logo

సాధారణ ఎన్నికల్లో తెదేపాదే విజయం: వేపాడ

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భేరీజు వేస్తే రానున్న సాధారణ ఎన్నికల్లోనూ తెదేపా తప్పకుండా విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు వ్యక్తం చేశారు.

Published : 27 Mar 2023 03:54 IST

చిరంజీవిరావుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న అశోక్‌గజపతిరాజు

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భేరీజు వేస్తే రానున్న సాధారణ ఎన్నికల్లోనూ తెదేపా తప్పకుండా విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఇప్పటినుంచే శ్రమించాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత ఆదివారం తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు పి.అశోక్‌గజపతిరాజును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన గెలుపునకు కృషి చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అశోక్‌గజపతిరాజు అందించారు. చిరంజీవిరావు మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనను శాసనమండలిలో ప్రవేశానికి అవకాశం కల్పించిన పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి కృతజ్ఞుడినని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 34 నియోజకవర్గాల్లో పర్యటించానని, అన్ని వర్గాల నుంచి వైకాపాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని