బరితెగింపు
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పది రోజులు దాటినా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వైకాపా జెండాను పోలిన రంగులతో ప్రభుత్వ వాహనాలు, భవనాలు దర్శనమిస్తున్నా వాటిపై చర్యలు లేకుండా పోయాయి.
జాతీయ రహదారిపై శ్రీకాకుళం నగర సమీపంలో పెద్దపాడు వద్ద సీతంపేటకు చెందిన బియ్యం బండి ఇలా ముఖ్యమంత్రి ఫొటోకు ముసుగు లేకుండా తిరుగుతూ కనిపించింది. -న్యూస్టుడే, టెక్కలి పట్టణం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పది రోజులు దాటినా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వైకాపా జెండాను పోలిన రంగులతో ప్రభుత్వ వాహనాలు, భవనాలు దర్శనమిస్తున్నా వాటిపై చర్యలు లేకుండా పోయాయి. మరోపక్క వాలంటీర్లు, వివిధ శాఖల సిబ్బంది యథేచ్ఛగా అధికార పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. కోడ్ తమకేం అడ్డు అన్నట్లుగా బరితెగించి నాయకులతో కలిసి తిరుగుతున్నారు.
న్యూస్టుడే, బృందం
వాలంటీర్లపై వేటు..
వైకాపా టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్తో కలిసి సంతబొమ్మాళి గ్రామ వాలంటీర్లు కల్లూరి పాపారావు, వాదాల దుర్గారావు, అట్టాడ కామేశ్వరరావు, బొమ్మాళి ఉమాశంకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు సీ-విజిల్ యాప్కు ఫిర్యాదు చేశారు. ఆధారాలను పరిశీలించిన నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్కమర్ వాలంటీర్లను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారిని తొలగించినట్లు ఎంపీడీవో ఉమాసుందరి తెలిపారు. వైకాపా తరఫున ప్రచారంలో పాల్గొన్న బోరుభద్రకు చెందిన వాలంటీర్లు బి.శ్రీలత, అశ్వినీలను తీసివేసినట్లు ఎంపీడీవో చెప్పారు.
దువ్వాడ శ్రీనివాస్తో ఎన్నికల ప్రచారంలో గ్రామ వాలంటీరు కామేశ్వరరావు
న్యూస్టుడే, సంతబొమ్మాళి
ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు
సారవకోట, న్యూస్టుడే: పెద్దలంబ పంచాయతీ మూగుపురం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు చౌదరి లక్ష్మీనారాయణకు డీఈవో కె.వెంకటేశ్వరరావు గురువారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. సదరు ఉపాధ్యాయుడు ఆయన వాట్సాప్ గ్రూపులో పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గిరిజన ఐక్యవేదిక బలపరచిన వ్యక్తికి ఓటు వేయాలని, రాజకీయ ప్రచారం చేస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. స్పందించిన డీఈవో 24 గంటల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఉపాధ్యాయుడికి నోటీసు పంపించారు. నోటీసు అందుకున్న ఉపాధ్యాయుడు లిఖిత పూర్వక వివరణ ఇవ్వడంతో డీఈవోకు అందించినట్లు ఎంఈవో తెలిపారు.
దిగని అధికార మత్తు
న్యూస్టుడే, సారవకోట: వైకాపా నరసన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ప్రచారంలో మద్యం దుకాణ ఉద్యోగులు పాల్గొన్నారు. సారవకోటలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో వాచ్మేన్గా పనిచేస్తున్న చంద్రమౌళి, ఇదే మండలం అవలింగి దుకాణంలో పనిచేస్తున్న ఆర్.సంతోష్ పాల్గొన్నారు. స్థానిక తెదేపా నాయకులు గుర్తించి ఎంపీడీవో రాంబాబుకు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
[ 27-04-2024]
‘పల్లెల్లో అందరూ కలిసి ముందడుగు వేయండి. ఒకే మాటపై నిలబడండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తాం’ అని వైకాపా ప్రభుత్వం మూడేళ్ల కిందట పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. -
95 ఆమోదం.. 28 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా దాఖలైన నామపత్రాల పరిశీలన శుక్రవారం జరిగింది. 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో పరిశీలించారు. -
వైకాపా అభ్యర్థుల నామపత్రాలపై అభ్యంతరాలు
[ 27-04-2024]
-
కలమట బాధ్యతల స్వీకరణ
[ 27-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
ఓటర్లు 18,75,934 మంది
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఓటర్ల కొత్త జాబితా ఖరారైంది. ఈ నెల 15 నాటికి నమోదైనవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. -
మృత్యువులోనూ వీడని బంధం!
[ 27-04-2024]
వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి.. పెళ్లిళ్లు కూడా జరిపించారు. -
దశాబ్దాల వ్యధ.. శంకుస్థాపనకే పరిమితమైన కథ..!
[ 27-04-2024]
మూడు వైపులా మహేంద్రతనయ నది నీరు, మరో వైపు పంట పొలాలు. గ్రామం నుంచి బయటకు రావాలంటే నాటు పడవే శరణ్యం ఇదీ హిరమండలంలోని జిల్లేడుపేట గ్రామస్థుల పరిస్థితి. -
చుక్కలు చూపిస్తున్నారు
[ 27-04-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని కొండి, పూజారి వీధులకు బోరు నీరే తాగు నీరు. బోరు వేసే సమయంలో 100 అడుగులు మాత్రమే తవ్వి వదిలేయడంతో క్రమేపీ నీటి లభ్యత తగ్గిపోయింది. -
ఇది మీ పాలనకు మచ్చు తునక
[ 27-04-2024]
వైకాపా పాలనలో రోడ్లు ఎలాంటి దీన స్థితిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇచ్ఛాపురంలోని పలు గ్రామాల్లోని రోడ్లు ఛిద్రమై వాహనదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. -
నగరమంతా.. ట్రాఫిక్ తంటా
[ 27-04-2024]
రోజురోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా నగరంలో నిత్యం ట్రాఫిక్ సవస్యలు అధికమవుతున్నాయి. డేఅండ్నైట్, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి మిల్లు, పొట్టిశ్రీరాములు, ఏడురోడ్ల కూడళ్లలో వాహనాల రద్దీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
అరాచక పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని భాజపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదటి ఈశ్వరరావు అన్నారు. -
కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం ఖాయమని తెదేపా ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం
[ 27-04-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM