ఈ-వాహనాలతోే పర్యావరణ పరిరక్షణ
విద్యుత్తు వాహనాలను ఎక్కువ మంది వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు; రోజురోజుకు తరిగిపోతున్న ఇంధన వనరులను ఆదా చేయొచ్చని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. విద్యుత్తు వాహనాల వినియోగంపై గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఆటో నడిపి పనితీరు పరిశీలిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్
విద్యుత్తు వాహనాలను ఎక్కువ మంది వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు; రోజురోజుకు తరిగిపోతున్న ఇంధన వనరులను ఆదా చేయొచ్చని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. విద్యుత్తు వాహనాల వినియోగంపై గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. నెడ్క్యాప్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఒంగోలు ప్రకాశం భవన్లో కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం కారణంగా వాతావరణ కాలుష్యం పెరుగుతోందని, ప్రత్యామ్నాయంగా బ్యాటరీతో నడిచే ఈ-ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తే కాలుష్యంతో పాటు, ఇంధన ఖర్చు బాగా తగ్గుతుందన్నారు. ఇందుకుగాను ఈ-ద్విచక్ర వాహనాలు, కార్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. తొలుత ఈ-ఆటో, ఈ-వాహనాలను ఆయన స్వయంగా నడిపి పరిశీలించారు. కార్యక్రమంలో నెడ్క్యాప్ డీజీఎం హరనాథ్బాబు, పీసీబీ ఈఈ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- న్యూస్టుడే, ఒంగోలు గ్రామీణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్