logo

రహదారి విస్తరణ పనులపై వినతి

కురుపాం ప్రధాన రహదారిని నిబంధనల ప్రకారం విస్తరించాలని గ్రామస్థులు కోరారు. గురువారం పలువురు కలెక్టరేట్‌కు వెళ్లి జేసీ ఆనంద్‌, ర.భ.శాఖ డీఈ నాగమోహన్‌కు వినతిపత్రాలు ఇచ్చారు.

Published : 24 Mar 2023 02:28 IST

డీఈకి వినతిపత్రం ఇస్తున్న గ్రామస్థులు

కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: కురుపాం ప్రధాన రహదారిని నిబంధనల ప్రకారం విస్తరించాలని గ్రామస్థులు కోరారు. గురువారం పలువురు కలెక్టరేట్‌కు వెళ్లి జేసీ ఆనంద్‌, ర.భ.శాఖ డీఈ నాగమోహన్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. రోడ్డుకు ఒకవైపే తవ్వకాలు చేపట్టేలా కొందరు చూస్తున్నారని ఆరోపించారు. రెండు వైపులా ఏడు మీటర్ల వరకు తొలగించి గ్రామాభివృద్ధికి సహకరించాలని జేసీని కోరారు. జేసీ మాట్లాడుతూ.. కురుపాం అన్ని విధాలా అభివృద్ధి బాటలో నడుస్తుందన్నారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. గ్రామస్థులంతా సమావేశమై ఏకగ్రీవంగా ఒప్పందం చేసుకొని ముందుకు రావాలని ర.భ.శాఖ డీఈ నాగమోహన్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని