logo

‘మేమంతా సిద్ధం’ సభకు 80 ఆర్టీసీ బస్సులు

వైకాపా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు. శుక్రవారం కాకినాడలో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 40, రెండో డిపో నుంచి 40 బస్సులను గురువారం రాత్రి పిఠాపురానికి పంపారు.

Published : 19 Apr 2024 04:50 IST

 శ్రీకాకుళం నగరం నుంచి బయలుదేరిన బస్సు

అరసవల్లి న్యూస్‌టుడే: వైకాపా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు. శుక్రవారం కాకినాడలో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 40, రెండో డిపో నుంచి 40 బస్సులను గురువారం రాత్రి పిఠాపురానికి పంపారు. అక్కడ సభ ముగిసిన వెంటనే శనివారం అనకాపల్లిలో జరగనున్న సిద్ధం సభకు సైతం జనాలను తరలించేందుకు అవే బస్సులను వినియోగించనున్నారు. జిల్లాలో మొత్తం 328 బస్సులు ఉండగా.. అందులో 80 బస్సులను వైకాపా సభకు కేటాయించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని