కర్కశ ప్రభుత్వమా.. కనిపించదా కష్టం..!
రాజకీయంగా లబ్ధి పొందాలనే దురాలోచనతో అధికార పార్టీ ఆడిస్తున్న వికృత క్రీడకు రాష్ట్ర ప్రభుత్వం వంత పాడుతోంది. ఇంటి వద్దే పింఛన్లు అందజేసే అవకాశాలన్నింటినీ పక్కన పెట్టేసి.. జగన్ సర్కారుకు లబ్ధి చేకూర్చాలనే శైలిలో వ్యవహరిస్తోంది.
పింఛన్ల పేరిట ప్రభుత్వం వికృత క్రీడ
లబ్ధిదారులను ఇబ్బంది పెట్టేందుకు కుట్ర
న్యూస్టుడే, శ్రీకాకుళం అర్బన్
రాజకీయంగా లబ్ధి పొందాలనే దురాలోచనతో అధికార పార్టీ ఆడిస్తున్న వికృత క్రీడకు రాష్ట్ర ప్రభుత్వం వంత పాడుతోంది. ఇంటి వద్దే పింఛన్లు అందజేసే అవకాశాలన్నింటినీ పక్కన పెట్టేసి.. జగన్ సర్కారుకు లబ్ధి చేకూర్చాలనే శైలిలో వ్యవహరిస్తోంది. మండుటెండలో పండుటాకులను బ్యాంకుల వైపు అడుగులు వేయించి.. వారిని అష్టకష్టాలు పెట్టాలనే కుట్రకు తెరలేపింది. ఆ అభాండాన్ని ప్రతిపక్షాలపై నెట్టేయాలనే కుట్రలో అవ్వాతాతలను బలి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. బ్యాంకులకు వెళ్లలేమని.. ఇంటి వద్దే పింఛను అందించేలా చూడాలని వృద్ధులు వేడుకుంటున్నా మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది.
- కొత్తూరు మండలంలో 8,109 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి అందుబాటులో 7 బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. అంటే సగటున ఒక్కో బ్యాంకు శాఖ ద్వారా 1,158 మందికి పింఛను అందించినా.. అందరికీ నగదు చేతికి అందేసరికి పది రోజులు పడుతుంది. ఆ బ్యాంకులకు వెళ్లాలంటే చాలా మంది కొండలు దాటి, కి.మీ. ప్రయాణించి చేరుకోవాలి. ఇదంతా వ్యయప్రయాసలతో కూడుకున్న పని. మందస మండలంలోనూ దాదాపు ఇదే పరిస్థితి.
- కంచిలి మండలంలో 3 బ్యాంకులు మాత్రమే సేవలందిస్తున్నాయి. ఆ మండల పరిధిలోని నువగడ, కుంబరినౌగం గ్రామాల ప్రజలు బ్యాంకులకు రావాలంటే సుమారు 20 కి.మీ. ప్రయాణించాలి. వారికి బస్సు సౌకర్యం లేదు. ఆటోలు కూడా అంతంతమాత్రమే.
- సంతబొమ్మాళి, నందిగాం, ఎల్ఎన్పేట, లావేరు, కంచిలి, హిరమండలం, జి.సిగడాం, బూర్జ మండలాల్లో కేవలం మూడు బ్యాంకు శాఖలు మాత్రమే ఉన్నాయి. ఆయా మండలాల పరిధిలో పింఛను లబ్ధిదారులు మాత్రం 9 నుంచి 4 వేల మధ్యలో ఉండటం గమనార్హం.
శ్రీకాకుళం నగరంలోని ఓ బ్యాంకు వద్ద పింఛను నగదు కోసం వేచి ఉన్న సచివాలయ ఉద్యోగిని
జిల్లాలో 732 సచివాలయాలు ఉన్నాయి. ఆయా సిబ్బంది ద్వారా బుధవారం 77,929 మంది పింఛనుదారులకు రూ.20.78 కోట్లు పంపిణీ చేయనున్నారు. 2,42,957 మందికి 243 బ్యాంకుల ద్వారా రూ.72.88 కోట్లు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. డీబీటీ విధానంలో బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తే.. ఎవరి ఖాతాల్లో డబ్బులు పడ్డాయో.. పడలేదో అనే సమాచారం తెలిసే అవకాశం ఉండదు. ప్రభుత్వం మూడు నెలల కిందట ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు డీబీటీ విధానంలోనే నగదు జమ చేశామని చెప్పింది. నేటికీ చాలా మంది ఖాతాల్లో డబ్బులు పడలేదు. పింఛన్ల విషయంలోనూ ఇలాగే జరిగితే వృద్ధులు సొమ్ముల కోసం బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పదు. మేడే సందర్భంగా ఒకటో తేదీన బ్యాంకులన్నిటికీ సెలవు. లబ్ధిదారులు డబ్బులు తీసుకోవాలంటే రెండో తేదీ నుంచి బ్యాంకులకు వెళ్లాలి.
బ్యాంకుల వద్ద ఈ ఇక్కట్లు తప్పవు..
- ఒక్క బ్యాంకు శాఖలో సిబ్బంది, సమయాభావం పరిస్థితుల దృష్ట్యా రోజుకు 100 మంది కంటే ఎక్కువ నగదు ఉపసంహరణకు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.
- లావాదేవీలు జరపకుండా ఆగిపోయిన ఖాతాలు పునరుద్ధరించాలంటే లబ్ధిదారులు కచ్చితంగా బ్యాంకులకు రావాల్సిందే. ఇందుకు కనీసం ఒకట్రెండు వారాల సమయం పడుతుంది.
- ఖాతాలు సక్రమంగా ఉంటే ఏటీఎం కేంద్రాలు, బ్యాంకు మిత్రల వద్ద నగదు తీసుకోవచ్చు. ప్రైవేటుగా ఏఈపీఎస్ ద్వారా నగదు పొందాలంటే.. అక్కడ రూ.1,000కి రూ.100 కమీషన్ వసూలు చేస్తున్నారు. అలా డబ్బులు తీసుకోవాలంటే ఒక్కో లబ్ధిదారుడు రూ.300 కమిషన్ రూపంలో సమర్పించుకోవాల్సి వస్తుంది.
- బ్యాంకుల ద్వారా ఆర్థిక లావాదేవీలకు ఎక్కువగా సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. వాటిపై వృద్ధులు, దివ్యాంగులకు అవగాహన ఉండే వీలు లేకపోవడంతో సేవలందడంలో తప్పనిసరిగా జాప్యం జరుగుతుంది.
- ప్రతి నెలా మొదటివారంలో సాధారణంగానే సామాజిక భద్రత పింఛన్లతో పాటు, మాజీ ఉద్యోగుల పెన్షన్, ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం బ్యాంకులకు క్యూ కడతారు. ఇలాంటి రద్దీ సమయంలో వృద్ధులకు అక్కడి వెళ్తే కష్టాలు తప్పవు.
సరైన నిర్ణయం కాదు..
పింఛను సొమ్ము బ్యాంకుల ద్వారా ఇవ్వాలనే నిర్ణయం సరికాదు. ఏ బ్యాంకు శాఖలో కూడా వంద మంది కంటే ఎక్కువ నగదు ఉపసంహరణలు జరపడం సాధ్యం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో సగానికిపైగా వృద్ధుల ఖాతాలు లావాదేవీలు జరగకపోవడంతో నిలిచిపోయాయి. అలాంటి వారికి కష్టాలు తప్పవు. వారందరికీ పింఛను డబ్బులు చేతికందేసరికి నెలరోజులు పడుతుంది.
జె.శ్రీనివాసరావు, విశ్రాంత మేనేజర్, ఏపీజీవీబీ
20 కిలోమీటర్లు ప్రయాణించాలి..
మా ఊరి నుంచి పింఛన్ కోసం చాపరలో ఉన్న బ్యాంకుకు వెళ్లాలంటే 8 కిలోమీటర్లు కాలినడకన నేలబొంతు చేరుకోవాలి. ఆటోలో 10 కి.మీ. దూరం ప్రయణించి మెళియాపుట్టికి.. అక్కడి నుంచి మరో రెండు కిలోమీటర్లు వెళ్తే చాపర వస్తుంది. వయో భారంతో అంత దూరం ప్రయాణించలేను. ఇంటి వద్దే పింఛను అందించాలి.
