logo

వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలి

వైకాపా అరాచక పాలనకు ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిని కొత్తపల్లి గీత, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. 

Published : 27 Apr 2024 05:25 IST

మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థిని గీత, చిత్రంలో ఎమ్మెల్యే అభ్యర్థిని జగదీశ్వరి

కొమరాడ, న్యూస్‌టుడే: వైకాపా అరాచక పాలనకు ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిని కొత్తపల్లి గీత, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. శుక్రవారం కొమరాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూపర్‌ 6 పథకాల గురించి తెలియజేశారు. వైకాపా ప్రభుత్వంలో ప్రచారాలు తప్ప పనులు జరగలేదని ఎద్దేవా చేశారు. పూర్ణపాడు- లాబేసు వంతెన నిర్మాణం, ఏనుగులతో సమస్యలు ఈ ప్రభుత్వానికి కనిపించలేదా అని ప్రశ్నించారు. కొన్ని వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ డి.జగదీశ్‌, తెదేపా రాష్ట్ర కార్యదర్శి వీరేశ్‌ చంద్రదేవ్‌, డి.లక్ష్మణరావు, మండల కన్వీనరు శేఖర్‌పాత్రుడు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని