కరోనాతో ఆర్థికంగా కుదేలై.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య
కరోనాతో ఆర్థికంగా కుదేలైన ఓ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం సింగరాయకొండలో చోటు చేసుకుంది.
సింగరాయకొండ గ్రామీణం, న్యూస్టుడే: కరోనాతో ఆర్థికంగా కుదేలైన ఓ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం సింగరాయకొండలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీరామ్ తెలిపిన వివరాల మేరకు..ఒంగోలుకు చెందిన గోపవరపు వెంకట భరత్కుమార్రెడ్డి (31) గత కొంతకాలంగా సింగరాయకొండలోని కందుకూరు రోడ్డులో నివాసముంటున్నారు. ఈయన స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో జూనియర్ సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల క్రితం భరత్ కరోనా బారిన పడటంతో రూ.లక్షలు ఖర్చవ్వడంతో కుటుంబం ఆర్థికంగా కుదేలైంది. వాటి నుంచి గట్టెక్కేమార్గం కన్పించకపోవడంతో ఆయన నాలుగుసార్లు ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భరత్ కుమార్ రెడ్డి భార్య, కుమారుడిని తీసుకుని స్వగ్రామమైన బేస్తవారపేటకు వెళ్లారు. తల్లి ఒంగోలుకు వెళ్లడంతో మంగళవారం మధ్యాహ్నం తన పడక గదిలోకి వెళ్లి గాలి పంకాకు చీరతో ఉరి వేసుకున్నారు. ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి సింగరాయకొండలోని ఇంటికి వచ్చి పరిశీలించగా కుమారుడి మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఈ మేరకు ఆమె ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్కు తరలించారు.
తనిఖీల్లో రూ.2.5 లక్షల నగదు స్వాధీనం
పామూరు, న్యూస్టుడే: మండలంలోని తిరగలదిన్నె చెక్పోస్టు వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మంగళవారం ఓ వ్యక్తి వద్ద ఉన్న రూ.2,58,350 నగదు పట్టుబడిందని తహసీల్దార్ షాకిర్ పాషా తెలిపారు. పామూరుకు చెందిన శ్రీసాయి ఏజెన్సీన్ నిర్వాహకుడు తన వ్యాపారం నిమిత్తం బిస్కెట్లు, ఇతర తినుబండారాలు గ్రామాల్లో దుకాణాలకు విక్రయించగా వచ్చిన నగదుతో పామూరు వస్తుండగా.. తిరగలదిన్నె చెక్పోస్టు వద్ద పోలీసులు, ఎన్నికల సిబ్బంది తనిఖీలు చేపట్టడంతో రూ.2,58,350 నగదు పట్టుబడింది. సదరు వ్యక్తి వద్ద ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతోనే నగదు స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు.
ఇప్పటివరకు రూ.20 లక్షల మద్యం పట్టివేత..
దర్శి, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల నియమావళి అందుబాటులోకి వచ్చినప్పటి (మార్చి 16) నుంచి ఇప్పటివరకు సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.4,89,980 నగదును పట్టుకున్నట్లు రిటర్నింగ్ అధికారి లోకేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నగదుతో పాటు 174 లీటర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సెబ్, ఎఫ్ఎస్టీ చేసిన దాడుల్లో రూ.20 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు విడి విక్రయాలు చేపడుతున్న దర్శిలోని బార్ అండ్ రెస్టారెంట్ను సీజ్ చేశానమన్నారు. నియోజకవర్గ పరిధిలోని 27 ప్రాంతాల్లో ఉన్న 58 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 269 కేసుల్లో 3007 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఆర్వో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన భూములపై జగన్ పెత్తనం.. అరాచకానికి పరాకాష్ట: చంద్రబాబు
[ 03-05-2024]
రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
వైకాపా పందికొక్కులు.. బొక్కింది రూ.666 కోట్లు
[ 03-05-2024]
జగన్ పాలనలో వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు పందికొక్కుల అవతారమెత్తారు. పేదల నోరు కట్టి.. పొట్ట కొట్టి చౌక బియ్యాన్ని అందినంత బొక్కారు. నేతలు, ప్రజాప్రతినిధులకు కమీషన్లు ముట్టజెబుతూ వారి అండతో లెక్కపెట్టలేనంతగా మింగేశారు. -
నరకానికి దారులు
[ 03-05-2024]
జిల్లావ్యాప్తంగా రహదారులన్నీ ఛిద్రమవవ్వడంతో ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ఏళ్ల తరబడి మరమ్మతుల ఊసే లేకపోవడంతో దుర్ఘటనలకు నిలయాలుగా మారాయి. మండల కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్లతో పాటు, పల్లెల మధ్య ఏర్పాటుచేసిన లింకు, గ్రావెల్ రోడ్లు కూడా అధ్వానంగా తయారయ్యాయి. -
విపక్షాలపై పగ.. పండుటాకులపై కక్ష
[ 03-05-2024]
సామాజిక భద్రతా పింఛన్లు పొందుతున్న లబ్థిదారులకు ప్రభుత్వం పింఛన్ నగదును సచివాలయ సిబ్బందితో 2 నుంచి 3 రోజుల్లో పూర్తిగా పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆదిశగా చర్యలు చేపట్టలేదు. -
బిడ్డనంటివి.. ఏడి‘ఫింఛను’ కుట్ర పన్నితివి
[ 03-05-2024]
వైకాపా ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందు సామాజిక పింఛను లబ్ధిదారులతో ఓట్ల రాజకీయానికి తెరలేపింది. వృద్ధులను ముప్పుతిప్పలు పెట్టి.. ప్రతిపక్షంపైకి నెపం నెట్టాలనే ఉద్దేశంతోనే మే నెల నగదును బ్యాంక్లకు జమ చేసింది. -
నేడు జిల్లాకు అధినేతలు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారు. -
అప్పుల బాధ తాళలేక యువ రైతు ఆత్మహత్య
[ 03-05-2024]
అప్పుల బాధ తాళలేక యువ రైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్నగర్లో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. -
మాదిగలకు ఆది నుంచీ అండగా చంద్రన్న
[ 03-05-2024]
రాష్ట్రంలో జగన్ అనే పాలకుడు పోవాలి, మరోసారి చంద్రబాబు రావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ ఆకాంక్షించారు. -
ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించొద్దు
[ 03-05-2024]
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచార ఖర్చుల నిర్వహణ విషయంలో నిబంధనలు ఉల్లంఘించరాదని కలెక్టర్ దినేష్కుమార్ స్పష్టంచేశారు. -
తెదేపాలో చేరిన వార్డు వాలంటీర్లు
[ 03-05-2024]
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన అయిదుగురు వాలంటీర్లు గురువారం రాజీనామా చేసి వైకాపాను వీడి తెదేపా చేరారు. -
రైల్వే పనులు త్వరలో పూర్తి
[ 03-05-2024]
దొనకొండ రైల్వేస్టేషన్లో నిలిచిన పనులు త్వరలో పూర్తి చేయాలని రైల్వే గుంటూరు డివిజనల్ మేనేజర్ ఎం.రామకృష్ణ అన్నారు. అమృత్ భారత్ పనులు పరిశీలనలో భాగంగా ఆయన గురువారం దొనకొండ వచ్చారు. -
వైభవంగా స్వామివారి చక్రస్నానం
[ 03-05-2024]
పట్టణంలోని కాప వీధిలో కొలువైన వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం స్వామివారి చక్రస్నానం పూజారులు కనులపండువగా నిర్వహించారు. -
నిర్లక్ష్యంతో ఆటలకు చేటు
[ 03-05-2024]
వైకాపా ప్రభుత్వం క్రీడారంగంపై శీతకన్ను వేసింది. ఫలితంగా యువత, విద్యార్థులకు గల్లీ క్రీడలే దిక్కవుతున్నాయి. చినుకు పడితే చాలు నగరంలోని మినీ స్టేడియం జలమయమవుతోంది. -
కోడిగుడ్ల డబ్బులు మింగేశారు!
[ 03-05-2024]
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కోడిగుడ్లు సరఫరా బిల్లుల చెల్లింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రతినెలా వారానికి ఒకసారి గుత్తేదారు కోడిగుడ్లు సరఫరా చేస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM