ఇవి తాగేనీళ్లా..?
‘వర్షాకాలం.. వ్యాధుల ముప్పు పొంచి ఉండేసమయం.. స్వచ్ఛమైన తాగునీటిని వినియోగించండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి’ ఇదీ మన వైద్యఆరోగ్యశాఖ చేస్తున్న ప్రచారం.. కానీ తాగునీటి సరఫరా యంత్రాంగానికి మాత్రం అవేం పట్టలేదు.
కుళాయిల ద్వారా రంగుమారిన జలాలు సరఫరా
టెక్కలి మండలంలో రక్షిత నీటిపథకం నిర్వహణ తీరు
న్యూస్టుడే, టెక్కలి పట్టణం
‘వర్షాకాలం.. వ్యాధుల ముప్పు పొంచి ఉండేసమయం.. స్వచ్ఛమైన తాగునీటిని వినియోగించండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి’ ఇదీ మన వైద్యఆరోగ్యశాఖ చేస్తున్న ప్రచారం.. కానీ తాగునీటి సరఫరా యంత్రాంగానికి మాత్రం అవేం పట్టలేదు. ఇందుకు ఉదాహరణ టెక్కలి మండల దాహార్తి తీర్చే నీటి పథకం నిర్వహణ తీరే.. ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత నీటి పథకం నుంచి కొద్దిరోజులుగా సరఫరా చేస్తున్న నీటిని చూస్తే అసలు దీన్ని ఎలా తాగగలం అన్న సందేహం కలుగుతోంది. పూర్తిగా రంగుమారిన బురదనీరే కుళాయిల ద్వారా సరఫరా కావడంతో జలమా.. గరళమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యామ్నాయం లేక ఈ నీటినే వినియోగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నీరుగారుతోన్న లక్ష్యం..
కొన్ని దశాబ్దాల కాలంగా నీటికష్టాలు అనుభవిస్తున్న టెక్కలి ప్రజల దాహార్తిని తీర్చేందుకు 2016లో అప్పటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. వంశధార ఎడమ ప్రధాన కాలువ పక్కనే దీన్ని నిర్మించి అందులోని నీటిని శుద్ధిచేసి ప్రజలకు అందించాలన్నది పథకం ఉద్దేశం. దీనికోసం 0.1 టీఎంసీల సామర్థ్యం ఉన్న సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మించారు. ఏటా వర్షాకాలంలో వంశధార కాలువ నుంచి వచ్చే నీటిని నిల్వచేసి ఏడాది పొడవునా ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంది. కొన్నేళ్లుగా వర్షాకాలంలో కేవలం బురదనీరే ప్రజలకు పంపిణీ జరుగుతోంది. బిందెల్లో అడుగున బురద మేట వేస్తోందని, కాచి వడపోసినా నీరు బురదగానే కనిపిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిస్థాయిలో శుద్ధి కావట్లేదు..
రక్షిత నీటిపథకం నిర్వహణపై ప్రజల్లో అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. పథకం చుట్టూ ఉన్న రక్షణ కంచె పలు చోట్ల ధ్వంసమైంది. పశువులు ట్యాంకు గట్టుపైకి చేరుతున్నాయి. నిండా పేరుకుపోయిన నాచులో పలుచోట్ల తాగి పడేసిన మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. నీటిని శుద్ధిచేసే విభాగంలో రాళ్లు, కంకర, బొగ్గు, ఇతర పదార్థాలతో ఏర్పాటు చేసిన బెర్త్లను అప్పటి నుంచి మార్చకపోవడం వల్లే నీరు పూర్తిస్థాయిలో శుద్ధికావడం లేదని ఆరోపిస్తున్నారు. క్లోరినేషన్, ఆలమ్ పదార్థాల వినియోగంపైనా విమర్శలున్నాయి.
ఎందుకూ పనికిరావడం లేదు
- కాపల సుజాత, టెక్కలి
కుళాయిల ద్వారా కొద్దిరోజులుగా సరఫరా జరుగుతున్న నీరు ఎందుకూ పనికిరావడం లేదు. చెరువుల్లో నీరైనా కాస్త స్వచ్ఛంగా కనిపిస్తోంది. నేరుగా కాలువలో నీటినే సరఫరా చేస్తున్నట్లు ఉంటుండటంతో తాగేందుకు, స్నానాలకు వినియోగించలేకపోతున్నాం. శుద్ధజలాన్ని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.
పరిశీలించి చర్యలు చేపడతాం
- మోహన్, జేఈ, గ్రామీణ నీటిసరఫరా విభాగం, టెక్కలి
రక్షిత నీటిపథకం సమ్మర్ స్టోరేజీ ట్యాంకులోకి ప్రస్తుతం వంశధార కాలువ నుంచి వస్తున్న నీటిని పంపింగ్ చేస్తుండటం వల్ల బురద నీరు వస్తోంది. క్లోరేనేషన్తో పాటు ఆలమ్ను కలుపుతున్నా సమస్య పరిష్కారం కావడంలేదు. ఎక్కువ మొత్తంలో ఆలమ్కలిపి నీటిని శుద్ధిచేసే ప్రక్రియ చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీరి విధ్వంసానికి అడ్డేది..?
[ 17-05-2024]
పగలు లేదు.. రాత్రి లేదు.. ఇసుకాసురుల అక్రమాలకు అడ్డేలేదు.. అయిదేళ్ల పాలనలో వైకాపా నాయకుల కనుసన్నల్లో దోపిడీ జరిగింది. -
క్రీడాకారులతో ఆటలు..!
[ 17-05-2024]
ఆడటం అనుకున్నంత సులువేం కాదు.. ప్రతిభ ఉంటేనే మైదానంలో రాణించగలరు. ఈ విషయాన్ని పక్కన పెట్టేసి.. ప్రతిభను తొక్కిపెడుతుండటంతో జిల్లా క్రికెట్ క్రీడాకారులకు అన్యాయం జరుగుతోంది. -
నీరసించిపోతున్నాయ్..!
[ 17-05-2024]
పలాస నియోజకవర్గంలో వ్యవసాయ భూములన్నీ వర్షాధారమైనవే. జలాశయాలు, పెద్ద చెరువులు ఉన్నా వర్షాలు కురిస్తేనే వాటిలోకి నీరు చేరుతుంది. -
లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెల భద్రత
[ 17-05-2024]
జిల్లాలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశించారు. -
ఈఏపీసెట్ ప్రారంభం
[ 17-05-2024]
ఇంటర్మీడియట్ అనంతరం ఇంజినీరింగ్, వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండ్రీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీ.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్-2024 పరీక్షలు జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో గురువారం ప్రారంభమయ్యాయి. -
అందుబాటులోకి ఇంకెప్పుడు?
[ 17-05-2024]
వైకాపా హయాంలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో జరుగుతున్న పనులకు సకాలంలో బిల్లులు మంజూరుకాక గుత్తేదారులు ఇబ్బంది పడ్డారు. -
అయిదుగురి జీవితాల్లో వెలుగు
[ 17-05-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జీవన్మృతుడైన వ్యక్తి అవయవదానం అయిదుగురి జీవితాల్లో వెలుగు నింపింది. -
ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ
[ 17-05-2024]
ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట పంచాయతీ కొయిరాళ్లు కూడలి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. -
భీమడోలులో పలాస వాసి దుర్మరణం
[ 17-05-2024]
పదహారో నంబరు జాతీయ రహదారిపై ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో పలాస వాసి దుర్మరణం పాలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?