తెదేపా హయాంలోనే సంక్షేమానికి పెద్దపీట
వైకాపా పాలనలో కంటే తెదేపా హయాంలోనే సంక్షేమానికి బడ్జెట్లో ఎక్కువ ఖర్చుచేసినట్లు ఒంగోలు పార్లమెంటు తెదేపా అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు.
తెదేపా అభ్యర్థి నారాయణరెడ్డి సమక్షంలో తెదేపాలో చేరిన బాలసుబ్బారావు, తదితరులు
పొదిలి, మార్కాపురం పట్టణం, కొనకనమిట్ల, పొదిలి, పెద్దారవీడు, కంభం, యర్రగొండపాలెం పట్టణం,గిద్దలూరు పట్టణం : వైకాపా పాలనలో కంటే తెదేపా హయాంలోనే సంక్షేమానికి బడ్జెట్లో ఎక్కువ ఖర్చుచేసినట్లు ఒంగోలు పార్లమెంటు తెదేపా అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. సోమవారం కనిగిరి వెళ్తూ పొదిలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా అధికారంలో రావాలని పిలుపునిచ్చారు.
- ఓటింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ది తెదేపాలోకి వలసల జోరు కొనసాగుతుంది. వైకాపా జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు తడికమళ్ల బాలసుబ్బారావు తన అనుచరులతో తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సమక్షంలో తెదేపా చేరారు. మార్కాపురం పట్టణంలోని 24వ వార్డుకు చెందిన డీలర్ కేవీ నారాయణరెడ్డి వారి అనుచరులు తెదేపాలో చేరారు. నాయుడుపల్లె ఎస్సీ కాలనీకి చెందిన 20వైకాపా కుటుంబాలు కందుల రామిరెడ్డి నివాసం వద్ద తెదేపాలో చేరారు.
- నారాయణరెడి కాట్రకుంట లో కొనకనమిట్ల మండలంలో సోమవారం పర్యటించారు ఈ సందర్భంగా 25 కుటుంబాలు తెదేపాలో చేరాయి.
- పొదిలి 9వ వార్డులో సోమవారం కందుల సోదరి యేరువా లక్ష్మి, మాగుంట రాఘవరెడ్డి సతీమణి మాగుంట చందనారెడ్డి తెదేపా నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు.
- పెద్దారవీడు మండలంలోని హనుమాన్జంక్షన్కుంటలో సోమవారం మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎరిక్షన్బాబు ర్యాలీ నిర్వహించారు.
- .పెద్దదోర్నాలలో సోమవారం రాత్రి తెదేపా నిర్వహించిన రోడ్షోకు ప్రజలను మంచి స్పందన లభించింది. ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబులు స్థానిక ఏఎంసీ యార్డు నుంచి నటరాజ్ కూడలి మీదుగా శ్రీశైలం బస్టాండు వరకు ప్రదర్శన నిర్వహించారు
- కంభం మాజీ సర్పంచి స్టార్ బాష, ముస్లిం మైనార్టీ నాయకులు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
- పుల్లలచెరువు మండలం మల్లపాలెం, పీఆర్సీతండా లలో సోమవారం తెదేపా అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిలు విస్త్రతంగా ప్రచారం నిర్వహించారు.
- గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో ముత్తుముల అశోక్రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్.. వైకాపా పోలీసింగ్
[ 19-05-2024]
జిల్లాలోని కొందరు పోలీసులు అధికార పార్టీ వైకాపా తొత్తులుగా మారారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలక ప్రక్రియ అయిన పోలింగ్లో తమ ముసుగు తొలగించారు. నిసిగ్గుగా ఓ వర్గం వైపు నిలిచి కొమ్ము కాశారు. -
పెట్టిందే తిను.. అడక్కు మెనూ
[ 19-05-2024]
ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో రోగులకు ఆకలి కేకలు తప్పడం లేదు. గుత్తేదారు పెట్టిందే భోజనం. ఆయన ఎప్పుడు పెడితే అప్పుడు.. ఏది ఇస్తే అదే తినాలి తప్ప మెనూ అమలు పట్టదు. కారం పొడితే అల్పాహారం అందించినా అదేమని అధికారులు అడగరు. -
2,14,832 మంది ఓటుకు దూరం
[ 19-05-2024]
2024 సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. కొందరు గత అయిదేళ్లుగా జిల్లాలో అధికార పార్టీ నాయకులు సాగించిన అరాచకాలు, భూ ఆక్రమణలు, దందాలు, అక్రమ కేసులు, బెదిరింపులు తట్టుకోలేక ఓటేశారు. -
గెలుపోటముల్లో చెరి సగం
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు చేరాయి. -
ఒంగోలుకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
[ 19-05-2024]
ఎన్నికల విధుల్లో ఉంటూ ఇతర జిల్లాలో ఓటు వేసిన పోస్టల్ బ్యాలెట్లు శనివారం ఒంగోలుకు చేరాయి. జిల్లాకు చేరిన బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రకాశం భవన్లోని స్పందన సమావేశ మందిరంలో తెరిచారు. -
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 19-05-2024]
ఈ నెల 24 నుంచి నిర్వహించనున్న ఇంటర్, 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు; జూన్ ఒకటో తేదీ నుంచి జరగనున్న ఏపీ ఓపెన్ స్కూల్స్ ఇంటర్, 10వ తరగతి పరీక్షలు సజావుగా సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. -
నిమ్మ.. నష్టాలే మిగిల్చెనమ్మా!
[ 19-05-2024]
జిల్లాలో అత్యధికంగా నిమ్మ సాగు చేసే ప్రాంతాల్లో కనిగిరి ఒకటి. ఒకప్పుడు అధిక విస్తీర్ణంలో తోటలు సాగయ్యేవి. ఈ ప్రాంతాన్ని నిమ్మ వనంగా అభివర్ణించేవారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు
[ 19-05-2024]
ఆటో మినీలారీ ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం పొదిలి మండలం కంభాలపాడు సమీపంలో జరిగింది. -
బోలెరో ఢీకొని వాహన చోదకుడి మృతి
[ 19-05-2024]
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బొలోరో ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని తర్లుపాడు, సీతానాగులవరం గ్రామాల మధ్య చోటు చేసుకుంది. -
తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం
[ 19-05-2024]
తెలంగాణ మద్యం సీసాలను అక్రమంగా తీసుకువెళుతున్న వ్యక్తిని శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై బి.ప్రేమ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం -
చెంపపై కొట్టి.. జుట్టు పట్టుకుని లాగి...
[ 19-05-2024]
అధికార పార్టీకి ఓటేయాలంటూ ఓ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శిగా కె.అనూష పనిచేస్తున్నారు. -
గురుకులాల్లో ఇంటర్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
[ 19-05-2024]
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థులకు మెరిట్ ప్రకారం
తాజా వార్తలు (Latest News)
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM