మా అమ్మాయికే మీ ఓటు..!
ఈసారి ఎన్నికల్లో పలువురు నేతలు తమ కుమార్తెలను పోటీలో నిలిపారు. అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు వీరికి 33 శాతం సీట్లు కేటాయించలేకపోయాయి. బిజద 35 మందికి అవకాశమిచ్చి ఇతర పార్టీల కంటే ముందంజలో ఉంది.
తండ్రుల స్థానాల్లో కుమార్తెల పోటీ
భువనేశ్వర్, న్యూస్టుడే: ఈసారి ఎన్నికల్లో పలువురు నేతలు తమ కుమార్తెలను పోటీలో నిలిపారు. అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు వీరికి 33 శాతం సీట్లు కేటాయించలేకపోయాయి. బిజద 35 మందికి అవకాశమిచ్చి ఇతర పార్టీల కంటే ముందంజలో ఉంది. కాంగ్రెస్ 21 మందికి, భాజపా 12 మందిని అభ్యర్థులుగా చేశాయి.
లోక్సభకు బిజద 33 శాతం సీట్లు
పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందినా ఈసారి ఎన్నికల్లో అమలుకు నోచుకోలేదు. ప్రాంతీయ పార్టీ బిజద 2019లో లోక్సభకు 33 శాతం టికెట్లు మహిళలకు కేటాయించింది. 21 స్థానాలకుగాను ఏడుగురిని పోటీకి నిలిపింది. ఈసారి అంతే సంఖ్యలో అవకాశమిచ్చింది. భాజపా నలుగురికి, కాంగ్రెస్ ఇద్దరికి అవకాశమిచ్చాయి. 147 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి ప్రధాన పార్టీలేవీ 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించలేదు.
ఇదివరకు తండ్రులు ప్రాతినిధ్యం వహించిన స్థానాల్లో వారి కుమార్తెలను బరిలోకి దించారు. ఝార్సుగుడ అసెంబ్లీ స్థానంలో మాజీ (దివంగత) మంత్రి నబకిశోర్ దాస్ కుమార్తె దీపాలిదాస్ బిజద నుంచి పోటీ చేస్తున్నారు. పదంపూర్ స్థానంలో మాజీ మంత్రి బిజయ రంజన్ సింగ్ బరిహ కుమార్తె బర్షాసింగ్, కవిసూర్యనగర్లో నిత్యానంద ప్రధాన్ కూతురు లతికా ప్రధాన్ బిజద అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. మాజీమంత్రి రామకృష్ణ పట్నాయక్ కుమార్తె అనితా శుభదర్శిని అస్కా లోక్సభ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్ కుమార్తె అమితా బిశ్వాల్ ఝార్సుగుడ నుంచి, మహమ్మద్ ముఖిం కుమార్తె సోఫియా ఫిర్దోస్ బారాబటి - కటక్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. లలితేందు బిద్యాధర్ మహాపాత్ర్ కుమార్తె ఉపాసనా మహాపాత్ర్ బ్రహ్మగిరి నుంచి భాజపా అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. రాజపరివారానికి చెందిన కిశోర్చంద్ర సింహదేవ్ కుమార్తె సులక్షణా గీతాంజలి సన్నోఖెముండి నుంచి బిజద తరఫున పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి హరప్రసాద్ సాహు కుమార్తె రంజితా సాహు అస్కా లోక్సభ స్థానంలో బిజద అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బిజద, కాంగ్రెస్ నాయకత్వాలు ఈసారి కొందరు నేతల ఒత్తిళ్ల నేపథ్యంలో వారి భార్యలు, కొడుకులకూ టికెట్లు కేటాయించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతలు సస్పెండ్
[ 19-05-2024]
జయపురంకు చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు సీనియర్ నేతలను పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. జిల్లా కాంగ్రెస్ మంజీ అధ్యక్షుడు దుర్గా శంకర్ సాహు, మాజీ మంత్రి దివంగత రఘునాథ్ పట్నాయక్ కుమారుడు బీరెన్ మోహన్ పట్నాయక్ను పార్టీ సస్పెండ్ చేసింది. -
ట్యాంకర్ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి
[ 19-05-2024]
కరాపుట్ జిల్లా బొరిగుమ్మ ఠాణా పరిధిలో జాతీయ రహదారి 26 పైన జయంతి గిరి శివాలయం వద్ద శనివారం రాత్రి ఆగి ఉన్న ట్యాంకర్ను కారు ఢీ కొట్టింది. -
గ్యారేజ్లో అగ్ని ప్రమాదం.. వాహనాలు దగ్ధం
[ 19-05-2024]
జయకరం పట్టణం సాత్బౌణి ఆలయ సమీపంలో ఉన్న మోహన్ ఖరా గ్యారేజ్లో ఆదివారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం జరిగింది. -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 19-05-2024]
రాయగడ జిల్లా కాసిపూర్ సమితి పరిధిలో విద్యార్థుల మృతి ఘటనలకు సంబంధించి నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. -
పాతకక్షలతో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 19-05-2024]
పాతకక్షల నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
కమలమా.. శంఖమా ?
[ 19-05-2024]
పశ్చిమ ఒడిశాలోని బరగఢ్ లోక్సభ స్థానంలో ఎన్నికల వేడి పెరిగింది. భాజపా, బిజద అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోరు నువ్వా? నేనా? అన్న రీతిలో సాగుతోంది. -
రెండోవిడత ప్రచారానికి తెర
[ 19-05-2024]
అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లో 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం (20న) రెండోవిడత పోలింగ్ జరగనుంది -
చివరి రోజు ముమ్మరంగా ప్రచారం
[ 19-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి శనివారం చివరి రోజు కావడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు -
ఈసారి కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు: సచిన్ పైలెట్
[ 19-05-2024]
ఈసారి దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని ఆ పార్టీ నేత సచిన్ పైలెట్ చెప్పారు. -
ప్రజాహితం కోరే సీఎం అవసరం: భజన్లాల్
[ 19-05-2024]
ఒడిశా ప్రజల హితం కోరే సీఎం రాష్ట్రానికి అవసరమని, నవీన్ ఔట్సోర్సింగ్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్శర్మ చెప్పారు. -
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి: అశ్వినీ
[ 19-05-2024]
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి తథ్యమని, ప్రధాని మోదీ హయాంలో భారత్ అన్ని రంగాల్లో ముందంజ వేసినట్లు రైల్వే, కమ్యూనికేషన్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. -
పంటను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే
[ 19-05-2024]
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేంతవరకు కాపాడుకోవాల్సిన బాధ్యత రైతన్నలదేనని సహకార సంఘం డిప్యూటీ డైరెక్టర్ మన్మధకుమార్ దాస్ అన్నారు. -
బిజద పక్షానే రాష్ట్ర ప్రజలు: సీఎం
[ 19-05-2024]
ఒడిశాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలపై ముఖ్యమంత్రి నవీన్ విమర్శలు గుప్పించారు. -
రాష్ట్రానికి మోదీ, రాజ్నాథ్, అమిత్షాల రాక
[ 19-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి భువనేశ్వర్ చేరుకోనున్నారు. 9 గంటలకు భాజపా అగ్రనేతలతో ఎన్నికల ప్రచార వ్యూహం, ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి