[ 19-05-2024]
ఒడిశా ప్రజల హితం కోరే సీఎం రాష్ట్రానికి అవసరమని, నవీన్ ఔట్సోర్సింగ్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్శర్మ చెప్పారు. -
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి: అశ్వినీ
[ 19-05-2024]
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి తథ్యమని, ప్రధాని మోదీ హయాంలో భారత్ అన్ని రంగాల్లో ముందంజ వేసినట్లు రైల్వే, కమ్యూనికేషన్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. -
పంటను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే
[ 19-05-2024]
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేంతవరకు కాపాడుకోవాల్సిన బాధ్యత రైతన్నలదేనని సహకార సంఘం డిప్యూటీ డైరెక్టర్ మన్మధకుమార్ దాస్ అన్నారు. -
బిజద పక్షానే రాష్ట్ర ప్రజలు: సీఎం
[ 19-05-2024]
ఒడిశాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలపై ముఖ్యమంత్రి నవీన్ విమర్శలు గుప్పించారు. -
రాష్ట్రానికి మోదీ, రాజ్నాథ్, అమిత్షాల రాక
[ 19-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి భువనేశ్వర్ చేరుకోనున్నారు. 9 గంటలకు భాజపా అగ్రనేతలతో ఎన్నికల ప్రచార వ్యూహం, ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు