logo

‘దామచర్లపై అసత్య ఆరోపణలు తగవు’

మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఒంగోలు నగరపాలక సంస్థ కార్పొరేటర్‌ టి.రవితేజ హెచ్చరించారు.

Published : 05 Oct 2022 04:51 IST

మాట్లాడుతున్న కార్పొరేటర్‌ రవితేజ, చిత్రంలో తెదేపా నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఒంగోలు నగరపాలక సంస్థ కార్పొరేటర్‌ టి.రవితేజ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దామచర్ల జనార్దన్‌ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తెదేపాకు చెందిన ఫైవ్‌మెన్‌ కమిటీ కమీషన్లు వసూలు చేసి ఆయనకు ఇచ్చేదని ఆరోపించడం సరికాదన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కొత్త రోడ్లు నిర్మించిన ఘనత దామచర్లదేనన్నారు. ఏ పనికైనా కమీషన్లు వసూలు చేసే సంస్కృతి వైకాపా నాయకులదేనని విమర్శించారు. గత మూడున్నరేళ్లగా పైపై మరమ్మతులు మినహా... నగరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలేవీ లేవని ఎద్దేవా చేశారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్‌ జూటూరి కృష్ణ, పార్టీ నాయకులు దాచర్ల వెంకట రమణయ్య, కపిల్‌బాషా, బ్రహ్మానందం, ఎద్దు శశికాంత్‌భూషణ్‌, కాకర్ల ఈశ్వర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని