చోదక ఒక్కక్షణం..!
సంతబొమ్మాళి మండలం తలగాం-రాజగోపాలపురం రహదారి మధ్యలో ఈ ఏడాది జనవరి 7న ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో ద్విచక్రవాహనదారుడు, ఆటో చోదకుడు మృతిచెందారు. రోడ్డు ఇబ్బందికరంగా ఉండటంతో వాహనాలు తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
నిబంధనలు పాటించకే ప్రమాదాలు
రహదారిపై పోతున్న ప్రాణాలు
* సంతబొమ్మాళి మండలం తలగాం-రాజగోపాలపురం రహదారి మధ్యలో ఈ ఏడాది జనవరి 7న ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో ద్విచక్రవాహనదారుడు, ఆటో చోదకుడు మృతిచెందారు. రోడ్డు ఇబ్బందికరంగా ఉండటంతో వాహనాలు తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
* ఆమదాలవలస మండలం శ్రీనివాసాచార్యులపేట పంచాయతీ మండాది గ్రామం వద్ద ఈ నెల 4వ తేదీ సాయంత్రం ఇసుక లారీ ఢీకొనడంతో నలుగురు మహిళలు మృతిచెందారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు అంటున్నారు.
* ఈ ఏడాది జనవరి 31వ తేదీన నరసన్నపేట మండలం దేవాది పైవంతెనపై ద్విచక్రవాహనం ముందు వెళుతున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొనడంతో గొర్లె వెంకట రమణ(16) మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మైనర్ ద్విచక్ర వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
* గతేడాది డిసెంబరులో పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రమేశ్ కుటుంబ సమేతంగా విశాఖపట్నం నుంచి వస్తుండగా నందిగాం మండలం పెద్దినాయుడుపేట వద్ద కల్వర్టును ఢీకొనటంతో తండ్రీ కొడుకులు మృత్యువాత పడ్డారు. సరిపడినంత విశ్రాంతి లేకపోవడమే కారణం.
పలాస, న్యూస్టుడే: ఎంతగా హెచ్చరిస్తున్నా.. ఎన్ని నిబంధనలు విధిస్తున్నా.. రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట పడటంలేదు. చోదకులు వాటిని పాటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. చోదకుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చి నిబంధనలు పాటించినప్పడే జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దగలమని నిపుణులు అంటున్నారు.
ఈ అంశాలు ప్రధానం..
* వాహనం రోడ్డుపైకి తీసేప్పుడు చోదకుల మానసిక స్థితి బాగుండాలి. క్రమశిక్షణతో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అనుమతించిన వేగంతో వాహనం నడపాలి.
* వాహనం కండిషన్ ఎప్పటికప్పుడు చెక్ చేయిస్తూ ఉండాలి. రహదారికి అనుగుణంగా వాహనాన్ని నడిపించాలి.
* మద్యం తాగి వాహనం నడపరాదు. చోదకులు తగినంత విశ్రాంతి తీసుకుంటుండాలి.
* 18 ఏళ్లలోపు వారికి వాహనాలు ఇవ్వకూడదు.
ఈ అంశాలను పాటిస్తే 90 శాతానికిపైగా ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. అలా కాకుండా ఎన్ని హెచ్చరికలు ఏర్పాటుచేసినా ప్రయోజనం ఉండడదని వారంటున్నారు. ఇంకా నిపుణులు ఏం చెబుతున్నారంటే..
అప్రమత్తత అవసరం...
- ఆర్.శంకరరావు, ఎస్ఐ, రహదారి భద్రతా విభాగం
ప్రయాణికులు తమ వాహనంలోనే ఎక్కాలనే ఆతృతలో కొందరు వాహనదారులు ప్రమాదాలు చేస్తున్నారు. వెనుక వచ్చే వాహనాలను ఎంతదూరంలో ఉన్నాయనే విషయాన్ని గుర్తించకుండానే రోడ్డు మధ్యలోనే ఉన్నట్టుండి ఆపేయడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. కొందరు రహదారులపై వాహనాలు ఆపి విశ్రాంతి తీసుకోవడం, బాగుచేసుకోవడం చేస్తుంటారు. ఇదీ ప్రమాదాలకు కారణమవుతోంది. ఆటోల్లో స్టీరియో, పాటలు నిషేధించాలి. వాహనాలను నడుపుతూ సెల్ఫోన్లో మాట్లాడకూడదు.
నలువైపులా దృష్టిపెట్టాలి
- సీహెచ్ శ్రీదేవి, జిల్లా రవాణా అధికారిణి, శ్రీకాకుళం
క్రమశిక్షణ లేకుండా వాహనాలు నడపటం, అధిక వేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటం, వాహనం నడుపుతూ సెల్ఫోన్ మాట్లాడటం, మద్యం తాగడం వంటి చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి. వాహనం నడిపే సమయంలో ముందు, వెనుక, రెండు పక్కలా ఇలా నాలుగువైపులా దృష్టి పెడుతుండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
[ 27-04-2024]
‘పల్లెల్లో అందరూ కలిసి ముందడుగు వేయండి. ఒకే మాటపై నిలబడండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తాం’ అని వైకాపా ప్రభుత్వం మూడేళ్ల కిందట పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. -
95 ఆమోదం.. 28 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా దాఖలైన నామపత్రాల పరిశీలన శుక్రవారం జరిగింది. 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో పరిశీలించారు. -
వైకాపా అభ్యర్థుల నామపత్రాలపై అభ్యంతరాలు
[ 27-04-2024]
-
కలమట బాధ్యతల స్వీకరణ
[ 27-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
ఓటర్లు 18,75,934 మంది
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఓటర్ల కొత్త జాబితా ఖరారైంది. ఈ నెల 15 నాటికి నమోదైనవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. -
మృత్యువులోనూ వీడని బంధం!
[ 27-04-2024]
వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి.. పెళ్లిళ్లు కూడా జరిపించారు. -
దశాబ్దాల వ్యధ.. శంకుస్థాపనకే పరిమితమైన కథ..!
[ 27-04-2024]
మూడు వైపులా మహేంద్రతనయ నది నీరు, మరో వైపు పంట పొలాలు. గ్రామం నుంచి బయటకు రావాలంటే నాటు పడవే శరణ్యం ఇదీ హిరమండలంలోని జిల్లేడుపేట గ్రామస్థుల పరిస్థితి. -
చుక్కలు చూపిస్తున్నారు
[ 27-04-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని కొండి, పూజారి వీధులకు బోరు నీరే తాగు నీరు. బోరు వేసే సమయంలో 100 అడుగులు మాత్రమే తవ్వి వదిలేయడంతో క్రమేపీ నీటి లభ్యత తగ్గిపోయింది. -
ఇది మీ పాలనకు మచ్చు తునక
[ 27-04-2024]
వైకాపా పాలనలో రోడ్లు ఎలాంటి దీన స్థితిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇచ్ఛాపురంలోని పలు గ్రామాల్లోని రోడ్లు ఛిద్రమై వాహనదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. -
నగరమంతా.. ట్రాఫిక్ తంటా
[ 27-04-2024]
రోజురోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా నగరంలో నిత్యం ట్రాఫిక్ సవస్యలు అధికమవుతున్నాయి. డేఅండ్నైట్, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి మిల్లు, పొట్టిశ్రీరాములు, ఏడురోడ్ల కూడళ్లలో వాహనాల రద్దీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
అరాచక పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని భాజపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదటి ఈశ్వరరావు అన్నారు. -
కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం ఖాయమని తెదేపా ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం
[ 27-04-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్