కార్డులో బ్యాలెన్స్ ఉంటే కరెంట్!
ప్రతి నెలా చరవాణికి రీఛార్జి చేసుకున్నట్లు.. డిష్ టీవీకి ఏ నెలకానెల డబ్బులు వేసుకుంటున్నట్లు.. విద్యుత్తు ఛార్జీల చెల్లింపునకూ ‘రీఛార్జి‘ విధానం రానుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్తు సరఫరా అవుతుంది. బ్యాలెన్స్ అయిపోతే సరఫరా
ప్రభుత్వ కార్యాలయాలకూ విద్యుత్తు ప్రీపెయిడ్ మీటర్లు
మొబైల్ రీఛార్జి తరహాలో చెల్లింపు
గంటస్తంభం, న్యూస్టుడే: ప్రతి నెలా చరవాణికి రీఛార్జి చేసుకున్నట్లు.. డిష్ టీవీకి ఏ నెలకానెల డబ్బులు వేసుకుంటున్నట్లు.. విద్యుత్తు ఛార్జీల చెల్లింపునకూ ‘రీఛార్జి‘ విధానం రానుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్తు సరఫరా అవుతుంది. బ్యాలెన్స్ అయిపోతే సరఫరా నిలిచిపోతుంది. ఇందుకు ప్రీపెయిడ్ మీటర్లను బిగించేందుకు ఏపీఈపీడీసీఎల్ అధికారులు సిద్ధమవుతున్నారు. తొలుత ప్రభుత్వ కార్యాలయాలకు ఈ తరహా మీటర్లను అమర్చనున్నారు.
ఉమ్మడి జిల్లాలో గుర్తించిన 11 వేల సర్వీసులకు సంబంధించిన ప్రక్రియ టెండర్ల దశలో ఉంది. ఇది పూర్తవ్వగానే ఒకట్రెండు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు ప్రీపెయిడ్ మీటర్లను బిగించే యోచనలో ఉన్నారు. మీటర్లకు రూ.82.39 కోట్లు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్ఎస్ (రీవంపెడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ నెట్వర్క్ ప్రపోజెడ్) పథకం కింద నిధులు వెచ్చించనున్నారు.
రూ.కోట్లలో బకాయిలు: జిల్లాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ ప్రభుత్వ సంస్థలు విద్యుత్తు బకాయిలు చెల్లించడం లేదు. అత్యధికంగా పంచాయతీలు, రెవెన్యూ, సాంఘిక సంక్షేమం, పోలీస్ శాఖ ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు నోటీసులిస్తున్నా ఫలితం ఉండటం లేదు. ప్రీపెయిడ్ మీటర్లు వస్తే ఈ కష్టాలకు చెల్లుచీటీ పడుతుందని భావిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాల్లో గుర్తించిన సర్వీసులు: 11 వేలు
మీటర్ల ఏర్పాటుకు ఎంత అవసరం: రూ.82.39 కోట్లు
ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్తు వాడకం: 31 లక్షల యూనిట్లు
కార్యాలయాలు చెల్లించాల్సిన బకాయిలు: రూ.1.86కోట్లు
వివిధ ప్రభుత్వ సంస్థలు చెల్లించాల్సినవి: రూ. 42 కోట్లు
దుబారా నివారణతో పాటు.. బకాయిలకు చెక్: ప్రభుత్వ కార్యాలయాల్లో దుబారా అధికంగా ఉంది. అధికారులు, సిబ్బంది సీట్లలో ఉన్నా, లేకపోయినా పంకాలు, లైట్లు, ఏసీలు వినియోగమవుతూనే ఉన్నాయి. వినియోగించిన విద్యుత్తుకు సంబంధించిన బిల్లుల్ని కూడా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు సకాలంలో చెల్లించడం లేదు. బకాయిలు విద్యుత్తు సంస్థకు పెద్ద గుదిబండలా మారాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్తు దుబారా, బకాయిలకు చెక్ పెట్టేందుకు ప్రీపెయిడ్ మీటర్లు ఉపయుక్తంగా ఉంటాయని సంస్థ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న వాటి స్థానంలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను విద్యుత్తు శాఖ ఏర్పాటు చేయనుంది. వీటికి రీఛార్జి నచ్చిన విధంగా చేసుకోవచ్చు. గంటలు, నెలలు, ఏడాదికి.. ఎలా కావాలంటే ఆ విధంగా రీఛార్జి చేసుకునే వీలుంది. స్మార్ట్ మీటరు ఖరీదు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఉంటుందని ఆ శాఖాధికారులు చెబుతున్నారు.
త్వరలోనే అమలు
ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. టెండర్లు పిలుస్తున్నాం. ఇది పూర్తవ్వగానే ఒకట్రెండు నెలల్లో ఈ విధానం వినియోగంలోకి వస్తుంది. ఎంత మేర రీఛార్జి చేసుకుంటే ఆ మేరకు విద్యుత్తు సరఫరా అవుతుంది. దీనివల్ల బకాయిల బెడద తగ్గుతుంది.
- పి.నాగేశ్వరరావు, పర్యవేక్షక ఇంజినీరు, ఈపీడీసీఎల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి విజయంతో భవిష్యత్తు
[ 03-05-2024]
కూటమి అభ్యర్థుల విజయంతో రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మండలం వెంకంపేటలో జరిగిన ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. -
వంద పడకలేనా.. జగన్
[ 03-05-2024]
సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట, మక్కువ, సాలూరు మండలాలకు, గిరిశిఖర గ్రామాల వారికి ఈ ఆసుపత్రే పెద్దదిక్కు. గిరిజనులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. -
అవినీతి బొత్స.. అక్రమాల కోలగట్ల
[ 03-05-2024]
చీపురుపల్లి, విజయనగరం సభల్లో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ మరో అభినవ అంబేడ్కర్. ఆయన అమలు చేసిన పథకాలన్నీ ప్రజలకు ఆమోదయోగ్యమైనవి. -
అక్కసుతో.. ‘ఇంత’ కర్కశత్వమా?
[ 03-05-2024]
ఇదేం ప్రభుత్వం.. ఇదెక్కడి అరాచకం.. అభ్యాగులపై ఇంత పగ ఎందుకు.. అందరూ 60 ఏళ్లు దాటిన వృద్ధులే.. అనారోగ్యంతో కొందరు.. దీర్ఘకాలిక వ్యాధులతో మరికొందరు.. నడుము వంగక కూర్చుని పాకేవారు ఇంకొందరు.. వీరితోనా మీ ఓటు రాజకీయం.. చేతికిచ్చే అవకాశం ఉన్నా.. ఎక్కడెక్కడి నుంచో బ్యాంకులకు మండుటెండలో రప్పించి ఏడిపిస్తారా. -
బాలయ్య అన్స్టాపబుల్!
[ 03-05-2024]
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేపట్టిన ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ సభ గురువారం సాయంత్రం చీపురుపల్లిలో దిగ్విజయంగా జరిగింది. -
పాలకొండను బంగారు కొండగా మారుస్తా!
[ 03-05-2024]
‘పాలకొండను బంగారుకొండగా మారుస్తా. ఇక్కడ అపారమైన వనరులు ఉన్నందున పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. -
నీడ కరవు.. భోజనం బాగోలేదు
[ 03-05-2024]
రాజాం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా పీవోలు, ఏపీవోలకు ఎన్నికల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. -
మాజీ వాలంటీర్లతో ఐప్యాక్ బృందం సమావేశం?
[ 03-05-2024]
కొత్తవలస మండలంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లతో ఐప్యాక్ బృందం అర్ధానపాలెంలోని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయం ఆవరణలో గురువారం ప్రత్యేకంగా భేటీ అయిందని తెలిసింది. -
జగ‘మొండి’.. ‘న’డవని బండి..!
[ 03-05-2024]
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అనేది నినాదం.. డొక్కు బండిలో ప్రయాణం భయం.. భయం నేటి వాస్తవం.
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
-
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
-
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
-
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
-
జగనాసురుడి రాజ్యం.. ఐసీయూలో ఆరోగ్యశ్రీ
-
వైకాపా సర్పంచి వాహనంలో ‘ఎన్నికల’ మద్యం పట్టివేత