‘దివ్యాంగుల ఉసురు జగన్కు తగులుతుంది’
దివ్యాంగుల ఉసురు జగన్ ప్రభుత్వానికి తగులుతుందని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు గోనుగుంట కోటీశ్వరరావు అన్నారు. మంగళవారం బొబ్బిలిలో తెదేపా ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి దివ్యాంగుల సమావేశంలో మాట్లాడారు.
మాట్లాడుతున్న కోటీశ్వరరావు, బేబినాయన
బొబ్బిలి, న్యూస్టుడే: దివ్యాంగుల ఉసురు జగన్ ప్రభుత్వానికి తగులుతుందని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు గోనుగుంట కోటీశ్వరరావు అన్నారు. మంగళవారం బొబ్బిలిలో తెదేపా ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి దివ్యాంగుల సమావేశంలో మాట్లాడారు. వికలాంగుల ఇంటికి వెళ్లి పింఛను ఇవ్వకుండా సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిప్పారని, మనోవేదన, వడదెబ్బకు గురై 30 మంది వరకు చనిపోయారని ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన సీఎస్ జవహర్రెడ్డిని 48 గంటల్లో విధుల నుంచి తప్పించాలని డిమాండు చేశారు. బొబ్బిలి వికలాంగ సంఘ అధ్యక్షుడు రాంబాబు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పువ్వల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. భాజపా నియోజకవర్గ కన్వీనర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు