కోతలరాయ.. ఎత్తిపోతల నీరేదయ్యా
ముఖ్యమంత్రి జగన్కు రైతుల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు. బహిరంగ సభల్లో బాకా ఊదడం మినహా అన్నదాతల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపడం లేదు.
ముఖ్యమంత్రి జగన్కు రైతుల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు. బహిరంగ సభల్లో బాకా ఊదడం మినహా అన్నదాతల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపడం లేదు. జిల్లాలో జీవగెడ్డల నుంచి వృథాగా పోతున్న నీటిని పొలాలకు మళ్లించేందుకు గత ప్రభుత్వాలు జిల్లాలో పదికి పైగా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశాయి. కొన్నాళ్లు బాగానే పనిచేసినా నిర్వహణ లేక మూలకు చేరాయి.
న్యూస్టుడే, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం
మాటలు..
రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పేందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా. సాగునీటి వనరుల నిర్మాణాలు చేపట్టి పుష్కలంగా నీరు అందిస్తున్నాం.
పలు వేదికలపై ముఖ్యమంత్రి జగన్
చేతలు..
మన్యం జిల్లాలో సుమారు 12 వేల ఎకరాల్లోని మెట్ట, బీడు భూములకు సాగునీరు అందించేందుకు గత ప్రభుత్వాలు ఎత్తిపోతల పథకాలను నిర్మించాయి. అన్ని చోట్లా ఇవి మూలకు చేరినా వైకాపా అయిదేళ్ల పాలనలో ఎటువంటి మరమ్మతులు లేవు.
కాట్రగడ(బి) వద్ద వేసిన శిలాఫలకం
4800 ఎకరాల ఎదురుచూపు
భామిని, న్యూస్టుడే: వంశధార నుంచి వస్తున్న నీరు వృథాగా సముద్రంలో కలిసిపోకుండా గత ప్రభుత్వ హయాంలో కిమిడి కళావెంకటరావు మంత్రిగా ఉన్న సమయంలో మండలంలోని పాలవలస, వడ్డంగి వద్ద ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయించారు.
- వడ్డంగి, నేరడి, నులకజోడు గ్రామాల్లోని 2,500 ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా గజపతిసాగరం వద్ద పథకం ఏర్పాటుకు రూ.33 కోట్లతో శంకుస్థాపన చేశారు.
- కాట్రగడ(బి) సమీపంలో మనుమకొండ, పాలవలస, బొమ్మిక, కాట్రగడ(బి) గ్రామాల్లోని 2,300 ఎకరాలకు నీరిచ్చేలా రూ.18.10 కోట్లతో అంచనాలు తయారు చేసి భూమిపూజ చేశారు. అనంతరం ఎన్నికల కోడ్ రావడంతో పనులు ముందుకు కదలలేదు. దీంతో 13 పంచాయతీల ప్రజలు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.
అయిదేళ్లలో నిధులేవీ
పైపులైను కుండీ వద్ద మరమ్మతులు చేస్తున్న సిబ్బంది(పాతచిత్రం)
సీతానగరం, న్యూస్టుడే: మండలంలోని గాదెలవలస వద్ద సువర్ణముఖి నది నుంచి రెండు దశల్లో నీరు సరఫరా చేసి 450 ఎకరాలకు అందించేలా 1993లో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. స్టేజ్-1 నుంచి స్టేజ్-2కు నీరు పంపించే కాలువ తవ్వకంతో సరఫరా అరకొరగా ఉండేది. ఈ స్థానంలో పైపులైను ఏర్పాటు చేశారు. కానీ తరచూ మరమ్మతులు, పైపులైను లీకవడంతో గాదెలవలస, బూర్జ, ఆవాలవలస, జె.రాయపురానికి చెందిన 500 మంది చిన్న, సన్నకారు రైతుల సంఘం తరఫున పనులు చేసుకునేవారు. కానీ అయిదేళ్లుగా ఎలాంటి నిధులు మంజూరు కాకపోవడంతో గోగు, వేరుసెనగ పంటలపై ఆధారపడే వారు ఇబ్బందులు పడుతున్నారు.
మూడేళ్లుగా మూలనే
బలిజిపేట: బలిజిపేట మండలంలోని అంపావల్లిలో రూ.1.20 కోట్లతో వీరాంజనేయ ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు 2001లో అప్పటి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు నిధులు మంజూరు చేయించారు. వేగావతి నది నుంచి 518 ఎకరాల ఆయకట్టుకు నీరు మళ్లేలా బావి ఏర్పాటు చేశారు. ఆయకట్టు మొత్తానికి అందకపోవడంతో పైపులైన్లు మార్చాలని నిర్ణయించారు. తెదేపా కాలంలో మంత్రి మృణాళిని వద్దకు రైతులు వెళ్లగా రూ.కోటి మంజూరు చేశారు. రెండేళ్ల పాటు సక్రమంగా సాగునీరు వెళ్లగా తర్వాత నిర్వహణ వదిలేశారు. దీంతో మూడేళ్లుగా మూలకు చేరింది.
అడారు అలంకారప్రాయం
పార్వతీపురం గ్రామీణం, న్యూస్టుడే: పార్వతీపురం, మక్కువ మండలాల్లోని 650 ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు మినీ జలాశయం నిర్మించాలని 2006లో భావించారు. వివిధ కారణాలతో పనులు ఆలస్యం కావడంతో తాత్కాలికంగా వంద ఎకరాలకు సాగు నీరు ఇచ్చేలా 2012లో ఎత్తిపోతల పథకం నిర్మించారు. మొదటల్లో దిగువ అడారు, ఎగువ అడారు, గుడారివలస, గదబవలసకు చెందిన రైతులు లబ్ధి పొందేవారు. కొన్నాళ్లకు మోటార్లు పాడయ్యాయి. ఒకటి, రెండు సార్లు బాగు చేసినా తర్వాత పట్టించుకోలేదు. దీంతో మూడేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలెక్టరేట్కే దిక్కులేదు.. రాజధానులు కడతారా!!
[ 09-05-2024]
ప్రభుత్వం ఎంత విఫలమైందో జిల్లాలో పాలన చూస్తే తెలుస్తుంది. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. పార్వతీపురం మన్యం జిల్లాగా ఆవిర్భవించి రెండేళ్లు దాటుతున్నా కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలకు ఒక్క భవనం కూడా నిర్మించలేకపోయారు. -
నేరడి.. హామీల గారడీ
[ 09-05-2024]
ప్రతి ఎకరాకు సాగు నీరందస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని దగా చేశారు. అయిదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిస్సారంగా మార్చారు. -
సమన్వయంతో ఎన్నికల నిర్వహణ
[ 09-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆర్వో, కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. -
ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి
[ 09-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి పోలింగ్ శాతం పెంపునకు కృషి చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు తలాత్ పర్వేజ్ ఇక్బాల్ రోహెల్లా పిలుపునిచ్చారు. -
కాలకూట విషం
[ 09-05-2024]
నకిలీ మద్యం మందుబాబుల పాలిట కాలకూట విషంగా మారింది.. ప్రస్తుతం విచ్చలవిడిగా లభిస్తున్న మద్యానికి చాలామంది బానిసలైపోయారు. మత్తులో మునుగుతూ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. -
దీవిస్తానని... దివాలా తీయించావ్..!!
[ 09-05-2024]
తల్లిదండ్రులు కేవలం వారి పిల్లలను కళాశాలలకు పంపండి చాలు.. వారి మేనమామగా నేను అండగా ఉంటా.. కళాశాల, కోర్సుతో సంబంధం లేకుండా విద్యా, వసతి దీవెన అందిస్తా.. మీరు చదువుకోండి.. -
పర్యాటకంపై ‘జగన్ పడగ’
[ 09-05-2024]
ఎత్తయిన పచ్చని గిరులు, గలగల పారే కొండవాగులు, గుట్టల నుంచి జాలువారే సెలయేళ్లు, నదులకు నిలకడ నేర్పే జలాశయాలు, చారిత్రక అవశేషాల నిలయాలు, ఉత్సాహానిచ్చే సాహస క్రీడలు... -
యువతా మేలుకో.. భవిత మార్చుకో!
[ 09-05-2024]
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది! ఇది నిజమో కాదో.. కాసేపు పక్కన పెడితే.. మరో అయిదు రోజుల్లో మీరు వేసే రెండు ఓట్లు మాత్రం మీ జీవితాలను మార్చుతాయి. చీకట్లను తరిమేసి వెలుగుల మయం చేస్తాయి. -
రాత్రికి రాత్రే ఇళ్లపై జగన్ స్టిక్కర్లు
[ 09-05-2024]
మండలంలోని బూడిపేట గ్రామంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాత్రికి రాత్రే కొన్ని ఇళ్లపై జగనన్న స్టిక్కర్లు అతికించారు. -
పాలీసెట్లో మెరిసిన బాలికలు
[ 09-05-2024]
పాలీసెట్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో బాలికలు అధిక సంఖ్యలో ఉతీర్ణులయ్యారు. విజయనగరం జిల్లాలో 3,182 మంది పరీక్ష రాయగా, 2,875 మంది (90.35 శాతం), పార్వతీపురం మన్యంలో 384 మంది పోటీపడగా 341 మంది (88.80 శాతం) బాలికలు పాసయ్యారు. -
మనస్తాపంతో వృద్ధుడి బలవన్మరణం
[ 09-05-2024]
భార్య మృతిచెందిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన భోగాపురం మండలంలోని దల్లిపేట గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.