4 నుంచి పోస్టల్ బ్యాలెట్ వినియోగం
ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమైన ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో జిల్లా అంతటా ఒకే చోట పోస్టల్ బ్యాలెట్ను వినియోగించారు.
కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్టుడే: ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమైన ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో జిల్లా అంతటా ఒకే చోట పోస్టల్ బ్యాలెట్ను వినియోగించారు. ఈసారి ఏ నియోజకవర్గ పరిధిలో వారికి అక్కడే ఓటు వేసేలా వెసులుబాటునిచ్చారు. 4న పీవో, ఏపీవో, సూక్ష్మ పరిశీలకులు, పోలీసు అధికారులు, కంట్రోల్ రూమ్ సిబ్బంది, తదితర శాఖలు, 5న ఓపీవో, సెక్టార్ అధికారులు, కంట్రోల్ రూమ్ సిబ్బంది, ఇతర బృందాల్లో విధులు నిర్వర్తిస్తున్నవారు, 6న పోలీసు సిబ్బంది, ప్రైవేటు డ్రైవర్లు, ఏపీఎస్ఆర్టీసీ, ఎన్నికల విధుల్లో ఉన్న వీడియో గ్రాఫర్లు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, మాజీ సైనికులు, ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న ఎన్నికల సిబ్బంది ఓటు వేయనున్నారు. 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోలేకపోయినవారికి 7న (రిజర్వ్డే) మరో అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 24,708 మంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వర్తకులే దిక్కు..?
[ 22-05-2024]
ఖరీఫ్ కాలంలో అన్నదాతలకు ఏటా విత్తన పాట్లు తప్పడం లేదు. అవసరమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో వేరే దారిలేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.. గతేడాది సాంబ రకం కావాలని వేడుకున్నా ప్రభుత్వం వాటిని అరకొరగానే రాయితీపై అందించింది. -
కొండ కరిగిపోతోంది..!
[ 22-05-2024]
కోటబొమ్మాళి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు కూతవేటు దూరంలో, జనావాసాలకు ఆనుకుని ఉన్న కొండలను కొల్లగొడుతున్నా అధికార యంత్రాంగం మాత్రం నిద్రపోతోంది.. -
ఓట్ల లెక్కింపు ప్రక్రియ వీడియో తీయాలి
[ 22-05-2024]
వచ్చే నెల నాలుగో తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మొత్తం చిత్రీకరించాలని సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్ అధికారులను ఆదేశించారు. -
నెరవేరని లక్ష్యం..!
[ 22-05-2024]
రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) నిధులతో నిర్మించిన గోదాంలు అన్నదాతలకు అక్కరకు రావడం లేదు. కొన్ని పూర్తికాగా మరొకొన్ని పునాదుల స్థాయిలో ఆగిపోయాయి. -
పాముకాటుకు బాలుడి మృతి
[ 22-05-2024]
టెక్కలి మండలం రావివలస పంచాయతీ చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన దాసరి సాయివినీత్ (13) పాముకాటుకు గురై మంగళవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. -
వైభవంగా బ్రహ్మాండ నాయకుని అశ్వవాహన సేవ
[ 22-05-2024]
అసంఖ్యాక భక్తుల నడుమ శ్రీనివాసుని అశ్వవాహన సేవ కనుల పండువగా సాగింది. నరసన్నపేటలోని వెంకటేశ్వరాలయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో మంగళవారం -
ఉక్కు ఉద్యోగి ఆత్మహత్య
[ 22-05-2024]
ఆర్థిక ఇబ్బందులతో ఉక్కు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్టు స్టీల్ప్లాంట్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఉక్కునగరం సెక్టారు-11లోని ‘327-ఈ’ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ఉక్కు ఎస్ఎంఎస్ ఉద్యోగి తీగల చిరంజీవులు -
అలంకారప్రాయం
[ 22-05-2024]
శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం అలంకారప్రాయంగా మారింది. సంబంధిత అధికారులు నిర్వహణను విస్మరించడంతో శిథిలావస్థకు చేరుతోంది. -
మూడు లారీలు, పొక్లెయిన్ సీజ్
[ 22-05-2024]
ఆమదాలవలస మండలం చెవ్వాకులపేట వద్ద వంశధార నదీగర్భంలో మంగళవారం మూడు లారీలు, పొక్లెయిన్ ఉన్నందున వాటిని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. -
రౌడీషీటర్ల బైండోవర్
[ 22-05-2024]
ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతుండటంతో జిల్లాలో శాంతిభద్రతలపై పోలీసు శాఖ అప్రమత్తమైంది. ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో రౌడీషీటర్ల కదలికలపై దృష్టి సారించింది.