గూడ పొట్టెమ్మ, చందనగిరి, మెళియాపుట్టి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దూసుకొస్తున్నాయ్.. మృత్యు వాహనాలు..!
[ 21-05-2024]
మూలపేట పోర్టుతో అందరి బతుకుల్లో మార్పు వస్తుందని భావించిన అక్కడి ప్రజలకు తీరని శోకం మిగులుతోంది.. పోర్టు నిర్మాణానికి చేపడుతున్న కార్యకలాపాలు పరిసర గ్రామాల వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. -
వేట లేదు.. భృతి అందలేదు
[ 21-05-2024]
సముద్రంలో మర బోట్లతో చేపల వేట నిషేధం విధించి నెల రోజులు దాటినా ప్రభుత్వం నుంచి సాయం అందక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి లేక జీవనం భారమై నరకయాతన అనుభవిస్తున్నామని వాపోతున్నారు. -
రేవుల్లోకి అధికారుల బృందం
[ 21-05-2024]
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఇటీవల ఆదేశించడంతో జిల్లా అధికారులు ఎట్టకేలకు కదిలారు. కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, కమిటీ సభ్యులు సోమవారం రెండు రీచ్లను పరిశీలించారు. -
వెంకన్న దర్శనం.. భక్తజన పారవశ్యం..
[ 21-05-2024]
నరసన్నపేట వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 21-05-2024]
జిల్లాలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అధికారులను ఆదేశించారు. -
ఆశలు నీరుగార్చేశారు..!
[ 21-05-2024]
రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం తప్ప, అన్నదాతల మేలు కోసం ఒరగబెట్టిందేమీ లేదనేందుకు నారాయణపురం కుడి కాలువ పరిస్థితి చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
పట్టణంలో దాహం కేకలు
[ 21-05-2024]
ఇచ్ఛాపురం పురపాలకసంఘ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నాలుగు ట్యాంకర్లతో నీరు అవసరమైన చోటుకు తరలించాల్సిన అధికారులు రెండింటితోనే సరిపెడుతున్నారు. -
29 కేంద్రాల్లో 50 శాతం లోపే..!
[ 21-05-2024]
శ్రీకాకుళం నియోజకవర్గంలో కీలకమైన నగరంలో పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో లేదు. మొత్తం 279 పోలింగ్ కేంద్రాలు ఉండగా కొన్ని చోట్ల 50 శాతం కంటే తక్కువ నమోదైంది. -
పార్టీ మారారని నీటి సరఫరా నిలిపివేత
[ 21-05-2024]
వైకాపా నుంచి తెదేపాలోకి మారామని కక్ష గట్టి పైపులైన్ మరమ్మతుల పేరిట నీటి సరఫరాను నిలిపేశారంటూ గ్రామానికి చెందిన వజ్జ లోకేశ్వరరావు ఎంపీడీవో జి.భాస్కరరావుకు ఫిర్యాదు చేశారు. -
వైకాపా ఎంపీ అభ్యర్థి గృహ నిర్బంధం
[ 21-05-2024]
వైకాపా శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ను నందిగాం పోలీసులు సోమవారం ఆయన స్వగ్రామం కణితివూరులో గృహ నిర్బంధం చేశారు. -
మహేంద్రతనయ నదిలో దిగి కొసమాల వాసి జలసమాధి
[ 21-05-2024]
గజపతి జిల్లా గోసాని బ్లాక్లోని బాగుసాల పంచాయతీ సదర్ మహకుమా గ్రామం గుండా ప్రవహించే మహేంద్రతనయ నదిలో పడి ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
[ 21-05-2024]
పాతపట్నం మండలం కోదూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి
-
కొత్త బ్రాండ్ల మద్యం కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు: మంత్రి జూపల్లి
-
చైనా ఆక్రమిస్తే.. కిల్ స్విచ్ ఆన్ అవుతుంది: సెమీకండెక్టర్ తయారీ సంస్థల ప్లాన్..!
-
యూరప్ ట్రిప్ మరింత భారం.. షెంజెన్ వీసా ఫీజు పెంపు
-
బీఎస్ఈ మార్కెట్ క్యాప్ @ 5 ట్రిలియన్.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం