ప్రాజెక్టులు, పాత హామీల దాటవేత
అసలే వెనుకబడిన ఎస్సీ నియోజకవర్గం..దానికితోడు గత అయిదేళ్లుగా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేపట్టిందీ లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం టంగుటూరులో ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. స్థానికుల సహనానికి పరీక్ష పెట్టారు.
ఒక్కటీ చేయకున్నా.. అన్నీ చేసేశానంటూ
అబద్ధాలు వల్లించిన జగన్
సభకు జనం రాకపోవడంతో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ సమీకరిస్తున్న సుధాకర్బాబు, చెవిరెడ్డి
టంగుటూరు, న్యూస్టుడే: అసలే వెనుకబడిన ఎస్సీ నియోజకవర్గం..దానికితోడు గత అయిదేళ్లుగా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేపట్టిందీ లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం టంగుటూరులో ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. స్థానికుల సహనానికి పరీక్ష పెట్టారు. హామీల జల్లు కురిపిస్తారని..ప్రాజెక్టులను గట్టెక్కిస్తానంటూ గట్టి హామీ ఇస్తారని ఎదురుచూసిన వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. నలభై నిమిషాల పాటు మాట్లాడినా..ఒక్కటీ ఉపకరించేది లేకపోవడంతో వారు పెదవి విరిచారు. నా ఎస్సీలు, నా ఎస్టీలంటూ పదే పదే ప్రస్తావించే జగన్, ఎస్సీ నియోజకవర్గం కొండపిలో పర్యటించినప్పుడు వారి అభ్యున్నతికి ఇది చేస్తానంటూ స్పష్టంగా చెప్పలేదు. ఎన్నో ఆశలతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, యువకులు, ఆఖరికి పార్టీ నాయకులు కూడా చివరికి ఊసూరోమంటూ వెనుతిరిగారు.
జనానికి ఏం చెబుతాం: ముఖ్యమంత్రి సభలో బలమైన హామీలిస్తే స్థానికంగా ప్రచారం చేసుకుందామని భావించిన పార్టీ శ్రేణులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. స్థానికులను పలు సమస్యలు వెంటాడుతున్నాయి. పొగాకు రైతులకు ఊరట కలిగించే అంశాన్ని ప్రస్తావిస్తారని పలువురు భావించారు. ఇవన్నీ వదిలేసి చంద్రబాబుపై పసలేని విమర్శలు చేస్తూ..చెప్పిందే చెబుతూ ఊదరకొట్టడం వల్ల ఏం ఉపయోగమని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
సంగమేశ్వరం.. శీతల గిడ్డంగుల ఊసెత్తకుండా..: ప్రతిపక్ష నేత హోదాలో జగన్ 2019 మార్చి 20న టంగుటూరు బొమ్మల కూడలికి వచ్చారు. అక్కడ నిర్వహించిన సభలో సంగమేశ్వరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు తాగు, సాగు నీరు అందిస్తానని చెప్పారు. ఈ అయిదేళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం ఈసారైనా దానిపై స్పష్టత ఇస్తారన్న ఆశతో ఎదురు చూడగా, వారికి ఆశాభంగమే ఎదురైంది. ఇక పొగాకు నిల్వ చేసుకునేందుకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. అది కూడా అలాగే మిగిలింది. శిథిల రోడ్లు..మంచినీటి కష్టాలు వంటివి అక్కడివారిని వెంటాడుతున్నాయి. ఇలా పాత హామీలన్నీ అలాగే మిగిలిపోగా.. అన్నీ చేసేశామని ఆయన చెప్పడంతో సభకు హాజరైన వారు ముక్కున వేలేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూన్ 4 ఇంకా రాదేమి!
[ 21-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసి వారమైంది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూమ్లలో పదిలంగా ఉంది. జూన్ 4న ఓట్ల లెక్కింపుతో విజేతలెవరనేది తేలిపోతుంది. -
ప్రమాదంలో తపాలా తీర్పు!
[ 21-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓట్లు నిక్షిప్తం చేసుకున్న ఈవీఎంలు స్ట్రాంగ్రూముల్లో కేంద్ర సాయుధ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు పహారాలో ఉన్నాయి. వీటి భద్రతపై అనుమానాలు లేవు. -
ఊరికో వైకాపా ‘మారీ’చుడు
[ 21-05-2024]
వైకాపా నేతలు ఇసుక, మట్టిలో తెగ మేశారు. సహజ వనరులను కొల్లగొట్టి నమిలి మింగారు. దొంగలు దొంగలూ కలిసి ఊళ్లు పంచుకున్నట్లు- జిల్లాలో అధికారికంగా ఒక్క రీచ్ కూడా లేకున్నా.. ఇసుక లభించే ప్రాంతాలను పంచేసుకున్నారు. -
జిల్లా జల్లెడ
[ 21-05-2024]
జిల్లాలోని పలు ప్రాంతాలను పోలీసులు జల్లెడ పట్టారు. సోమవారం తెల్లవారుజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. -
స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రత
[ 21-05-2024]
ఈవీఎంలు భద్రపరిచిన నేపథ్యంలో ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణానికి సాయుధ బలగాలతో మూడంచెల భద్రతను కల్పించినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హర్షిత.. స్వర్ణ విజేత
[ 21-05-2024]
జాతీయ స్థాయిలో నిర్వహించిన నైపుణ్య పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థిని నూకసాని హర్షిత సత్తా చాటి బంగారు పతకం కైవనం చేసుకుంది. -
రూ. కోట్ల వ్యయం.. నిర్లక్ష్యమే ఘనం
[ 21-05-2024]
రూ. కోట్ల వ్యయంతో చేపట్టే పనుల్లో చిత్తశుద్ధి కొరవడటంతో అవి ఎవరికీ ఉపకరించడం లేదు. ముందుచూపు లేకుండా మొక్కుబడిగా చేయడంతో ఎవరికీ అక్కరకు రావడం లేదు. మార్కాపురంలోని సప్లయ్ ఛానల్ పనులే దీనికి సజీవ సాక్ష్యం. -
ఉత్సాహంగా ఎడ్ల బల ప్రదర్శన
[ 21-05-2024]
మండలంలోని రామాపురంలో పట్టాభి రామస్వామి తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను అంబాల చినవెంకటరెడ్డి, నిర్వాహకులు ప్రారంభించారు. -
గుండ్లకమ్మ నదా! డంపింగ్ యార్డా..!!
[ 21-05-2024]
మార్కాపురం పట్టణానికి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ నది పెద్ద డంపింగ్ యార్డుగా మారింది. పట్టణంలోని నివాసాల నుంచి సేకరించిన చెత్తను నదిలో పడేస్తుండటంతో నది కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సీటు మినహా యూపీలో భాజపాకు ఓటమే: అఖిలేశ్
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సినీనటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షోపై రాళ్ల దాడి!
-
మరో వీడియో పోస్ట్ చేసిన నటి హేమ
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం