చందన యాత్రకు పూరీ సన్నద్ధం
పూరీలో జగన్నాథుని చంద్రనయాత్ర, జల క్రీడలకు తెరలేచింది. శుక్రవారం అక్షయ తృతీయ.
నేడు అక్షయ తృతీయ: రథాల కలప పూజ
నందపడవకు పూజలు
గోపాలపూర్, న్యూస్టుడే: పూరీలో జగన్నాథుని చంద్రనయాత్ర, జల క్రీడలకు తెరలేచింది. శుక్రవారం అక్షయ తృతీయ. ఈ పర్వదినం నుంచి 21 రోజులపాటు నరేంద్ర పుష్కరిణిలో వేడుకలు భక్తులకు నేత్రపర్వం చేయనున్నాయి. శుక్రవారం నుంచి పురుషోత్తముని ఘోషయాత్ర రథాల తయారీ పనులకు మహరణ (వడ్రంగి) సేవాయత్లు శ్రీకారం చుడతారు. రాత్రి 7 గంటలకు నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాల కలపకు పూజలు చేస్తారు. ఇది అన్నదాతలకు పండగ సమయం. శుభముహూర్తంలో పంట పొలాల్లో పుడమి తల్లికి పూజలు చేసి పొడిదుక్కులు చేసి విత్తనాలు చల్లుతారు.
ముస్తాబైన పుష్కరిణి, పడవలు: శ్రీక్షేత్రంలో రత్నసింహాసనంపై కొలువుదీరిన జగన్నాథ, బలభద్ర, సుభద్రల సన్నిధిలో పూజలందుకునే గోవిందుడు, శ్రీదేవి, భూదేవి, రామకృష్ణులు పంచపాండవుల ఉత్సవ విగ్రహాలను సేవాయత్లు శుక్రవారం నుంచి 21 రోజులపాటు పల్లకిలో తిరువీధిగా నరేంద్రపుష్కరిణికి రోజూ తీసుకొస్తారు. జయదేవుని అష్టపదులు ఆలాపన, మంగళ వాయిద్యాల ఘోష బొడొదండొలో మార్మోగుతుంది. పుష్కరిణి ఆవరణలో విగ్రహాలకు చందన, సుగంధ ద్రవ్యాల లేపనం చేస్తారు. నంద, భద్ర పడవల్లో జలక్రీడలు ఆడిస్తారు. ఈ వేడుకలకు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పుష్కరిణి, పడవలు ముస్తాబయ్యాయి. గురువారం పడవలకు పూజలు చేశారు.
నిర్ణీత వేళ్లల్లో సేవలు: శ్రీక్షేత్ర పాలనాధికారి వీర్విక్రం సింగ్ యాదవ్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ... నిర్ణీత వేళల్లో చందనయాత్ర సేవలు జరుగుతాయని, పుష్కరిణి వద్ద భక్తులంతా సహకరించాలని కోరారు. వ్యర్థాలు పారబోయరాదని, పవిత్రత, పారిశుద్ధ్యం కీలకమని చెప్పారు.
నేడు సుకుండాలో ఉత్సవాలు ప్రారంభం
సుకుండాలో కొలువైన లక్ష్మీ నృసింహ స్వామి
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: బ్రహ్మపుర సమీపాన రెండో సింహాచలంగా ఖ్యాతిగాంచిన సుకుండాలోని చందనియా కొండపై కొలువైన శ్రీలక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానంలో శుక్రవారం ‘295వ వార్షిక చందనోత్సవాలు’ ప్రారంభమవుతాయి. తొలిరోజు వేకువజామున స్వామివారి నిజరూప దర్శనం అనంతరం స్వర్ణాలంకరణ జరుగుతుందని దేవస్థానం ట్రస్టీ ఆనెం పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజులపాటు (ఈ నెల 12వ తేదీ వరకూ) ఉత్సవాలు కొనసాగుతాయని, ప్రతిరోజు ప్రత్యేక హారతులు, పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కోలల సేవ తదితరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉత్సవాల్లో రోజూ వేలాది మంది భక్తులకు అన్న ప్రసాదాలకు ఏర్పాట్లు చేస్తున్నామని, గంజాం జిల్లాతోపాటు పొరుగున ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చే భక్తుల కోసం వసతి, భోజనాలు కల్పిస్తున్నామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీ ఢీకొని ఇద్దరి మృతి
[ 20-05-2024]
గంజాం జిల్లా ఛమ్మాఖండి ఠాణా పరిధిలోని టాటా ప్లాంట్ సమీపంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై సోమవారం బైకును ఒక లారీ ఢీకొంది. -
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
[ 20-05-2024]
ఢంహరీత ధివల ప్రసాంది రాగా పరిధిలోని దింగురా జియన్ వద్ద పల్సర్ బైకును లారీ ఢీకొట్టింది. -
నోట్ల కట్టలతో బ్యాగు కలకలం
[ 20-05-2024]
నోట్ల కట్టలతో ఒక బ్యాగు లభించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖరగ్పూర్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్ గదిలో ఓ కేసుకు సంబంధించిన వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్నికలు బహిష్కరించిన గుడియాపట్నా గ్రామస్థులు
[ 20-05-2024]
ఒడిశాలోని గంజాం జిల్లా కన్నొకెముండి అసెంబ్లీ నియోజవర్గం పరిధిలోని గుడియా పట్నా గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. -
చెట్టును ఢీకొట్టిన మినీ ట్రక్.. డ్రైవర్ మృతి
[ 20-05-2024]
ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి సమీపంలోని పుకిలి కూడలి వద్ద ఓ మినీ ట్రక్ అదుపుతప్పి చెట్టు ను ఢీకొట్టింది. -
రెండో విడత పోలింగ్.. ప్రిసైడింగ్ అధికారిణికి అస్వస్థత
[ 20-05-2024]
ఒడిశాలో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. సుందర్గఢ్ జిల్లాలోని 211వ పోలింగ్కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారిణి అస్వస్థతకు గురై కింద పడిపోయారు. -
నేడు రెండో విడత పోలింగ్
[ 20-05-2024]
రాష్ట్రంలో సోమవారం రెండోవిడత పోలింగ్ నిర్వహించనున్నారు. అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
33 వేల మంది పోలీసులతో బందోబస్తు
[ 20-05-2024]
రాష్ట్రంలో రెండోవిడత పోలింగ్ నేపథ్యంలో 33 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ అరుణ్ షడంగి చెప్పారు. -
రాష్ట్రాభివృద్ధే మా అజెండా: నవీన్
[ 20-05-2024]
రాష్ట్రాభివృద్ధే అజెండాగా తాము ముందుకెళుతున్నామని, విపక్షాల మాదిరిగా ఆడి తప్పబోమని, చెప్పింది చేస్తున్నామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వివరించారు. -
ప్రజాశీస్సులు భాజపాకే ఉన్నాయి: ధర్మేంద్ర
[ 20-05-2024]
ఎన్నికల ధర్మయుద్ధంలో విజయావకాశాలు భాజపాకే ఉన్నాయని, అన్ని చోట్లా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ రాక నేపథ్యంలో ముందుగా శనివారం రాత్రి భువనేశ్వర్లోని పార్టీ కార్యాలయంలో కార్యవర్గ ప్రతినిధుల సమావేశం జరిగింది. -
చారిత్రక నగరం.. ఎవరికి అందేనో విజయం?
[ 20-05-2024]
చారిత్రక నగరం కటక్ ఈసారి ఎవరి సొంతమవుతుంది? ఓటర్లు ఎవర్ని ఆదరిస్తారు?.. ఇద్దరు ఉద్ధండులు నువ్వా? నేనా? అన్న రీతిలో తల పడుతున్నారు. విజ్ఞతకు నిలువుటద్దమైన ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉంటుందన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
మీ ముద్దు బిడ్డ దేశం గర్వించదగ్గ యువనేత
[ 20-05-2024]
ఈ రాష్ట్రానికి చెందిన మీ ముద్దుబిడ్డ దేశం గర్వించదగిన నేతగా ఎదిగారని, తన సామర్థ్యం నిరూపించుకున్నారని, ఆయన పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రశంసించారు. -
సమీర్ రాజీనామా...
[ 20-05-2024]
పూరీ జిల్లాకు చెందిన బిజద అగ్రనేత, విద్యాశాఖ మాజీ మంత్రి సమీర్ రంజన్ దాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం బిజద ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి నవీన్కు లేఖ పంపించారు. -
నేడు పూరీలో మోదీ రోడ్షో
[ 20-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 7 గంటలకు భువనేశ్వర్ నుంచి పూరీకి వస్తారు. తాలబణియా తాత్కాలిక హెలిప్యాడ్లో దిగనున్న ఆయన నేరుగా శ్రీక్షేత్రానికి చేరుకుని జగన్నాథుని సన్నిధిలో పూజలు చేస్తారు. -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 20-05-2024]
నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బసంత కుమార్ నాయక్ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా