‘వాలంటీర్లను మానిపించేద్దామా చెప్పండి?’
వాలంటీర్లను మానిపించేద్దామా చెప్పండి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలను ప్రశ్నించారు.గార మండలం సతివాడ, కొర్లాం సచివాలయాల పరిధిలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది.
ప్రసంగిస్తున్న మంత్రి ధర్మాన, వేదికపై వైకాపా నాయకులు
గార, న్యూస్టుడే: వాలంటీర్లను మానిపించేద్దామా చెప్పండి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలను ప్రశ్నించారు.గార మండలం సతివాడ, కొర్లాం సచివాలయాల పరిధిలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఎన్నికల ముందు మీకు చెప్పినవన్నీ చేశాం. మరి ఇప్పుడు ఓ సినిమా యాక్టర్ వచ్చి వాలంటీర్లు పనికిమాలినవారని తిడుతున్నారు. ఆయనకు తెలియాలి కదా.. ఇలాంటివి వచ్చి చూస్తే తెలుస్తుంది. సినిమా వేరు.. నిజ జీవితం వేరు.. ప్రజల జీవన విధానాన్ని పరిశీలించినోడికి మాత్రమే అది తెలుస్తుంది. వాలంటీర్లు వేస్టు అంటున్నారు.. నిజమేనా.. వాళ్లని మాన్పించేద్దామా.. చెప్పండి.’ అని అన్నారు. దీనికి ఒక మహిళ స్పందిస్తూ లేదు.. వాలంటీర్లు ఉండాలని చెప్పారు. ఎన్నికలప్పుడు ఓటేస్తే బ్యాంకుల్లో అప్పులు తీర్చేస్తానని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరువాత అయిదేళ్లు కనిపించకుండా పోయారని మంత్రి విమర్శించారు. మాట మీద నిలబడిన ప్రభుత్వాన్ని తీసుకువచ్చేలా ఆలోచన చేయాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. ఎంపీపీ గొండు రఘురాం, ప్రత్యేకాధికారి రామారావు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీరి విధ్వంసానికి అడ్డేది..?
[ 17-05-2024]
పగలు లేదు.. రాత్రి లేదు.. ఇసుకాసురుల అక్రమాలకు అడ్డేలేదు.. అయిదేళ్ల పాలనలో వైకాపా నాయకుల కనుసన్నల్లో దోపిడీ జరిగింది. -
క్రీడాకారులతో ఆటలు..!
[ 17-05-2024]
ఆడటం అనుకున్నంత సులువేం కాదు.. ప్రతిభ ఉంటేనే మైదానంలో రాణించగలరు. ఈ విషయాన్ని పక్కన పెట్టేసి.. ప్రతిభను తొక్కిపెడుతుండటంతో జిల్లా క్రికెట్ క్రీడాకారులకు అన్యాయం జరుగుతోంది. -
నీరసించిపోతున్నాయ్..!
[ 17-05-2024]
పలాస నియోజకవర్గంలో వ్యవసాయ భూములన్నీ వర్షాధారమైనవే. జలాశయాలు, పెద్ద చెరువులు ఉన్నా వర్షాలు కురిస్తేనే వాటిలోకి నీరు చేరుతుంది. -
లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెల భద్రత
[ 17-05-2024]
జిల్లాలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశించారు. -
ఈఏపీసెట్ ప్రారంభం
[ 17-05-2024]
ఇంటర్మీడియట్ అనంతరం ఇంజినీరింగ్, వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండ్రీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీ.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్-2024 పరీక్షలు జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో గురువారం ప్రారంభమయ్యాయి. -
అందుబాటులోకి ఇంకెప్పుడు?
[ 17-05-2024]
వైకాపా హయాంలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో జరుగుతున్న పనులకు సకాలంలో బిల్లులు మంజూరుకాక గుత్తేదారులు ఇబ్బంది పడ్డారు. -
అయిదుగురి జీవితాల్లో వెలుగు
[ 17-05-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జీవన్మృతుడైన వ్యక్తి అవయవదానం అయిదుగురి జీవితాల్లో వెలుగు నింపింది. -
ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ
[ 17-05-2024]
ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట పంచాయతీ కొయిరాళ్లు కూడలి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. -
భీమడోలులో పలాస వాసి దుర్మరణం
[ 17-05-2024]
పదహారో నంబరు జాతీయ రహదారిపై ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో పలాస వాసి దుర్మరణం పాలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!