పరిశ్రమలు రావాలంటే.. చంద్రబాబు సీఎం కావాలి
కూటమి అధికారంలోకి వచ్చి, చంద్రబాబునాయుడు సీఎం అయితే యువతకు ఉద్యోగాలు వస్తాయని తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు.
మాట్లాడుతున్న కూటమి అభ్యర్థి అదితి గజపతిరాజు
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: కూటమి అధికారంలోకి వచ్చి, చంద్రబాబునాయుడు సీఎం అయితే యువతకు ఉద్యోగాలు వస్తాయని తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. అశోక్బంగ్లాలో గురువారం తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేకపోవడంతో యువకులు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారన్నారు. ఇక్కడే ఉండాలనుకుంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఐటీ కంపెనీలు తెచ్చి, పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు దారి చూపెడతారన్నారు. పారిశ్రామికాభివృద్ధిలేక నిరుద్యోగం పెరిగి, యువత డ్రగ్స్కు బానిసవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించేవారు ఉండకూడదనే వారిని మత్తుపదార్థాల వైపు మళ్లిస్తున్నారని, ఇలాంటి ప్రభుత్వంపై పోరాడాలని కోరారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలను చైతన్యవంతులను చేయాలని, ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు గంటా రవి, పొగిరి పైడిరాజు, గొలగాన సురేంద్ర, మాతా బుజ్జి, మజ్జి పైడిరాజు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కోదండరాం, ప్రవీణ్, కార్పొరేటర్ కర్రోతు రాధామణి, మాజీ కౌన్సిలర్ రాజ్యలక్ష్మి, సర్పంచి జగదీశ్వరి పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, నిరుద్యోగులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోతలరాయ.. ఎత్తిపోతల నీరేదయ్యా
[ 27-04-2024]
ముఖ్యమంత్రి జగన్కు రైతుల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు. బహిరంగ సభల్లో బాకా ఊదడం మినహా అన్నదాతల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపడం లేదు. -
నామపత్రాల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అరకు పార్లమెంటరీ, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం వరకు దాఖలైన నామపత్రాలను రిటర్నింగ్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా అన్నారు. -
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలి
[ 27-04-2024]
వైకాపా అరాచక పాలనకు ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిని కొత్తపల్లి గీత, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. -
వైనాట్ 175 కాదు.. వైకాపాకు 17
[ 27-04-2024]
జనసేన స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్పాలకొండ, గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలో కూటమి గెలుపు తథ్యమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయమని జనసేన స్టార్ క్యాంపెయినర్, సినీనటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. -
వైకాపాతో యువతకు నష్టం: కిమిడి
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, యువతకు ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లిపోయారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు -
ఇంజినీరింగ్ విద్య.. ఓ జగన్మాయ
[ 27-04-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు. -
ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
[ 27-04-2024]
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. -
వీటిని చూస్తే.. పేకమేడలే సిగ్గు పడవా!!
[ 27-04-2024]
పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి.. రేపోమాపో కూలిపోయే పేకమేడలు నిర్మిస్తున్నారు. -
అభివృద్ధిపైనా అక్కసేనా?
[ 27-04-2024]
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. ఇందుకు విరుద్ధంగా ఉంది వైకాపా ప్రభుత్వం తీరు.. ప్రజల అవసరాలతో పని లేదన్నట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నిలిపేసి అక్కసు ప్రదర్శించింది.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు