ఆరేళ్ల నుంచి అసంపూర్తిగానే పంచాయతీ భవనం
తెదేపా ప్రభుత్వ పాలనలో ప్రారంభమైన బలిజిపేట మండలంలోని వెంగాపురం గ్రామపంచాయతీ భవనం ఆరేళ్ల కిందట నుంచి నేటికీ పునాదులతోనే మిగిలిపోయింది.
బలిజిపేట: తెదేపా ప్రభుత్వ పాలనలో ప్రారంభమైన బలిజిపేట మండలంలోని వెంగాపురం గ్రామపంచాయతీ భవనం ఆరేళ్ల కిందట నుంచి నేటికీ పునాదులతోనే మిగిలిపోయింది. వెంగాపురం గ్రామంలో అయిదు దశాబ్దాల కిందట నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీని స్థానంలో కొత్త భవన నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.15లక్షలు మంజూరు చేసింది. గుత్తేదారుడు సుమారు రూ.రెండు లక్షలు ఖర్చు చేసి బేసిమెంట్ వరకు పనులు పూర్తి చేశారు. ఈలోగా ఈ పనులను ఆకస్మికంగా విజిలెన్సు అధికారులు పరిశీలించి, పనుల నాణ్యత లోపించిందని, రూ.1.40లక్షలు సదరు గుత్తేదారుడి నుంచి రికవరీ చేశారు. ఈ అంశంపై పంచాయతీరాజ్శాఖ జేఈ అంబేడ్కర్ను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా, ఈ భవనం స్థానంలో సచివాలయ భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తున్నదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగునీటి వనరులపై..చిన్నచూపేలా?
[ 17-05-2024]
జిల్లాలో సహజ వనరులకు లోటు లేదు. ఎక్కడికక్కడ నదులు.. వాగులు.. చెక్డ్యాంలు ఉన్నా.. పొలాలకు మాత్రం నీరందని పరిస్థితి నెలకొంది. -
పురపాలిక నిధులతోనే అత్యవసర సేవలు
[ 17-05-2024]
అత్యవసర సేవలకు పురపాలిక నిధులే ఖర్చు చేస్తున్నామని మున్సిపల్ ప్రాంతీయ సంచాలకుడు నాగరాజు అన్నారు. మండలంలో గురువారం పర్యటించిన ఆయన తొలుత కమిషనర్ ఛాంబర్లో కూర్చుని అధికారులతో మాట్లాడారు. -
పౌరాణిక పాత్రలు.. గాయనిగా పాటలు
[ 17-05-2024]
పార్వతీపురం మండలంలోని బాలగుడబ గ్రామానికి చెందిన పౌరాణిక కళాకారిణి కొప్పర మంగాదేవి(మంగమ్మ) ఉత్తరాంధ్ర ప్రజలకు సుపరిచితులు. -
‘మిథ్యా’లయం!
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు అవకాశమున్న ఏకైక జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. 2007లో కాకినాడ విశ్వవిద్యాలయం ప్రాంగణంగా ఇది ఏర్పాటైంది. -
ఓటరు తీర్పుపై ఎవరి ధీమా వారిదే..!
[ 17-05-2024]
ఎన్నికల యుద్ధం ముగిసింది.. పోటీలో తొలి నుంచి అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు కదిలారు. ఓటరు తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. -
పట్టణవాసిపై పన్ను బాదుడు
[ 17-05-2024]
చంద్రబాబు హయాంలో అద్దె ప్రాతిపదికన పన్నులు విధించేవారు. ప్రాంతాలను ప్రామాణికంగా తీసుకునేవారు. నామమాత్రపు వార్షిక పన్ను వసూలు చేసేవారు. -
షట్టర్లు ఇలా.. నీరు పారేదెలా?
[ 17-05-2024]
సంతకవిటి మండలం రంగరాయపురం సమీపంలోని నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట ఇది. దీని ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారికంగా 38,500 ఎకరాల ఆయకట్టుకు, అనధికారికంగా మరో 20 వేల ఎకరాలకు సాగునీరు అందాలి. -
ఆ విపత్తు నుంచి ఎంతో నేర్చుకున్నా
[ 17-05-2024]
‘ఏడాది పాటు ఎంతో నేర్చుకున్నా. ఇది నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా. క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుంది’ అని జిల్లా సహాయక కలెక్టర్ బి.సహాదిత్ వెంకట త్రివినాగ్ అన్నారు. -
అదనపు దూరం... తప్పని భారం
[ 17-05-2024]
పాలకొండ ఆర్టీసీ డిపో గతంలో రీజియన్లోనే ఆదాయంలో మొదటి స్థానంలో ఉండేది. కానీ కొన్ని ఏళ్లుగా తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది. -
డోలీలోనే గర్భిణి ప్రసవం
[ 17-05-2024]
గిరిజనులు అత్యవసర వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు వారికి డోలీ మోతలు తప్పడం లేదు. జిల్లాలో అత్యధిక గిరిజన జనాభా ఉన్న ఎస్.కోట నియోజకవర్గంలో మరోసారి ఈ పరిస్థితి ఎదురైంది. -
ఇంకెప్పుడు వేస్తారో..?
[ 17-05-2024]
కురుపాం మండలం పొడి పంచాయతీ సంతోషపురం కూడలి నుంచి మీగడ గ్రామం వరకు రూ.1.90 కోట్ల ఉపాధి నిధులతో బీటీ రహదారి పనులకు ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గత ఏడాది జులై 25న భూమిపూజ చేశారు. -
ఎఫ్సీఐ పేరిట బెదిరింపులు
[ 17-05-2024]
ఎఫ్సీఐ(ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- ఆహార కల్తీ నియంత్రణ శాఖ) పేరిట ఓ హాటల్ యాజమాన్యాన్ని బెదిరించిన నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఎస్సై హరిబాబు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
-
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
-
ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?