విద్యా దీవెన నిధులపై తల్లులకు అవగాహన
విద్యాదీవెన, వసతిదీవెనకు సంబంధించిన సంయుక్త ఖాతాలు ఇంకా ఏమైనా పెండింగ్లో ఉంటే తక్షణమే అప్డేట్ చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఎన్.లక్ష్మానాయక్ సూచించారు.
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఎన్.లక్ష్మానాయక్
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: విద్యాదీవెన, వసతిదీవెనకు సంబంధించిన సంయుక్త ఖాతాలు ఇంకా ఏమైనా పెండింగ్లో ఉంటే తక్షణమే అప్డేట్ చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఎన్.లక్ష్మానాయక్ సూచించారు. 2023-24 సంవత్సరానికి విద్యా, వసతి దీవెన పథకాలకు సంబంధించి ఎనిమిది అంశాలపై స్థానిక బీఆర్ అంబేడ్కర్ భవన్లో బుధవారం ఒంగోలు డివిజన్ పరిధిలోని గ్రామ, వార్డు సంక్షేమ విద్యా సహాయకులు, కళాశాలల సమన్వయకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు విడుదలైన నిధులను కళాశాలలకు చెల్లించని తల్లులకు అవగాహన కల్పించి వాటిని చెల్లించే విధంగా చూడాలన్నారు. ఆరంచెల విధానంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి కారణాలను నవశకం లాగిన్లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఎన్పీసీఐ పెండింగ్ ఉన్న ఎస్సీ విద్యార్థుల ఆధార్ నంబర్ను బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేయాలని సూచించారు. సకాలంలో ఆప్డేట్ చేయని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో సంక్షేమ శాఖ అధికారులు ఎం.ఉదయశ్రీ, యు.దానయ్య, కె.శ్రీనివాసులు, అమర సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమాత్యుల ‘కొండ’పి.. నేతలకు అడ్డాగా గడ్డ
[ 16-06-2024]
కొండపి.. పొగాకు, శనగ పంటల సాగుకే కాదు.. ఆది నుంచీ రాజకీయ చైతన్యం కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం. 1955లో నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అభ్యర్థులు ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసి గెలుపొందారు. -
నేలకు దిగొచ్చిన నెత్తికెక్కిన కళ్లు
[ 16-06-2024]
నాయకులు ఆదేశించారని అది ఎంత అడ్డగోలు వ్యవహారమైనా, చట్ట విరుద్ధమైనా నిబంధనలకు పాతరేసి మరీ అధికారులు పాటించారు. ప్రత్యర్థులపై ఎడాపెడా కేసులు కట్టేశారు. కాలు కదిపినా, నోరు మెదిపినా స్టేషన్లలో నిర్భంధించి వేధించారు. -
నాన్న నడిపించి.. జీవితంలో గెలిపించి
[ 16-06-2024]
నాన్న.. మాట కటువు అయినా మనసు మాత్రం వెన్న. ప్రతిక్షణం తన పిల్లల భవిష్యత్తుకే పరితపిస్తుంటాడు. తాను ఏ స్థాయిలో ఉన్నా తనకంటే బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. -
మంత్రి చొరవ బడికి మళ్లీ కళ
[ 16-06-2024]
పాఠశాలల విలీనం పేరుతో వైకాపా ప్రభుత్వం పేద పిల్లల చదువులతో చెలగాటమాడింది. తక్కువ సంఖ్యలో విద్యార్థులున్నారంటూ కొన్నిచోట్ల ఏకంగా బడులను మూసేసింది. -
లంచావతారులు మాకవసరం లేదు
[ 16-06-2024]
‘పనులు చేసేందుకు ప్రజల నుంచి లంచాలు తీసుకునే అధికారులు మాకు అవసరం లేదు. అటువంటి వారు తక్షణమే సెలవు పెట్టి వెళ్లి పోవాలి. లేకుంటే నేనే పంపిస్తా’... -
తెదేపాకు ఓటేశారని కక్ష.. తాగునీరు నిలిపివేత!
[ 16-06-2024]
ఎన్నికలు ముగిశాయి. వైకాపా ఘోర పరాజయం పాలైంది. ప్రజలు తెదేపా కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు. ఈ విషయాన్ని కొందరు వైకాపా సానుభూతి ఉద్యోగులు జీర్ణించుకోలేకున్నారు. -
మాలకొండలో ప్రజాప్రతినిధులు
[ 16-06-2024]
పుణ్యక్షేత్రమైన మాలకొండ లక్ష్మీనృసింహస్వామిని కందుకూరు, చీరాల, కనిగిరి ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం.కొండయ్య, ఉగ్రనరసింహారెడ్డి శనివారం దర్శించుకున్నారు.